Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘జక్కదొన’ పుస్తక ఆవిష్కరణ సభ – వార్త

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ  ప్రాచ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో, సెనేట్ హాల్లో 6/10/2024 న ఆర్.సి.కృష్ణస్వామి రాజు కథా సంపుటి ‘జక్కదొన’ పుస్తక ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సి.హెచ్.అప్పారావు, రిజిస్ట్రార్ ఎం.భూపతి నాయుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే.ఎస్.శ్రీనివాస రాజు, చెన్నై రాజధాని కళాశాల తెలుగు శాఖాధిపతి ఎం.ఎలిజబెత్ జయకుమారి, ఓ ఆర్ ఐ డైరెక్టర్ పి.సి.వెంకటేశ్వర్లు, సమీక్షకులు  గరికపాటి రమేష్ బాబు, సాహితీ ప్రియులు వి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

ఈ పుస్తకాన్ని రచయిత, రాయలసీమ  సిన్నోడిగా పేరు గాంచిన రచయిత పులికంటి కృష్ణారెడ్డికి అంకితం చేశారు.

-ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821

Exit mobile version