[గిద్దలూరు సాయి కిషోర్ గారు రచించిన ‘ఆజ్ఞ మేరకు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


సూర్యరశ్మి ఉదయిస్తు
నిద్రను లేపుతూ
నువ్వు అలానే నిద్రకు బానిసైతే
నీ విజయ కెరటం
వెనకాలే ఓ మూలన పడుతుంది
ఇంకెందుకు అలానే కళేబరంలా
పడిపోయావు లేవ్వు మరి
దినకరుడుని దర్శించుకో
లేచి నడువు నీ మెదుడుకు
పదునుపెడితే తప్ప
నువ్వు అనుకున్న
ఏ విజయమైనా సాధించగలవు
బయలుదేరు నీ పయనం ఆపద్దు
శ్వాస ఉన్నంత వరకే కదా
ఈ విజయాలు, స్నేహాలు
తరువాత నువ్వెవరు నేనెవరినో
ఇక వెళ్ళొస్తా మరి నాకు వేళయింది
యమధర్మరాజు గారు
కబురు పంపారు
ఇట్లు నీ మిత్రుడు..

గిద్దలూరు సాయి కిషోర్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, రాయదుర్గంకు చెందినవారు. మురళి, లక్ష్మి గార్లు ఆయన తల్లిదండ్రులు. సాయి కిషోర్కు చెల్లెలు ఉంది.
కవితలు, కథలు రాయడం అంటే సాయి కిషోర్కు చాలా ఇష్టం. అలాగే కవితల, కథల పోటీలకు పాల్గొనడం ఇష్టం.
సాయి కిషోర్కు కథలు, కవితలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీరు రచించిన కవితలు మైండ్ మీడియాలో కవితా ఝరి కార్యక్రమంలో అనేక మార్లు ప్రసారమయ్యాయి. త్వరలో ప్రచురితమవబోతున్న వీరి మొదటి కవితా సంపుటి పేరు ‘జీవనం’.