[శ్రీ సాగర్ రెడ్డి రచించిన ‘అక్షర సౌరభం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


కవి మస్తిష్కంలో జనించే అక్షర శిశువు,
సమాజ కాగితంపై స్వేచ్ఛగా పారాడితే,
అసమానతల చిరునామా గల్లంతై..
ఆనంద సమాజం ఆవిర్భవిస్తుంది!!
కవి కలం జాలురాల్చిన అక్షర ముత్యం
లక్షణమైన జీవితాన్ని అందించే ఙ్ఞానం-
సమాజాన తిమిరం తొలగించే దీపం,
తరాలు గడచినా ఇగిరిపోని గంధం!!
సాహిత్య పిపాసకుల ఉత్సాహానికి,
విని, వీక్షించే ప్రతిఘటనా ఒక అంశం-
సాహితీ సేద్యంలో నిత్య సంతోషం-
కవన వనం కడు కమనీయ శోభితం!!
గాడితప్పని రచనా వ్యాసంగ పర్వం-
సాహితీ ఆకాశంలో మెరిసే చుక్కలై,
వెలుగుల సంబరంతో విరాజిల్లితే-
విద్వేషపూరిత అక్షర ఆరాటమంతా-
వివాదాల గుంతలో దుర్గంధమయం!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
1 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
బాగా రాసావు సాగర్ అభినందనలు
—-డా.కె.ఎల్ .వి.ప్రసాద్.