ముద్దుల నానీలు-1
1.
సముద్ర అలలు
తీరాన్ని ముద్దాడె
ఆ అలల్ని చేపలు
ముద్దాడె
2.
చల్లగాలి
మేఘాలను ముద్దాడె
మేఘం
ఆనందభాష్పాలు రాల్చె
3.
పురుగు పుట్ర
ముద్దాడుకున్నాయి
ఏమి సాధించాయో
ఎవరికెరుక
4.
సిమెంట్, ఇసుక
ముద్దాడాయి
ఇరవై నాలుగంటల్లో
బంధం దృఢమైంది
5.
మాస్క్
ముక్కూ నోరును ముద్దాడింది
కరోనాను
అడ్డుకుందిగా మరి
6.
ముద్దులో
మునిగి తేలాయి నానీలు
నవ్వులో మునిగి తేలాలి
చదువరి
7.
పూలను
ముద్దాడె తుమ్మెదలు
సంతాన ప్రాప్తి చెందె
తరువులకు
8.
గాలి
శిలలను ముద్దాడె
మరి శిలలకు
సంతాన ప్రాప్తి కలిగేనా?
9.
వాహనం
రోడ్డును ముద్దాడె
రోడ్డుకు దిమ్మతిరిగి
దుమ్ము లేపె

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.