నీ చూపుల చక్కిలిగిలికి
నలిగిపోతున్నా
నీ చెక్కిలి నొక్కులకు
ఉక్కిరి బిక్కిరినవుతున్నా
నీ సౌందర్యం సలుపులకు
సలసల మాడిపోతున్నా
నీవు పద్మదళ
ఉషా జనితవై ప్రభవించినట్లు
నీవు రసచరణ
రవళివై ప్రవచించినట్లు
గుండెను హత్తుకున్న గుబాళిక
నీకై అక్షర హంసలా
ఎగిరొస్తున్నా.. నిను పట్టుకెళదామని

డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.