[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘కాలంతో కాసేపు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నేనున్నంతవరకు
నాకు తెలియదు
కట్టి మొద్దు అగ్ని(తో)
తనువుకు చాలా
బంధం ఉందని.
ఎవరో అన్నారు కానీ
నేను నమ్మలేదు
నాకు వచ్చినప్పుడు
తెలిసింది..
ఆత్మగా చూసిన
ప్రయోజనం లేదుగా
ఇది అంత
జగన్నాటకం..
సృష్టి మొత్తం
నాటక ప్రపంచమని
తెలియదు..
పడిగాపులు
కాచే జీవితాలు
మనవి
ఎందుకు
మాట మాటకు
పోట్లాటలు,
పని చేస్తేనే ఆ రోజుకి
ఆహారం తీరిందనుకుంటాము
నేనున్నంతవరకు
తెలీదు జీవితం అంటే
ఒక ప్రదర్శన లాంటిదని..
ఎవరైన ఉన్నప్పుడు
పలకరించరు తనువు
మనతో లేనప్పుడు
ఏడుపులు,
వావోపులు ఇవన్ని
నాకు వద్దు అసలే
నా మనస్సు చిన్నది
కాస్త వచ్చిన వల్లనైనా
పలకరించండి..
వెళ్లోస్తాను స్నేహమా
(ఈ) ప్రదర్శన, జీవనం చాలు
ప్రకృతిని వ్యర్థ
పదార్థాలతో నింపేస్తున్నారు
కాస్త నిషేధించండి..
నేను వెళ్ళను
మీ హృదయాలలో
గలిగుంటాను
స్వస్థలంలో ప్రకృతిగా
వ్యాపిస్తాను..
గిద్దలూరు సాయి కిషోర్ 2004 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జన్మించారు. గిద్దలూరు మురళి, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. గిద్దలూరు నందిని వీరి చెల్లెలు. ఆమె చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్నారు. సాయి కిషోర్ బాల్యం నుంచే సాహిత్య ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. తాత్వికత, సమాజం, ప్రకృతి, కాలం వంటి అంశాలను తన కలం ద్వారా ప్రతిబింబింపచేస్తున్నారు. కవిత్వం, కథలు, తాత్విక ఆలోచనలు వీటన్నిటిలోనూ ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది. వీరి పదాలు సున్నితమైన భావవ్యక్తీకరణతో పాఠకుడిని ఆలోచనలోకి నడిపిస్తాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని ఆధునిక భావాలతో మేళవించడం ఆయన రచనల ముఖ్య లక్ష్యం.
సాయి కిషోర్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఫౌండేషన్లో ప్రచార కార్యదర్శిగా తెలుగు భాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాహిత్యంతో పాటు విజ్ఞానం, విద్య, సాంకేతికత పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. వీరి సృజనలో “ఆశయమే పిడికిలి”, “నాన్నే నాకు ఓ బిరుదు”, “మట్టే మనిషోయ్”, “కాల ప్రవాహం” వంటి రచనలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.
