ఒక కల్లోల వాతావరణ
కలగాపులగంలో
నేడు సమాజం..
మెదడులో ఆలోచనల తిరుగుబాటు..
స్వేచ్ఛను బంధీ చేసి..
విశృంఖల విన్యాసం చేస్తున్న
క్రిమికి దాసోహం..
జనారణ్యంలా దర్శనమిచ్చే
జనసందోహానికి
ఆనకట్ట వేసి చోద్యం చూస్తున్న
కరోనా విలయతాండవం..!
జీవితంలో ఏది సాధించాలన్నా..
కావలసింది కృషి, పట్టుదల..అవి
మన భారతీయుల బలం..
గెలుపు శిఖరానికి మనల్ని చేర్చే నిచ్చెనలవి..
నిరాశకే నిరాశ పుట్టే
నిరంతర మన ప్రయత్నం ముందు..
కరోనా హడలిపోవాల్సిందే..!
ఆయుధమే లేని యుద్ధం చేస్తున్న
భారతీయుల కట్టుబాట్లకి
నివ్వెరపోవాల్సిందే..!
నిజానికి..
కష్టాల చీకట్లను దాటితేనే
విజయాల గమ్యాన్ని చేరుకోగలం..
ఘోర విపత్తును సృష్టించి
వినోదం చూస్తున్న
చైనోడికి
ఇప్పుడు మనమంటే ఏంటో తెలియచెబుదాం..
ఆర్ధిక దిగ్బంధనం చేసి
చైనా ఆటలు కట్టిద్దాం..!
మరోసారి
దుర్మార్గపు..దుందుడుకు
వేషాలేయకుండా
కట్టడితో మట్టుబెడదాం.!!

లక్ష్మీ సుజాత గారు పుట్టింది ఆంధ్రా, పెరిగింది తెలంగాణ.. భద్రాచలం, ఖమ్మం జిల్లా. ఇంటర్ చదివే రోజుల నుండి పలు పత్రికల్లో క్విజ్లు, ఆర్టికల్స్, కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ బాలల పత్రికలలో వీరి బాలల కథలు ప్రచురితమయ్యాయి. తెలుగు వెలుగులో రాసిన కథకు అభిమానుల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందారు. అష్టాక్షరి, ధ్యానమాలిక అను మాసపత్రికలకు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. వివిధ అంతర్జాల పత్రికలలో వీరి కవితలు ప్రచురితమవుతున్నాయి. టేకు ఆకులపై రంగవల్లికలు వేసినందుకు గాను వండర్ బుక్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.