[ఇటీవల అమెరికాలోని హ్యూష్టన్ నగరంలో జరగిన తెలుగు సాహితీ సదస్సులో సినీ సంభాషణల రచయిత బుర్రా సాయి మాధవ్ గారి ప్రసంగం గురించి శ్రీ జి. వల్లీశ్వర్ గారి రచన.]
ఇలా సాయి మాధవ్ చెబుతుంటే హ్యూష్టన్ నగరంలో వంగూరి ఫౌండేషన్, ఆ నగర తెలుగు సాంస్కృతిక సమితి కలిసి నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సులో ప్రతినిధులంతా చెవులు రిక్కించుకుని వింటున్నారు ఈ ఆగష్టు 17న.
సాయి మాధవ్ ఉద్వేగంతో చెబుతున్న ప్రతి మాట ఏ రంగంలో సాహసం చేసేవారికైనా దిక్సూచి వంటిదే. నాటక రంగ నేపథ్యంలోని కుటుంబం లోంచి వచ్చి, నాటకరంగం మీద వెలిగి, సంభాషణల రచయితగా ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో సంభాషణల రచయితగా తనదంటూ ఒక తొలి ముద్ర వేశారు సాయి మాధవ్. ఆ తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి సినిమాలతో తన ప్రతి అడుగూ బలమైన ముద్ర వేసేలా దూసుకు వెళ్తున్నారు సాయి మాధవ్. మహానటి, సయెరా నరసింహారెడ్డి, ఖైది నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు వంటి సినిమాలు వారు సంభాషణలు రాసిన ఇతర ప్రముఖ సినిమాలు.
“మీరు రాసిన సంభాషణల్ని యధాతథంగా సినిమాలో వాడతారా?.. మధ్యలో మార్చేస్తారా?.. అప్పుడు మీకెలా ఉండేది?.. సంభాషణలు ఏ దశలో మారిపోవచ్చు?.. మీరు చాలా గొప్పగా సినిమా రాసినప్పుడు, ఆ సంభాషణలకు విపరీతంగా గుర్తింపు వచ్చినప్పుడు – ఆ పేరు ఎవరికి వస్తుంది?..”
.. ఈ ప్రశ్నలకు అంతు లేదు కదా!
అయినా సాయి మాధవ్ చాల ఓపిగ్గా, ఉత్సాహంగా జవాబులిచ్చారు.
“సంభాషణల రచయిత ఎంతో గొప్ప సంభాషణ రాశాననుకున్నా, అవి దర్శకుడికి నచ్చాలి, హీరోకి నచ్చాలి, ఒక్కోసారి నిర్మాతకి కూడా.. సెట్ మీదకి వెళ్లాక ఏ కారణం వల్లనయినా ఏ దశలోనయినా మార్పులు చేయమని వాళ్లు అడగవచ్చు. మార్చి రాయాల్సి రావచ్చు.. అప్పుడు నాకు బాధ కలగవచ్చు.. అవును, మొదట్లో బాధ పడే వాడ్ని.. మథన పడేవాడ్ని.. అప్పుడు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను. అంతే! అప్పట్నుంచి అలవాటు పడిపోయాను..”
సంభాషణలు బాగుంటే పేరు వచ్చేదెవరికి – అన్న ప్రశ్నకి ఎన్.టి.రామారావు అనుభవం ఒకటి చెప్పారు సాయి మాధవ్:
తాను ఎన్.టి.రామారావుకి వీరాభిమాని అనీ, అందువల్ల తాను తొమ్మిదేళ్ల వయసులో 1982లో తెనాలిలో ఒక స్నేహితుడి ఫొటో స్టూడియోని ఎన్.టి.ఆర్ తెల్లవారుఝామున 3 గంటలకి ప్రారంభోత్సవం చేస్తుంటే ఆత్రుతగా వెళ్లానని, రామారావు గారు వచ్చి కుర్చీలో కూర్చుంటూనే తన కుడి చెయ్యి – ప్రక్కనే నిలబడ్డ తన భుజం మీద వేశారని, ఆయన అందర్నీ పేరు పేరునా పలకరించి లేచేదాకా తన భుజం మీద చేయి తీయలేదని, కదిల్తే ఎక్కడ ఆయన చేయి తీసేస్తాడో అన్న బెంగతో ఆ చేయి బరువుకి తాను ఎంతో కష్టపడి నిలబడ్డానని.. చెబుతూ, “అయినా ఎన్.టి.ఆర్ స్పర్శించిన ఆ భుజం మీద వేరెవ్వర్నీ నేనింతవరకూ చేయి వేయనివ్వలేదు” అంటూ సాయి మాధవ్ ఆ మధుర స్మృతిలో కొద్ది క్షణాలు మునిగిపోయారు.
“మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రంలో ప్రేమ గురించి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు నిర్వచనాల్ని అద్భుతంగా ఇచ్చారు? అది ఎలా సాధ్య పడింది?”
సంభాషణలు రాశారు. స్క్రీన్ ప్లే రాశారు. తరువాత దర్శకత్వం కూడా చేపట్టాలి కదా! మీకు పోటీ ఉండదేమో?
“చేయబోతున్నాను.. త్వరలో దర్శకుడిగా కూడా చూస్తారు.. పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. అలాగే ఇక్కడా ఉంది. కొంతమంది దర్శకులు వాళ్లే కథలు తయారు చేస్తారు. వాళ్లకి స్క్రీన్ ప్లే రాసి పెట్టే బృందం ఉంటుంది.. ఇది కూడా పోటీ రంగమే..”
ఇంతకీ, ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రానికి ముందు ఏడు చిత్రాలకి మాటలు రాసి, ఆ చిత్రాలు విడుదలకి నోచుకోని పరిస్థితుల్లో ఆదాయం లేక, అన్నీ ఖర్చులే కనిపించే రోజుల్లో నిరాశ, నిస్పృహల మధ్య అన్ని సంవత్సరాల పాటు ఎలా ఈ రంగాన్ని వదిలిపెట్టకుండా ఉన్నారో చెప్పలేదు!
“కారణం ఒక్కటే. నా సామర్ధ్యం మీద నాకు నమ్మకం ఉంది. నాకు కచ్చితంగా ఒక మంచిరోజు వస్తుంది అన్న నమ్మకం ఉంది. అది అతి విశ్వాసం కాదు, ఆత్మ విశ్వాసం. అదే నన్ను పారిపోకుండా నిలబెట్టింది..”
బుర్రా సాయి మాధవ్ కెరీర్ మనకి ఏం సంకేతమిస్తోంది?
వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు.
‘జుగల్బందీ ‘ (అద్వానీ-వాజపేయిల బంధం), ‘నిప్పులాంటి నిజం’ (రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు), ‘నరసింహుడు’ (పి.వి. నరసింహారావు సమగ్ర జీవిత కథ), ‘రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల…’ (ప్రజా జీవితాలపై ఆర్.బి.ఐ ప్రభావం) వీరి అనువాద రచనలు.
శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి – ‘నాహం కర్తా, హరిః కర్తా’; ‘తిరుమల లీలామృతం’, ‘తిరుమల చరితామృతం’, ‘అసలేం జరిగిందంటే …!’ – పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు.
‘ఇదీ యదార్థ మహాభారతం’ (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు) లిఖితరూపం ఇచ్చారు.
‘అయినా నేను ఓడిపోలేదు ‘ (జ్యోతిరెడ్డి ఆత్మకథ), ‘వైఎస్సార్ ఛాయలో … (సి.ఎం మీడియా సలహాదారుగా స్వీయ అనుభవాలు), ‘వాల్మీకి రామాయణం ‘ (పిల్లల కోసం 108 తైల వర్ణ చిత్రాలతో ఎమెస్కో ప్రచురణ) వీరి ఇతర రచనలు.

