Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు 2022, 2023 – ఇందూరు అపురూప అవార్డ్స్ 2021, 2022, 2023 – వివరాలు

నిజామా‌బాద్‌ జిల్లాకి చెందిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, విదుషీమణి, మహిళా శ్రీకృష్ణదేవరాయలు – బడి – గుడి – సాహిత్యాలకి అసమాన సేవలను అందిస్తున్న డా. అమృతలత (ఆర్మూర్) వివిధ రంగాలకి చెందిన ప్రముఖులకి అపురూపమైన పురస్కారాలను అందజేస్తున్నారు.

2013 సంవత్సరం నుండి అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను, అపురూప పురస్కారాలను అందజేస్తున్నారు (12-5-2103న మొదలుపెట్టారు). ఇందూరు అపురూప అవార్డులను కూడా నిజామాబాద్ జిల్లా ప్రముఖులకు అందజేస్తున్నారు (20-10-2013న మొదలుపెట్టారు).

వచ్చే నెల మార్చి 5వ తేదీన 2022, 2023 సంవత్సరాలకి అమృతలత జీవన సాఫల్య పురస్కారాలని; 2021, 2022, 2023 సంవత్సరాలకి ఇందూరు అపురూప పురస్కారాలను అందజేయబోతున్నారు.

అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నారు.

ఇందూరు అపురూప అపురూప అవార్డులను 2021 సంవత్సరానికి శ్రీ కందకుర్తి యాదవరావు, తాళ్ళ లక్ష్మీనారాయణ గౌడ్, మేడిచర్ల ప్రభాకరరావు, అఖిలాండేశ్వరి గార్లకు; 2022 సంవత్సరానికి చిన్నికృష్ణుడు, వి. ప్రభాదేవి, లలితావర్మ, డా. గణపతి అశోకవర్మ గార్లకు; 2023 సంవత్సరానికి గాను పొద్దుటూరి మాధవీలత, డా. బాలాష్టు మల్లేశ్, రచ్చ నరేష్, కళాగోపాల్ గార్లకు అందజేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా డా. ఏనుగు నరసింహారెడ్డి పాల్గొంటున్నారు. ప్రముఖ రచయిత్రులు శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, శ్రీమతి కిరణ్ బాల తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమానికి వేదికగా నిజామాబాద్ జిల్లా లోని మామిడిపల్లి, ఆర్మూర్ రోడ్ లోని ‘శ్రీవారి అపురూప కళ్యాణ మండపం’ నిలవనుంది.  మామిడిపల్లిలో డా. అమృతలత గారి చేత నిర్మింపబడిన శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఈ కళ్యాణ మండపం నిర్మితమయింది.

నా తరఫునా, సంచిక అంతర్జాల పత్రిక పక్షాన నిర్వాహకులకు, పురస్కార గ్రహీతలకు, పురస్కార ప్రదాతలకు అభినందనలు అందజేస్తున్నాము.

Exit mobile version