[శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన ‘ఎవరిని అడగాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నాలో నీవు
నీలో నేను
నేను నాలా లేను
నువ్వు నువ్వులా లేవు
నేను నేను కాను
నువ్వు నువ్వు కావు
దినం రాత్రిలా
రాత్రి పగలులా
మారిపోయింది ప్రపంచం
ఎన్నడూ లేని ఆనందం
యేదో తెలీని మైమరపు
కల ఏదో నిజం ఏదో
తెలీని మైకం
ఇదే నా ప్రేమ అంటే
ఎవరిని అడగాలి..

శ్యామ్ కుమార్ చాగల్ పుట్టింది భువనగిరి, అప్పటి నల్గొండ జిల్లాలో. పాక్షికంగా చదివింది నాగార్జునసాగర్, తర్వాత నిజామాబాద్.
‘న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ’ లో ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం కథానికలు కవితలు, చిత్రకళ ,కర్ణాటక సంగీతంలో పునః ప్రవేశించి, ఆ కళల సాధన, మిత్రుల సహాయ సహకారాలతో కొనసాగిస్తున్నారు.
‘ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ‘కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతము ఉద్యోగం చేస్తున్నారు. వీరి నాన్నగారు జీవితకాలం ఉర్దూ ఇంగ్లీష్ వార్తాపత్రికలకు పాత్రికేయుడిగా కొనసాగారు.