[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘వినీల.. పున్నమి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీవు
వెన్నెలలో కురిసే
మంచు పూల వర్షంలా
నీవు
సందెవేళ కమ్మిన
మధన వేధనా మేఘంలా
నీవు
తొలిపొద్దు పూచిన
సుగంధ వన సుమంలా
ఊపిరిపోసే
నీ.. వలపు వాయువులు తాకి..
కనువిందుచేసే
నీ.. చూపుల రవ్వలు పడి..
ప్రేమ కాసారంలో
మునిగి..
విలాప గీతం పాడే
వినీల.. పున్నమిని
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.
