[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘మట్టే మనిషోయ్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
తెలుసుకోవోయ్ మనిషి
హృదయ గీతాలను తెలుసుకోవోయ్
హతమార్చిన దుండగుడు ఎవడోయ్
కాలినడకతో బయలుదేరిన
మనిషి ఆత్మననోయ్
కడలిలో కూరుకు
పోయిన మట్టే మనిషోయ్
తెలుసుకో భారతీయుడా
నువ్వు ఎవరివోయ్
కాదన్న మాటకు విలువెక్కువోయ్
నిజాయితీగా బ్రతుకుతున్న
ఓర్వలేక నిందలు మోపడమెక్కువోయ్
చెయ్యి చెయ్యి కలిపితే యుద్ధాన్ని సృష్టించచ్చోయ్
యుద్ధంలో అమరుడైతే
జోహార్ అనే సంకేతము తక్కువోయ్
సాహిత్యమే సెలయేరు వలె పొంగిపొర్లుతు,
కడలిలో అలలు ఎగసి ఎగసి
తన గమ్యాన్ని చేరుకుంటుందోయ్
కలం సేద్యాము వలె విరజిమ్ముతూ
నవ యువ తరానికి
కాలానికి గగనానికి
తన అక్షరం చేరువైతే
ఆలోచన దృక్పథం మారుతుందోయ్..
లోలోనే కృంగిపోకోయ్
దేవదాసుగా మారకోయ్
కాలంతో పాటు కలాన్ని
కదిలించోయ్
కడలిలా ముందుకు సాగిపోవోయ్.
గిద్దలూరు సాయి కిషోర్ 2004 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జన్మించారు. గిద్దలూరు మురళి, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. గిద్దలూరు నందిని వీరి చెల్లెలు. ఆమె చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్నారు. సాయి కిషోర్ బాల్యం నుంచే సాహిత్య ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. తాత్వికత, సమాజం, ప్రకృతి, కాలం వంటి అంశాలను తన కలం ద్వారా ప్రతిబింబింపచేస్తున్నారు. కవిత్వం, కథలు, తాత్విక ఆలోచనలు వీటన్నిటిలోనూ ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది. వీరి పదాలు సున్నితమైన భావవ్యక్తీకరణతో పాఠకుడిని ఆలోచనలోకి నడిపిస్తాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని ఆధునిక భావాలతో మేళవించడం ఆయన రచనల ముఖ్య లక్ష్యం.
సాయి కిషోర్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఫౌండేషన్లో ప్రచార కార్యదర్శిగా తెలుగు భాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాహిత్యంతో పాటు విజ్ఞానం, విద్య, సాంకేతికత పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. వీరి సృజనలో “ఆశయమే పిడికిలి”, “నాన్నే నాకు ఓ బిరుదు”, “మట్టే మనిషోయ్”, “కాల ప్రవాహం” వంటి రచనలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.
