కవితా! ఓ కవితా!!
నిన్ను రాయని కలాన్ని నేనై
నిన్ను చదవనీ పుస్తకాన్నై నేను
అక్షరాలను చెక్కడం భావస్వేచ్ఛైన
వ్యక్తావ్యక్త అభివ్యక్తి సౌందర నందనమై
పదాలను కూర్చే ప్రకృతి కృతి సుమ సౌందర్యమై
నడకలో జన జగమంతా పాదాల గురు లఘువులై
నాలో పరవశించిన పద్యమై నేను
సామాజిక రుగ్మతల్ని మాన్పే
వైద్య కవితా జీవళ శిల్పాన్నీ నేనై..

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.