మంగళగౌరి – పంచగంగా ఘాట్:
“గౌరి త్వమేవ శశిమాలిని వేధసి త్వం
సావిత్ర్యసి త్వమసి వై ద్విజకామధేనుః।
త్వం వ్యాహృతిత్రయ మహాఽఖిల కర్మసిద్యై
స్వాహా స్వధాఽసి సుమనః పితృతృప్తి హేతుః॥”
కాశీలోని దేవీ దేవాలయాలలో నవ గౌరి దేవీ దేవాలయాలు వూన్నాయి. ఈ నవ గౌరి అమ్మవారులు – ‘భవానీ గౌరి, జ్యేష్ఠ గౌరి, లలితా గౌరి, మంగళగౌరి, ముఖనిమాలీకా గౌరి, శృంగార గౌరి, సౌభాగ్యగౌరి, విశాలక్షిగౌరి, విశ్వభుజగౌరి’.
అమ్మవారు ఆ దేవాలయములో మంగళకరములుగా అందరిని కాపాడు గౌరిగా కొలువై వుంటానని వరమిస్తుంది. అందుకే, నవ గౌరీలలో ఈ దేవాలయంలోని మంగళగౌరి ఎంతో ప్రముఖమైనది. తప్పక దర్శించవలసిన అమ్మవారు. తనను పూజించిన వారి కోరికలు ఇట్టే తీర్చే తల్లి ఈ మంగళగౌరి.
దూత్పాప నది, కిరణనది వచ్చి గంగా, యమునా, సరస్వతి నదులతో కలిసినందుకు అది పంచగంగా అయ్యింది. ఈ ఘాట్ చాలా పవిత్రమైనది. తప్పక పుణ్యస్నాన మాచరించవలసినది స్థలమది.
పవిత్రమైన ఈ ఘాట్ లోనే బిందు మాధవ దేవాలయమూ వుంది. ఈ దేవాలయము కేశవదేవాలయము.
ఆయన ఆ సౌందర్యం చూస్తూ పంచగంగా వాటికలో తిరుగుతూ ఘోర తపస్సు చేస్తున్న ఒక ఋషిని చూస్తాడు. ఆ ఋషి పేరు అగ్నిబిందుడు. ఆయన తపస్సుకు విష్ణువు సంతోషించి వరము కోరుకోమంటే, ఋషి మహావిష్ణువును చూసి ఆనందించి, స్తోత్రాలు చేసి ఆ ప్రదేశములో నివసిస్తూ భక్తులను కాచుకోమని కోరుతాడు. ఆ ఘాట్లో స్నానము చేసి మహావిష్ణవును కొలచిన వారికి మోక్షము ప్రసాదించమని, అక్కడ వెలసిన రూపము తన నామముతో పిలవబడాలని కోరుకుంటాడు. అందుకే మహావిష్ణువు అక్కడ బిందు మాధవునిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలా పంచగంగా ఘాట్ అంత ప్రత్యేకమైనది.
అందుకే మహాశక్తి వంతమైన అవధూత, 300 సంవత్సరాలు జీవించిన శ్రీ త్రైలింగస్వామి కూడా తన ఆశ్రమము పంచ గంగా ఘాట్ లోనే ఏర్పరుచుకున్నారు.
(సశేషం)
హైద్రాబాదులో పుట్టి పెరిగారు. వివాహనంతరం అమెరికాలోని అట్లాంటా లో స్థిరపడ్డారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ. డిగ్రీ పొందారు.
సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా పనిచేశారు. అట్లాంటా తెలుగు సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. అమెరికన్ రెడ్క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్ ఇత్యాది సంస్థలకు స్వచ్ఛంద సేవ చేసి ప్రస్తుతం వీటి సేవ ద్వారా గిరిజన, అంధ విద్యార్దులకై సేవలందింస్తున్నారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసం సేవలందించే రక్షా సంస్థవారి “Ramesh-Bakshi Leadership” అవార్డు అందుకున్నారు.

