[గిద్దలూరు సాయి కిషోర్ గారు రచించిన ‘ఆజ్ఞ మేరకు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
సూర్యరశ్మి ఉదయిస్తు
నిద్రను లేపుతూ
నువ్వు అలానే నిద్రకు బానిసైతే
నీ విజయ కెరటం
వెనకాలే ఓ మూలన పడుతుంది
ఇంకెందుకు అలానే కళేబరంలా
పడిపోయావు లేవ్వు మరి
దినకరుడుని దర్శించుకో
లేచి నడువు నీ మెదుడుకు
పదునుపెడితే తప్ప
నువ్వు అనుకున్న
ఏ విజయమైనా సాధించగలవు
బయలుదేరు నీ పయనం ఆపద్దు
శ్వాస ఉన్నంత వరకే కదా
ఈ విజయాలు, స్నేహాలు
తరువాత నువ్వెవరు నేనెవరినో
ఇక వెళ్ళొస్తా మరి నాకు వేళయింది
యమధర్మరాజు గారు
కబురు పంపారు
ఇట్లు నీ మిత్రుడు..
గిద్దలూరు సాయి కిషోర్ 2004 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జన్మించారు. గిద్దలూరు మురళి, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. గిద్దలూరు నందిని వీరి చెల్లెలు. ఆమె చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్నారు. సాయి కిషోర్ బాల్యం నుంచే సాహిత్య ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. తాత్వికత, సమాజం, ప్రకృతి, కాలం వంటి అంశాలను తన కలం ద్వారా ప్రతిబింబింపచేస్తున్నారు. కవిత్వం, కథలు, తాత్విక ఆలోచనలు వీటన్నిటిలోనూ ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది. వీరి పదాలు సున్నితమైన భావవ్యక్తీకరణతో పాఠకుడిని ఆలోచనలోకి నడిపిస్తాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని ఆధునిక భావాలతో మేళవించడం ఆయన రచనల ముఖ్య లక్ష్యం.
సాయి కిషోర్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఫౌండేషన్లో ప్రచార కార్యదర్శిగా తెలుగు భాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాహిత్యంతో పాటు విజ్ఞానం, విద్య, సాంకేతికత పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. వీరి సృజనలో “ఆశయమే పిడికిలి”, “నాన్నే నాకు ఓ బిరుదు”, “మట్టే మనిషోయ్”, “కాల ప్రవాహం” వంటి రచనలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.
