ఇది.. గొప్ప అనుభవమే..!!
‘కరోనా కాలం’ గుర్తు పెట్టుకోదగ్గ కాలం. యావత్ ప్రపంచదేశాలనే గడగడ లాడించిన ఒక ప్రత్యేక సమయం. ‘మమ్మల్ని మించిన వాళ్ళు లేరు’ అని గొప్పలు చెప్పుకున్న దేశాలు కూడా కరోనా.. ముందు తల వంచక తప్పలేదు. కరోనా కాలాన్ని, మనకు జరిగిన నష్టాన్ని బట్టి, అదొక దురదృష్టకరమైన కాలంగా చెప్పుకుంటారు గానీ, అది ఎంత చెడు చేసి ప్రాణ నష్టాన్ని కలిగించిందో, అంతకు మించి మనిషికి మంచి జ్ఞానోదయాన్నీ కూడా కలిగించింది అని చెప్పవచ్చు.


గుంటూరులో కలిసిన రచయిత ఆత్మీయుడు చిరంజీవి, వి. ఉమామహేశ్వర రావు (ఇంజనీర్.. ఇరిగేషన్)
ప్రారంభ దశలో అది ఏమిటో తెలియక, దానికి సరైన వైద్యం తెలియక, భయబ్రాంతులకు గురి అయినవారు సైతం అనేక కష్టాలకు గురియై, పిదప ప్రాణాలు పోగొట్టుకున్నవారు వున్నారు. తర్వాత విషయాన్ని అన్నిరకాల అవగాహన చేసుకున్న కార్పొరేటు ఆసుపత్రులు, రోగుల భయానికి మరింత భయం జోడించి, సొమ్ము చేసుకోవడం కూడా మనం కళ్లారా చూసాము. మనది ఉష్ణ దేశం కాబట్టి, ఆ వేడికి వైరస్ తట్టుకోలేదు కనుక పెద్ద మందులు అవసరం లేదని ఒక్క ‘పేరాసిటిమాల్’ బిళ్ళ ఉంటే చాలని నీతులు చెప్పిన రాజకీయ పెద్దలు, తర్వాత చేసిన హడావిడి ఎలాంటిదో కూడా మనం చూసాం. తర్వాత వేక్సిన్, ఆ తర్వాత బూస్టర్ డోస్ అనేవి అన్నీ మనకు అనుభవాలే!


గుంటూరు సాహిత్య కార్యక్రమంలో మిత్రుడు శ్యాం కుమార్, మిత్రమణీ శ్రీమతి లీల లతో… రచయిత
కరోనా వచ్చి వెళ్లిన తర్వాత చాలా విషయాల్లో మనకు జ్ఞానోదయం అయింది. శుభ్రంగా ఎలా ఉండాలో, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తరతమ భేదాలు లేకుండా అందరికీ అర్థమయింది. అందరి మనసుల్లోనూ ‘మాస్క్, శానిటైసర్’ అనే మాటలు బలంగా నాటుకుపోయాయి. దగ్గు – జలుబు నిర్లక్ష్యం చేయకూడదని అర్ధమయిపోయింది. జ్వరాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదన్న విషయం కూడా అవగాహనకు వచ్చింది. అలాగే మనిషిలో భయాన్ని, నిరుత్సాహాన్ని పెంచింది. జనాల్ని చైతన్య రహితుల్ని చేసి బద్ధకం పెంచింది. ప్రయాణాలకు ఆనకట్ట వేసింది. ఒకరినొకరు కలుసుకోలేని సన్నివేశాలని సృష్టించింది. ‘మా ఇంటికి మీరు రావద్దు – మీ ఇంటికి మేము రాము’ అనే నినాదానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో నేను కూడా ఇలాంటి అనుభవాన్ని చవి చూడవలసి వచ్చింది. ఎక్కడికీ వెళ్లకుండా, బంధువులను – స్నేహితులను చూడకుండా నన్ను నేను కట్టడి చేసుకోవలసి వచ్చింది. ఇంకొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయగల సత్తువ నాకున్న, పిల్లల ఒత్తిడితో (బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు – అనే సామెత వాళ్లకి బాగా అవగాహనకు వచ్చినట్టు వుంది) క్లినిక్ మూసేసి, నా పరికరాలన్నీ స్థానిక క్రిస్టియన్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చేయడం జరిగింది. ఎవరు పిలిచినా దూరభారాలు, ప్రయాణం తగ్గించుకున్నాను. దీనివల్ల బద్ధకం పెరిగిపోవడమే కాక, శరీరం బరువు పెరగడం, సమయంతో పనిలేకుండా నిద్రపోవడం వంటి అలవాట్లకు అంకురార్పణ ఏర్పడింది.


మితృరాలు శ్రీమతి డి.రాజ్యలక్ష్మి గారి ఇంట్లో..
నా ఈ విషయాన్ని గమనించిన మిత్రుడు,శ్యామ్ కుమార్ చాగల్ (ఇంటర్ -మిత్రుడు) నాకు కొన్ని ఆరోగ్య వ్యాయామాలు చెప్పడమే కాక తన స్వంత ఖర్చులతో, నాలో చలనం కలుగజేసి నన్ను అనేక ప్రాంతాలకు తిప్పాడు/తిప్పుతున్నాడు. అందులో ఒకటి గత నెల (26, 27, 28 నవంబర్, 2022) మేము వెళ్లిన గుంటూరు ప్రయాణం. శ్యామ్ కారు లోనే, అతనితో పాటు, అతని భార్య శ్రీమతి లీల, నేను గుంటూరుకు ప్రయాణం.


శేషారత్నం టీచర్ గారిని కలిసిన దృశ్యం
మేము ప్రయాణం పెట్టుకోవడానికి అసలు కారణం శ్రీమతి సిహెచ్. సుశీలమ్మ గారి పుస్తక ఆవిష్కరణ, దానితో పాటు ప్రతి యేటా ఆవిడ తండ్రిగారి పేరు మీద ఇచ్చే పురస్కార కార్యక్రమం. అయితే ఎట్లాగూ గుంటూరు వెళుతున్నాం కనుక, అక్కడ మా స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను కలవాలని ప్లాన్ చేసుకున్నాం.


సాగర్ గ్రూపు అడ్మిన్ ఇం. రామ్మూర్తి గారితో
26-11-2022, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకున్నాము. మాకు ఏర్పాటు చేసిన బసలో దిగి, కాస్త విశ్రాంతి అనంతరం 3.30కి సభాస్థలికి చేరుకోవాలని తయారవుతున్న సమయంలో ఉమా మహేశ్వర రావు (ఈయన నాగార్జున సాగర్లో మా కుటుంబ మిత్రులు శ్రీ ఉప్పే సూర్యరావు గారి కనిష్ట కుమారుడు. గుంటూరు కేంద్రంగా ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్గా, మూడు జిల్లాలకు ప్రతినిధిగా, ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్నాడు) కనిపించడం ఎంతో ఆనందం అనిపించింది. అతను మా అక్క శిష్యుడు కూడాను. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఆయన ఆఫీసుకు వెళ్ళిపోయాడు. గుంటూరులో కలవవలసిన ఇద్దరినీ (క్లాసుమేట్ డి. రాజ్యలక్ష్మి గారిని, అక్క సహోద్యోగి శేషారత్నం గారినీ) మరునాడు కలవాలని నిశ్చయించుకున్నాము. ఈ లోగా ‘సాగర్ గ్రూపు’ అడ్మిన్ జూనియర్ ఇంజనీర్ రామ్మూర్తి గారు కూడా మరునాడు కలుస్తామని ఫోన్ చేశారు. ఈ ట్రిప్పులో ఎక్కువమంది పాత మిత్రులను పెద్దలను కలుస్తున్నామన్న ఆనందం వెల్లివిరిసింది.


నాగేశ్వరరావు- వసుంధర లతో రచయిత.శేషా రత్నం గారు
27 న మిత్రులను పెద్దలను కలిసే పని ప్రారంభం అయింది. ముందు మా సహాధ్యాయిని (ఇంటర్మీడియెట్) డి. రాజ్యలక్ష్మి గారి ఇల్లు వెదుక్కుంటూ, బ్రేక్ఫాస్ట్ సమయానికి (ఇది ముందే ఫిక్స్ అయింది) చేరుకున్నాము. ఇంటర్మీడియెట్ తర్వాత రాజ్యలక్ష్మిని చూడడం ఇదే మొదటిసారి. అంటే సుమారు నలభై సంవత్సరాల తర్వాత! ఈ వయస్సులో మార్పులు సహజం. కానీ గుర్తుపట్టలేనంత మార్పులు ఏమీ జరగలేదు. కొద్దీ సంవత్సరాల క్రితం రాజ్యలక్ష్మి, లీల, శ్యామ్ కుమార్ ఏదో సందర్భంలో కలుసుకున్నారు. నేను మాత్రం ఇదే చూడ్డం. ఆమె ఉన్నత విద్యాభ్యాసం చేసినా గృహిణి గానే వుండి పోయింది. భర్త పేరున్న లాయరు కనుక ఆవిడకు ఉద్యోగం చేయవలసిన అవసరం రాలేదనుకుంటా. అందరం కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం ముగించాం. తర్వాత కాస్సేపు అక్కడే వుండి, వసుంధర పెండ్యాల (శ్రీ రాఘవయ్య – శేషారత్నం గార్ల పెద్ద కుమార్తె) గారి ఇంటికి బయలుదేరి వెళ్లాం. అప్పటికే అక్కడికి నేను చూడాలనుకుంటున్న శేషారత్నం టీచర్ గారు వచ్చి మా కోసం ఎదురు చూస్తున్నారు. మా పెద్దక్క దక్షిణ విజయపురి హైస్కూల్లో ఉద్యోగం లో చేరిన మొదటి రోజుల్లో శేషారత్నం గారు, రాఘవయ్య గారూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మొదటినుండీ అక్కకు మార్గదర్శకులు, శ్రేయోభిలాషులు వారే! మమ్ములను కూడా స్వంత తమ్ముళ్ళలా చూసేవారు.


విజయవాడ కామేశ్వరి గారి ఇంట్లో
దురదృష్టావశాత్తు ఇప్పుడు మా అక్క లేదు, అక్కడ గుంటూరులో మాస్టారూ లేరు. అందుకే టీచర్ గారిని చూడగానే దుఃఖం ఆగింది కాదు. మిత్రుడు శ్యామ్కు, ఆయన లీల భార్యకు, వసుంధర కుటుంబం పూర్తిగా కొత్త. వసుంధర భర్త నాగేశ్వర రావు గారు నాకు కొత్త. అయినా ఎప్పటినుండో పరిచయం వున్నవాళ్ళలా కలిసి పోయి మాట్లాడుకున్నాము. ఇది అసలైన ఆత్మీయ కలయిక అనిపించింది నాకు. నాగేశ్వర రావు గారు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కళాశాల చూపించిన తర్వాత విజయవాడ వైపు బయలుదేరాం. అక్కడ మరో సహాధ్యాయని శ్రీమతి కామేశ్వరి మా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది. ఎన్నో సంవత్సరాల క్రితం నేను చూసిన గుంటూరు పూర్తిగా మారిపోయింది, వెడల్పైన రహదారులు ఆనందంగా ప్రయాణం చేయాలనిపించేలా వున్నాయి.


ఇద్దరు మిత్రమణులు కామేశ్వరి, లీల.


మధ్యాహ్న భోజనం కామేశ్వరి గారి ఇంట్లో.. ముచ్చట్లు నంజుకుంటూ..
కామేశ్వరిని కూడా నేను 40 సంవత్సరాల తర్వాత చూసినట్లే. కబుర్లతో సమయం యిట్టే గడిచిపోయింది. కామేశ్వరి ‘లేబర్ ఆఫీసర్’గా పదవీ విరమణ చేసింది. కోడలు తయారు చేసిన రుచికరమైన భోజనం ఆరగించి సాయంత్రం సమయానికి విజయవాడలోని మా పెద్ద బావమరిది ఇంటికి చేరుకున్నాం. రాత్రికి అక్కడ బసచేసి ఉదయం హైదరాబాద్కు బయలుదేరాం. హైదరాబాద్ రింగ్ రోడ్ చేరుకున్నాక మిత్రుడు శ్యామ్ కారును కొంపల్లి వైపు మళ్ళించాడు. చిన్న స్వంత పని చూసుకున్నాక కొమ్మేపల్లి ప్రాంతంలో వున్న మా మరో మిత్రుడు టి. వరప్రసాద్ను (పారిశ్రామికవేత్త) కలుసుకున్నాం. గంటసేపు సరదా ముచ్చట్లతో గడిచిపోయింది.


ప్రియ మిత్రులు (ఇంటర్) టి.వరప్రసాద్ (పారిశ్రామిక వేత్త) హైదరాబాద్ లో..


మిత్రుడు వరప్రసాద్ తో రచయిత, శ్యామ్ కుమార్
ఇలాంటి ప్రయాణం చేయడం ఇంతమంది ముఖ్యులను కలుసుకోవడం నాకైతే బహుశః ఇదే మొదటిసారి. ఎంతో తృప్తిని, ఆనందాన్ని మిగిల్చిన గొప్ప ప్రయాణం ఇది. కేవలం ఇంటికే అంటిపెట్టుకుని ఉంటున్న నన్ను చైతన్యవంతుడిని చేసి ఇలా నన్ను తిప్పుతున్న శ్యామ్ కుమార్ తోనే ఇలాంటివి సాధ్యం అవుతాయి. మిత్రుడు శ్యామ్కు, శ్రీమతి లీలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పక తప్పదు మరి!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
23 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
సాగర్
విశ్రాంత జీవితాన్ని ఇలా తీర్చి దిద్దుకొంటున్న మీకు, శ్యామ్ సర్ కు మొదట. నా శుభాకాంక్షలు సర్. నిజంగా చిన్న నాటి మిత్రులను కలసుకొనే సందర్భం ప్రతి ఒక్కరికి మరువలేని అనుభూతి. మీ అనుభవాలు మాతో పంచుకొన్నందుకు ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందనకు ధన్యవాదాలు .
Neelima
డాక్టర్ గారు
నమస్కారములు..
కరోనా నాటి విషయాలు చాలా చక్కగా వివరించారు. మళ్ళీ 3 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లారు. కొంచం బాధ కలిగింది.
ప్రముఖులను, పాత మిత్రులను కలుసుకుంటే కలిగే ఆనందం బాగా చెప్పారు..
ధన్యవాదములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 139 ఇది.. గొప్ప అనుభవమే..!!సంచిక బాగుంది.సర్ మీ స్నేహబంధం, మీకు స్నేహితుడైన శ్యామ్ కుమార్ గారు నిజంగా అభినందనీయుడు, వారికి మీకు శుభాభినందనలు. జీవన గమనంలో స్నేహబంధాలు వాటి విలువలు మరియు చిన్ననాటి స్నేహితుల కలయికలో మీరు పొందిన అనుభూతిని చక్కగా వివరించారు సర్.కరోన సంక్షోభం ఉన్న కాలంలో ప్రమాదకరమైన పరిస్థితులను నిత్యం ఎదుర్కొంటూ కూడా వైద్యం అందించిన వైద్యులందరికి మా నమస్కారములు. ప్రతి సంచికలో మీ అనుభవాలు మాతో పంచుకుంటున్న మీకు హృదయపూర్వక నమస్కారములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్య వాదాలండీ.
Rajendra Prasad
You have mentioned the practical issued experienced with the pandemic. Good to see you sir, with our friends and Sesharatnam Teacher garu at Guntur. Keep up meeting the like minded people sir
డా కె.ఎల్.వి.ప్రసాద్
Ok..prasad Garu.
Thank you somuch
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీరు నిజంగా అదృష్టవంతులే.
—–కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అవును
ధన్యవాదాలు మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
చిన్ననాటి మిత్రులను చాలా వ్యవధి తరువాత కలవటం ఒక అనిర్వచనీయ ఆనందానుభూతి.
అభినందనలు.
—రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్ మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Evng Doctor garu,
We have to really enjoy our retired life this way. Instead, we are bogged down to (baby sitting) take care of grand Children.
Enjoy your life Doctor garu.
—-Suryanarayana rao
Hyderabad
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir
Sunianu6688@gmail.com
మీ ప్రయాణ విశేషాలు వింటుంటే మీతో కలిసి ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది .మీరు ఇలా సంతోషం గా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం Dr klv prasad గారు






డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఆహా…భలే ప్లానింగ్ ..చక్కటి ఫలవంతమైన ట్రిప్ సర్.స్నేహం ఎంత మధురమో…అది ఎన్నేళ్లయినా గొప్ప అనుభూతి ని ఇస్తుంది ఇందరి స్నేహితుల్ని కలిసి మీ అపురూప క్షణాలను మాకూ పంచడం చాలా ఉత్తేజంగా ఉంది సర్ మీ శ్యాం గారి లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి.మంచి ట్రిప్ కి వెళ్లివచ్చిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు సర్




—-‘నాగ జ్యొతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 139 లో కరోనా కాలంలో గొప్ప దేశాలను సైతం తలలు వంచాయని తెలిపారు. కరోనా ఎందరినో బలితీసుకున్నది. మనుషులను ఇంటివరకు కట్టడి చేసింది. కరోనా వల్ల మా అపార్ట్ మెంట్ లో నలుగురు మరణించడం బాధాకరం. ఎందరో ఆత్మీయులను కోల్పోయాను. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో చాలా మంది చనిపోయారు. బాధాకరం. మీ మిత్రుని సహకారంతో పాతమిత్రులను కలుసుకున్నారు. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు
—-జి శ్రీనివాసాచారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Mee prayanam.friends muchatlu ,bhojanam lo nanjukunna kaburlu manasuni uricheseyi sir.
Ye vishayam lo naina aa anubhavam nade annattu ga
Pathrallo duripoye naku
Mee jnapakalu kuda
ananandannisthayi.sir.
—–mrs. Sujana panth
Bheemaaram.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ