[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘ఓ మిత్రమా నీ కోసమే..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఓడిపోయావని ఉరుకోకు
గెలిచానని చలించిపోకు
అక్కడ ఏదో
గనివిరుగాని సందేశం
ఉందని అనుకోకు
అది నువ్వు రాసిన
రాతై ఉండాలనుకో..
పరిగెడుతున్న
సమయాన గుండె
భారంగా ఉందనినుకోకు
అది నువ్వు వేసి తొలి
అడుగుకు రెట్టింపు అనుకో
కాస్త కష్టంగా ఉందని
జీవితాన్నీ బలి తీసుకోకు
నువ్వు పడే
కష్టం రేపటికి
రెండింతలై
విజయాన్ని గెలుసుకోవచ్చు..
కాదు కూడదు అంటే
నీ కలానికి పదునుపెట్టు
రాతను కవితగా
మలుచు
మరిచిపోకు మిత్రమా
మన జీవితానికి మాటలతో
సరిపెట్టకు కలానికి
పదును పెట్టి
నీ రాతను మార్చుకో
నీ బంగారు భవితకు
బాట వేసుకో..
మిత్రమా చివరగా
నీ మనస్సుతో రాతను మొదలుపెట్టు
ఆ రాతను కవిత్వంతో రుగ్మతలను
తొలిగేటట్టు చేయ్
మరవకు జీవితాన్నీ..
వదలకు ఈ స్వస్థలాన్ని..
గిద్దలూరు సాయి కిషోర్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, రాయదుర్గంకు చెందినవారు. మురళి, లక్ష్మి గార్లు ఆయన తల్లిదండ్రులు. సాయి కిషోర్కు చెల్లెలు ఉంది.
కవితలు, కథలు రాయడం అంటే సాయి కిషోర్కు చాలా ఇష్టం. అలాగే కవితల, కథల పోటీలకు పాల్గొనడం ఇష్టం.
సాయి కిషోర్కు కథలు, కవితలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీరు రచించిన కవితలు మైండ్ మీడియాలో కవితా ఝరి కార్యక్రమంలో అనేక మార్లు ప్రసారమయ్యాయి. త్వరలో ప్రచురితమవబోతున్న వీరి మొదటి కవితా సంపుటి పేరు ‘జీవనం’.