చీపురుపల్లి ఆంజనేయపురం కాలనీలో జమ్ము రామానాయుడు మాస్టారి స్వగృహంలో శృంగవరపుకోటకు చెందిన ప్రముఖ రచయిత్రి, పద్య కవయిత్రి శ్రీమతి గుమ్మా నాగమంజరి రాసిన ‘జలచర విన్యాసం’ పుస్తకం బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషుల మధ్య 31 జూలై 2026 నాడు ఆవిష్కరించడమైంది.
ఈ పుస్తకంలో 108 రకాల సముద్ర జీవులను పద్యరూపంలో వర్ణించడమైంది.
ఈ పుస్తకానికి ఆర్థిక సహకారం అందించిన దాత శ్రీ జమ్ము రామునాయుడు, రాధ దంపతులను గుమ్మా నాగమంజరి, పట్రాయుడు కాశీ విశ్వనాధం దంపతులు దుశ్శాలువాతో ఘనంగా ఘనంగా సత్కరించారు.
కాశీవిశ్వనాధం పట్రాయుడు వృత్తిరీత్యా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నివాసి. ఎక్కువగా బాలసాహిత్యము మీద దృష్టి, అప్పుడప్పుడు సాంఘిక కధలు రాస్తూ ఉంటారు. విద్యార్థులను బాల రచయితలుగా తీర్చిదిద్దడం, వారిచే వివిధ సేవాకార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ‘జనజీవన రాగాలు’ వచన కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాగేయసంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీ మావయ్య కథలు, తాతయ్య కల మొదలగు బాలల కథా పుస్తకాలను వెలువరించారు. సహస్రకవిమిత్ర, లేఖా సాహిత్య మిత్ర, కవితా విశారద, జాతీయ ఉత్తమ బాలసేవక్, ఉత్తమ ఉపాధ్యాయ ఇలా మరెన్నో.. బిరుదులు పొందారు. అంతేకాక పిల్లలకోసం “కాశీ మావయ్య కథలు” యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.

