సంచికలో తాజాగా

ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల.

“మరణించిన తరవాత తమ శరీరావయవాలను ఇతరుల ప్రయోజనార్థం దానం చేసిన వారు మరణంలోనూ జీవిస్తారు” అని గంటి భానుమతితమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక

పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.

అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! ఊహించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!!

యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘.

తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో.

సుప్రసిద్ధ సినీ విశ్లేషకులు సికందర్ సంచిక కోసం వారం వారం ప్రాంతీయ చలన చిత్రాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు అందిస్తారు. అన్ని వారాల సంకలనం.

విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్.

కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద.

హిమాచల్ ప్రదేశ్‌లో తాము జరిపిన పర్యటన వివరాలను తెలుపుతూ, తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరిహిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో.

పర్యటన వినోదాత్మకము, విజ్ఞానాత్మకమూ మాత్రమే కాదు మనిషి తనలోకి తాను చూసుకుంటూ తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సీనియర్ జర్నలిస్టు జొన్నలగడ్డ శ్యామల అమెరికా పర్యటనానుభవాల సమాహారం ‘పసిఫిక్ పదనిసలు’ ఈ సత్యాన్ని నిరూపిస్తుంది.

హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’

“అండమాన్‌లో అంతా సముద్రమే. ఎటు చూసినా బంగాళాఖాతం. అందులో అనేక ద్వీపాలు. ప్రతి చోటా అందమైన బీచ్‌లు. ప్రతి ప్రయాణం అద్భుతమైన అనుభవం” అంటున్నారు ఎన్.వి. హనుమంతరావు తమ అండమాన్ పర్యటనానుభూతులని వివరిస్తూ.

సంచిక వెబ్ పత్రిక నిర్వహించిన దసరా కవితల పోటీకి తమ కవితలను పంపి పోటీని విజయవంతము, అర్ధవంతము చేసిన సహృదయులయిన కవులందరికీ బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. పోటీ అన్నది కేవలం సామాన్యంగా వాడేపదం.. అలాగే విజేతలన్నది కూడా పోటీ వుంది కాబట్టి వాడే పదం. కానీ, నిజానికి ఇలాంటి సాహిత్య పోటీల్లో గెలిచేది సాహిత్యమే!!!! ఈ పోటీల్లో పరాజితులంటూ వుండరు.

“నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ.

“గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి.

అనంత పద్మనాభారావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవి బాధ్యతలు నిర్వహించారు. బహుగ్రంథకర్త. పండితులు. పలు బహుమతుల గ్రహీత. తన అపారమైన అనుభవాలను ఆయన పాఠకులతో ఆకాశవాణి పరిమళాలు శీర్షికన నెల నెలా పంచుకుంటున్నారు.

సంచిక పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు. సంచిక నిర్వహించిన  దీపావళి కథల పోటీకి కథలు పంపిన రచయితలకు, వాటన్నింటినీ చదివి తమకు నచ్చిన కథలకు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని తెలిపిన పాఠకులకు, ఓటు వేయకున్నా కథలను చదివిన సంచిక పాఠకులకు, కథలన్నిటినీ ఓపికగా చదివి తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలిపిన న్యాయనిర్ణేతలకు సంచిక బృందం ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇలా అందరం మనవంతు కర్తవ్యాన్ని నిజాయితీగా, నిర్మోహంగా, నిర్మొహమాటంగా నిర్వహిస్తూంటే త్వరలోనే తెలుగు కథల పోటీలలో కథల ఎంపికపై వున్న దురభిప్రాయం తొలగి ఆరోగ్యకరమయిన పోటీ వాతావరణం నెలకొంటుంది. నాణ్యమయిన రచనలు, రచయితలు సముచితమయిన గుర్తింపు పొందుతారు. పోటీలో గెలుపొందిన కధలు.

బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో

బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల ‘పామరులు – పడవతాత’ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.

బాలల కోసం సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న సీరియల్ సమ్మెట ఉమాదేవి రచించిన “నేటి సిద్ధార్థుడు”.

All rights reserved - Sanchika™

error: Content is protected !!