[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘నీవుగాక ఎవరు నా దేవత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నీ చూపుల కాంతులతో
నా మనసంతా
నీ వెన్నెల ప్రసరింపచేసావు
నీ పెదవుల దరహాసంతో
నా ఎదనంతా
నీ రసజ్వాలతో దహింపచేశావు
నీ వలపుల కుసుమాలతో
నా మదినంతా
నీ పరిమళంతో నిండా నింపేశావు
నీ వయ్యారం దావానలమై
నీ కలల కాసారం లావాగ్నిగుండమై
నీ ప్రణయం విరహాగ్ని నాట్యమై
ఎదురుచూసే
నా ఎదకు.. నీవుగాక ఎవరు నా దేవత
చెప్పు ప్రియా..

డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.