[గిద్దలూరు సాయి కిషోర్ గారు రచించిన ‘ఆఖరి క్షణం!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నాలుగు గోడల మధ్య
నలుగురు చర్చించుకునే మాటను
తప్పో, ఒప్పో మనం నడుచుకునే
నడక బట్టి నిన్ను గుర్తిస్తుంది
ఈ సమాజం
కాగడాల పువ్వులు
చూడడానికి ఎంతో
ముద్దుగాను
ఆకర్షణీయంగా, సువాసనతో
వెదజల్లుతాయి
దాని స్థానాన్ని అది
తవ్వుకుంటుంది
కానీ
మనం ఏం
చేస్తున్నామో కాస్త
ఆలోచించండి
ఎవరో, ఒకరు నీ మీద
చెప్పిన అసభ్యపు
మాటలను
అతనే వచ్చి నీతో
ఒప్పు, తప్పో చర్చించకపోతాడా
పువ్వు మొలకెత్తడానికి
విత్తనాన్ని మనమే
వేస్తున్నాం
కానీ
మనకు ఒక విత్తనం
కావాలి అని తెలుసుకోలేకపోతున్నాం
అది కాస్తా చెట్టై దాని
స్థానాన్ని గుర్తుంచుకుంటుంది
ఎవరో అన్నారని
వాళ్ళు ఏదో ఇస్తారని
అనుకుంటే అది మన తప్పే
కాస్త మేలుకోండి
కంఠాన్ని కాస్త
రేడియోలా ప్రయోగించండి
చిక్కుడు గింజ నుండి
మెరుపుతీగలా
బాల్యం, యవ్వనం, వృద్ద్యాపం
కాస్త నాలుగు అంగుళాల
స్థలాన్ని చిక్కుడు (మానవులు)
గింజ కోరుకుంటుంది
గిద్దలూరు సాయి కిషోర్ 2004 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జన్మించారు. గిద్దలూరు మురళి, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. గిద్దలూరు నందిని వీరి చెల్లెలు. ఆమె చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్నారు. సాయి కిషోర్ బాల్యం నుంచే సాహిత్య ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. తాత్వికత, సమాజం, ప్రకృతి, కాలం వంటి అంశాలను తన కలం ద్వారా ప్రతిబింబింపచేస్తున్నారు. కవిత్వం, కథలు, తాత్విక ఆలోచనలు వీటన్నిటిలోనూ ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది. వీరి పదాలు సున్నితమైన భావవ్యక్తీకరణతో పాఠకుడిని ఆలోచనలోకి నడిపిస్తాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని ఆధునిక భావాలతో మేళవించడం ఆయన రచనల ముఖ్య లక్ష్యం.
సాయి కిషోర్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఫౌండేషన్లో ప్రచార కార్యదర్శిగా తెలుగు భాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాహిత్యంతో పాటు విజ్ఞానం, విద్య, సాంకేతికత పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. వీరి సృజనలో “ఆశయమే పిడికిలి”, “నాన్నే నాకు ఓ బిరుదు”, “మట్టే మనిషోయ్”, “కాల ప్రవాహం” వంటి రచనలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.
