[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
పెళ్లి పిలిచింది.. విశాఖ పరుగెత్తించింది..!!
లెక్కలేనన్ని ప్రాణాలను తీయడమే కాదు, ప్రజలను అన్ని రకాలుగా అదుపు చేసింది నాటి ‘కరోనా’ మహమ్మారి. అంతేకాదు, జీవితంలో కొన్ని తెలుసుకోవలసిన విషయాలను తెలియజెప్పింది. అంత మాత్రమే కాదు, సామాన్యుడి నుండి, అసామాన్యుల వరకూ, వారి జీవన శైలిని మార్చిపారేసింది. ప్రతి మనిషికీ, జీవితంలో తగిన గుణపాఠం నేర్పింది.
దీనికి తోడు కొన్ని నిత్య కార్యక్రమాలకు అంతులేని ఆటంకం కలిగించి సాధారణ జీవన శైలిని అతలాకుతలం చేసింది. అంటే మనిషిని ఇంచుమించు ఒంటరిని చేసింది. ప్రధానంగా, ప్రయాణాలకు అంతులేని అవరోధాలు కలుగజేసి, ప్రయాణాలు చేయకూడని పరిస్థితిని కలిగించింది. అసలే తక్కువ ప్రయాణాలు చేసే నా బోటి వ్యక్తులకు, ఆ మాత్రం కూడా లేకుండా చేసింది. ఒకరికొకరు, దగ్గరగా వున్నా, దూరంగా వున్నా చూసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. శుభాలకు, అశుభాలకు, దగ్గరి బంధువులైనా, దూరపు బంధువులైనా, స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా పలకరించుకోలేని పరిస్థితి. కనీసం సంతోషాన్నయినా, సానుభూతినైనా వ్యక్తపరచలేని పరిస్థితి. యావత్ ప్రపంచాన్ని శాసించి గడగడలాడించిన, దురదృష్టకరమైన, దుఃఖమయ కాలం, దుర్భర జీవితాన్ని అనుభవింప జేసిన అతి కష్ట కాలం అది. కరోనా కాలం నాటికే, వివిధ కారణాల వల్ల నా ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. ఇక కరోనా దాడితో, మూడు సంవత్సరాలు ఇంటిపట్టునే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆ కరోనా కాలం, వైద్య చరిత్రలో మరచిపోలేని దురదృష్టకర ఘట్టంగా మిగిలిపోయింది.
కరోనా తగ్గుముఖం పట్టాక మళ్ళీ మెల్లగా, శుభకార్యాలు, ఆత్మీయ సమ్మేళనాలూ ఊపందుకున్నాయి. తద్వారా వివిధ రూపాల్లో ప్రయాణాలూ ఊపందుకున్నాయి. నేను కూడా తక్కువ దూరం వున్న ప్రయాణాలు మెల్లగా మొదలుపెట్టాను. అంటే హన్మకొండ నుండి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి ప్రదేశాలు అన్నమాట! దూరప్రాంతాలకు, పైగా ఒంటరిగా ప్రయాణం చేసే సాహసాలు చేయలేదు. అయితే ఈ మధ్య, అంటే మూడు నెలల క్రితం మాకు దూరపు బంధువు (నా శ్రీమతి అమ్మమ్మ వూరు) వాళ్ళ అబ్బాయి పెళ్ళికి తప్పక రావాలని చాలా అడ్వాన్సుగా ఆహ్వానించాడు. పెళ్లి విశాఖపట్నంలో. అక్కడ మా చిన్నన్నయ్య డా. మధుసూదన్తో పాటు చాలా మంది బంధువులు వున్నారు. పెళ్ళికి వెళితే వీరందరినీ చూడొచ్చని ఆశ కలిగింది. నేను నా శ్రీమతీ వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అయితే మా అమ్మాయి అల్లుడూ, పిల్లలతో వెళదామని ఆలోచించి, పెళ్లి ప్రయాణానికి కొనసాగింపుగా, అరకువేలీ-బొర్రా కేవ్స్ చూడాలనీ, ఒక రాత్రి అరకువేలీలో బస చేయాలని నిర్ణయించి, ప్రయాణానికి చేయవలసిన పని అంతా పూర్తి చేసేసారు. విశాఖపట్నం వెళ్లడం సంతోషమే గానీ పిల్లలతో ఎలా ఉంటుందో పరిస్థితి అని నాకు భయంగానే వుంది. అయినా సాహసం చేసాము.
ఈ సంవత్సరం మే నెల 9వ తేదీన, రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి మర్నాడు ఉదయం విశాఖ చేరుకున్నాము. స్టేషన్లో, ఉదయం 7 గంటలకే, విశాఖ వేసవి ప్రతాపం తెలిసిపోయింది. వెళ్ళబోయేది చిన్నన్నయ్య ఇంటికి. ఆయన అతి సాధారణ జీవితాన్ని అలవాటు చేసుకున్నవాడు. అక్కడ రిఫ్రిజిరేటర్లు, కూలర్, ఎయిర్ కండిషనర్ వంటి సదుపాయాలు ఆశించే అవకాశం లేదు. ఎలా వుండాలా? అన్న ఆలోచనలో పడ్డాను.
మొత్తానికి కేబ్ మాట్లాడుకుని చిన వాల్తేరులో ఉంటున్న అన్నయ్య ఇంటికి (రెండవ అంతస్తు) చేరుకున్నాము. అక్కడ అనుకున్నంత ఇబ్బంది అనిపించకపోయినా, సుఖం మరిగిన మా ప్రాణాలు చల్లదనం కోసం తహతహలాడాయి.


రచయిత చిన్నన్నయ్యతో మనవడు నివిన్ నల్లి
పెళ్లి 10 గంటలకు కాబట్టి, అందరం త్వరగా తయారై, అల్లుడి మిత్రుడు సమకూర్చిన కారులో, పెళ్లి జరిగే ప్రదేశానికి చేరుకున్నాము. చర్చి మొదటి అంతస్తులో పెళ్లి. హాలు విశాలంగా వున్నా, పైన పంకాలు తిరుగుతున్నా గాలి వస్తున్నట్టు లేదు, చమటకు లోటు లేదు. చాలా చికాకుతో గడపాల్సి వచ్చింది. సరే, పెళ్లి అయింది అనిపించుకున్నాక, లంచ్ సెల్లార్లో. అక్కడే రిసెప్షన్. బహుశః అది కార్ పార్కింగ్ అనుకుంటా. అక్కడ ఎంత రుచికరమైన భోజనాలు వున్నా, అక్కడి వేడికి వింత చెమటలకు, ముద్ద దిగేట్లు లేదు. అక్కడ భోజనం పెట్టి శిక్ష విధించినట్టుగానే అనిపించింది. బహుశా అక్కడి ప్రజలు ఆ వాతావరణానికి అలవాటు పడిపోయారేమో!


విశాఖపట్నం చర్చిలో రచయిత పెద్దబామరిది రాజబాబుతో.. రచయిత మనవడు నివిన్
గమ్మత్తు ఏమిటంటే, నేను పుట్టి పెరిగింది కోనసీమలో, ఇలాంటి వాతావరణంలోనే అయినప్పటికీ, ఇప్పుడు, నేను కూడా వెళ్లి అక్కడ కొన్ని రోజులు గడపడం కష్టమే!
శరీరం పూర్తిగా వరంగల్/హైదరాబాద్ వాతావరణానికి లొంగిపోయి అలవాటు పడిపోయింది.
మరునాడు విశాఖనుండి అరకు రైలులో ఏసీ కోచ్ బుక్ చేసుకుని వెళ్ళాము. షుమారు 44 సొరంగాల గుండా రైలు ప్రయాణం చేసింది. సమయం ఎక్కువ తీసుకున్నా ఈ ప్రయాణం ఆనందంగా గడిచింది.


విశాఖపట్నం నుండి అరకు రైలు ప్రయాణ దృశ్యం


సౌకర్యవంతమైన ఏ.సి.కోచ్ (రైలు ప్రయాణము) విశాఖపట్టణం-అరకు
అరకులో కూడా వేసవి వేడిమికి కొదవలేదు. ఏపి టూరిజం వారి హోటల్ సౌకర్యంగానే వుంది. అక్కడ లంచ్ చేసి కాస్సేపు సేదదీర్చుకుని దగ్గరలో వున్న చిన్న చిన్న ప్రదేశాలు చూసి వచ్చాము.
మరునాడు కారులో తిరుగు ప్రయాణం. అరకు నుండి విశాఖ మార్గం ఎత్తుపల్లాలతో లోయగుండా చెట్ల పచ్చదనం గుండా ప్రయాణిస్తుంటే ఒకవైపు ఆనందము, మరోవైపు భయము కూడా కలుగుతాయి. అదొక గొప్ప అనుభవము. ఒకవైపు రైలు ప్రయాణం మరోవైపు కారు ప్రయాణం రెండూ ప్రత్యేకతను కలిగి వున్నాయి. మధ్యలో ప్రత్యేకంగా చూడవలసిన ప్రదేశాలు (1) జలపాతం (2) బొర్రాగుహలు (3) కాఫీ తోటలు.


అరకు.. బొటానికల్ గార్డెన్
మార్గమధ్యంలో తగిలిన కటిక జపాతం పోవడానికి అసలు మార్గంనుండి లోపల ఎతైన కొండవైపుకు మళ్ళాలి. అది మార్గమే తప్ప సరైన రోడ్డు లేదు. అజాగ్రత్తగా ఉంటే వాహనం బోల్తా పడే అవకాశాలు ఎక్కువ.


చాపరాయి జలపాత జలప్రవాహం
పర్యాటక రంగంలో ప్రభుత్వ వైఫల్యానికి ఇదొక మచ్చు తునక. ఈ కటిక జలపాతం ను దర్శించే చోట సందర్శకులకు కనీస సౌకర్యాలు లేవు. వందల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్న సందర్శకులకు నిరాశే ఎదురవుతుంది. అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి కనీస ఫీజు వాసులు చేసినా ఎవరూ బాధపడరు. కనీసం త్రాగడానికి నీటి వసతి కూడా లేకపోవడం దురదృష్టకరం!
తరువాత మార్గమధ్యంలో కాఫీతోటలు తగిలాయి. అవి ఎత్తుగా కొండ మీద వరకూ వ్యాపించి వున్నాయి. కాబట్టి అంత ఎత్తుకు ఎక్కాలంటే కనీసం దానికోసం ఒక పూట సమయం వెచ్చించాలి. అక్కడ లభించే కాఫీ పొడితో తయారు చేసే కాఫీ బాగుంటుందని ఎవరో చెబితే తలొక కప్పు కాఫీ తాగాము, ఆ కాఫీలో ప్రత్యేకత అటుంచి అసలు బాగోలేదు. ఇది సందర్శకులను మోసం చేసినట్టే కదా!


కాఫీ తోటలో.. రచయిత కూతురు-అల్లుడు-పిల్లలు
ముప్పై సంవత్సరాల క్రితం వైద్య మిత్రులతో కలసి బొర్రాగుహలు దర్శించే అవకాశం కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ సందర్శకులను ఆకట్టుకునే ప్రత్యేకతలు అక్కడ ఏమీ లేవు. ఇది కూడా పర్యాటకశాఖ వైఫల్యమే! ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయా ప్రదేశాలను చూడటానికి వచ్చేవారికి శ్రమ, నిరుత్సాహమే మిగులుతున్నాయి. పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధిస్తే తప్ప పర్యాటకుల ఆశలు నెరవేరవు గాక నెరవేరవు.
పెళ్లి పేరుతో విశాఖపట్నంలో వున్న రెండు రోజుల్లోనూ కొందరు బంధువులను చాలా కాలం తర్వాత చూడగలిగామన్న తృప్తి తప్ప అక్కడి వాతావరణం అసలు తట్టుకోలేని విధంగా వుండి, ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతామా.. అనిపించింది. ఇలా చాలాకాలం తర్వాత కుటుంబంతో కలసి దూరప్రదేశానికి వెళ్లినట్టయింది.
ఏ ప్రదేశమైన అక్కడి వాతావరణం ఆయా ప్రజలకు అలవాటు పడి, తట్టుకునే శక్తిని కలిగి వుంటారు. విశాఖపట్నం దీనికి అతీతం కాదు మరి..!
అది వేసవికాలపు ప్రతాపమే..!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
22 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
——-డా కె.ఎల్.వి.ప్రసాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శుభోదయం శుభాకాంక్షలు
విశాఖ, అరకు అందాలు
పర్యాటక అనుభవాలను
చక్కటి వివరణ
బాగుంది. ఇంకా
ఇంకా చూడండి
మీ జ్ఞాపకాల పందిరి లో
భద్రపరిచి చూపండి మాకు.
శుభాభినందనలు
—-డా.వి.నాగులు
అమెరికా(బోస్టన్)
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
గురువు గారూ…
Neelima
నమస్కారం డాక్టర్ గారు
వేసవి ప్రతాపం కోసం మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. ఎంత కోనసీమ వాసులమైనా , తెలంగాణ వాతావరణం కి అలవాటు పడ్డ వారు వేసవి కాలంలో ఇక్కడ వుండలేము. మాకు ఏప్రిల్ లో వరంగల్ నుండి కాకినాడ బదిలీ అయిన కారణంగా కాకినాడ వాచము మంచి ఎండల్లో. మా స్వస్థలం రాజమండ్రికే దగ్గరగా వచ్చిన ఆనందం కన్నా ఈ వాతావరణం వల్ల Enduku vachaamaa అనుకున్న రోజులే ఎక్కువ.
మరోకసారి మా బాధ ని గుర్తు చేసారు.
దాన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
చాలాకాలానికి స్పందించారు.
హృదయ పూర్వక కృతజ్ఞతలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కరోనా జీవిత విధానాన్ని మార్చేసింది.
నేను కరోనాకు మందు రోజు సాయంత్రం వాహ్యాళికి వెళ్ళేవాఢిని. ఇప్పుడు కరోనా తగ్గిన అది నాలో నింపిన బద్ధకం ఇంకా నన్ను బంకలాగ పట్టుకొని విడవడం లేదు.
ప్రభుత్వం చాలా బీదది డాక్టర్ గారు. పన్నులు పెంచితే సమ్మెలు. ప్రతిపక్షాల గోల ఎలాగు ఉంటుంది. దానికి తోడు ఉచిత పథకాలు. లేకుంటే ప్రభుత్వ పతనం తప్పదు.
పాపం ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఆచార్య తంగెడ జనార్దనరావు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అయ్యో వైజాగ్ వచ్చారా… నాకు తెలిసిఉంటే మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగిఉండేది !… అయ్యయ్యో !
—–కోరాడ నరసింహారావు
విశాఖ పట్నం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
హడావిడి అయిపోయింది
ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జలపాతం తప్ప అరకులోయలో మిగతావన్నీ చూశాను. బొర్రా గుహల్లో దిగి నడవడం గొప్ప మధురానుభూతి వాతావరణానికి తట్టుకోవడం కూడా ఒక కళ ఏమో. పర్యాటక రంగానికి మొట్టి కాయలు వేస్తూ, కుటుంబ అనుబంధాన్ని పంచుతూ, పెట్టిన పెండ్లి ముచ్చట్లు ముచ్చటగా ఉన్నాయి. కథకుని రూపంలో ఇమిడిపోయిన డాక్టర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
—ప్రొ.భక్తవత్సల రెడ్డి
తిరుపతి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞతలు సర్
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 165 లో విశాఖ,అరకు అందాలు,పర్యాటక అనుభవాలు మరియు కరోనా సమయంలో పడిన కష్టాలు మంచి వివరణ ఇచ్చారు.అందులో పిల్లలతో ప్రయాణం కష్టమే అయినా ఆ అనుభవం మరిచిపోలేనిది సర్.వేసవికాలంలో అలవాటు లేని ప్రదేశం కొంచెం కష్టంగానే ఉంటుంది.పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే భాద్యత ప్రభుత్వాల పని కానీ వాటిపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమే.మీ అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
దాదాపు అందరూ కోవిడ్ తరువాత ఇప్పూడిప్పుడే ప్రయాణాలు ఫన్క్షన్లు అంటూ మొదలు పెట్టిన్రు.
కోవడ్ పిరియడ్ ఒక ఘోరమైన అనుభవం తనవారు పోయినా పరవారు పోయినా పోయిచూడలేని దురవస్థ.
మీ విశాఖప్రయాణం అనుభవం బాగున్నది. ఒకరకమైన వాతావరణం( environment) అలవాటుపడ్డతరువాత ఏవాతావరఢమూ నచ్చదుమనకు. పర్యాటకరంగంలోమౌలికవసతుల కల్పన కూడా ప్రభుత్వంచేయటంలేదు .డబ్బు ఖర్చుకాకుండా ఆదాయం రావాలె ప్రభుత్వానికి.గుమ్మిల గింజలు గుమ్మిలనే వుండాలె , పోరగాండ్లుమాత్రం దుడ్డెలవలె వుండాలె అనే సిద్ధాంతం వారిది.అమెరికాలో చిన్న పాటి స్థలమైనా అక్కడ ఒక వీడియోషో దానికి చార్జ్ తరువాత ప్రత్యక్షంగా చూడటంవదానికి చార్జ్ .బొర్రా గుహలలో పదోవంతు కూడాలేని గుహలలో లైటింగు వీడియోషో వగైరాపెట్టి అక్కడ ఒకహోటల్ ఆస్థలానికిసంబంధించాన బ్రోచరు ఎన్ని ఇకమతులు చేసిండో .మనవారు రామప్ప , కోటవంటి చోట్లలో కూడా స్థల చరిత్ర తెలిపే సాహిత్యం లేదు .గైడ్ లసంఖతి మాట్లాడేపనేలేదు.
గుమ్మడిక్య తెచ్చుకున్నవాడే పఖలకొట్టుకుంటడన్నట్ట్టు వచ్చినవారు చూడకచస్తారా? చచ్చినట్ట్లు చూస్తరు అన్న వివేకంమనవారిది.
పరభుతవం వ్రికి వివేకోదయంకలగాలని కోరుకోవటం తప్ప మనం ఏమీచేయలేమనేదిలేదనేది నా భావన.
—-రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞతలు
శాస్త్రిగారూ……
Rajendra Prasad
Sir! You reminded me of my experience in Vizag under the same circumstances, summer. I have decided not to visit Vizag in Summer unless compelled. As you said Government neither has service moto or commercial interest in developing the tourism in AP. In Karnataka and Tamilnadu the facilities are far better. Your experience and making it known to others will help others having high hopes of such visits. As usual your narrative is interesting to the readers
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch
Prasad garu.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Evng Doctor garu,
You are absolutely correct. Once our body is attuned to certain comfort, we will not be able to adjust to any other atmosphere.
—-suryanarayana Rao
Hyderabad
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ సుదీర్ఘ వ్యాసం చదివాక సరదాగా వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారో నని మనసుకు ఒకింత బాధ కలిగింది సార్. సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటున్న మాకు ఈ గాలి , నీరు, చెమట, ఉక్కబోత అలవాటు అయి పోయాయి సార్. అరకు, బొర్రా గుహలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనడం చాలా శోచనీయం.. చక్కని వ్యాసాన్ని అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు శుభాభినందనలు సార్

















మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా)
డా కె.ఎల్.వి.ప్రసాద్
Amma
Thank you.
Shyamkumar
వేసవిలో వెళ్లే ముందు అక్కడ మన సౌకర్యం వుందో లేదో తెలుసు కో వడం మంచిది.
అందరినీ పిలుస్తారు కానీ వెళ్లి న తర్వాత పట్టించుకోవడం లేదు. ఇది నాకూ చాలా సార్లు జరిగింది.