[మంత్రిపగడ శ్రీనివాస్ గారి ‘గత జన్మల గీతం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఎప్పుడో ఒక జన్మలో
ఎవరో నా హృదయాన్ని తాకారు;
ఆ స్పర్శ ఇప్పటికీ రక్తంలో జ్వాలగా ఉంది.
శరీరాలు మారినా, కాలాలు చెదిరినా –
ప్రేమ మాత్రం పూర్వజన్మల నుంచి వచ్చిన నీడ.
నిన్ను చూసిన ప్రతీసారి
గుండె తడబడటమంటే
కొత్త ప్రేమ కాదు –
పాత బంధం తన హక్కు చెప్పుకోవడం.
ప్రేమలోని జ్వాల గాయపరచడం
పూర్వజన్మలో మిగిలిన చీకటిని
వెలుగులోకి తెమ్మని అడిగినట్టు;
మృదుత్వం కన్నీరు తెప్పించడం
పూర్వజన్మల కృతజ్ఞత మళ్ళీ మోసుకొచ్చినట్టు.
మనం కలిసిన ప్రతి క్షణం చెబుతోంది –
ప్రేమ అనేది కర్మ కాదు;
కర్మే ప్రేమగా మన ఆత్మలను తిరిగి కలుపుతోంది.
పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్లో. చాలా కాలంగా బెంగళూరులో ఉంటున్నాను.. సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది.. లాక్డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను. గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, డాక్టర్ కేశవరెడ్డిగార్లు అభిమాన రచయితలు. శ్రీశ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు.
