[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఈ మట్టిలో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఇన్నాళకుగాని తెలిసింది
ఈ మట్టిని ముద్దాడే నాకు
సకల కళలకు
ఊపిరి అందాల కళానిధి ఈ మట్టి గాలి
సర్వ శాస్త్ర సంపదలకు విజ్ఞాన గని
జీవికని
అక్షరం నేర్పిన స్పర్శ
వైద్యం చేసిన దయానిధి చెయ్యి
కవితా వైద్యసేవనే పయోనిధి
చూపుల కనుగవ జాడ ఇక్కడ
సుందర ప్రకృతి పరిచిన
చెట్టూ చేమల ఆనందం మట్టి మనసే
ఈ మట్టి మహిమ గొప్ప
వినగలిగే కనుల అంబర సంబరం
కనగలిగే చెవుల ఉత్తుంగ తరంగం
త్యాగాల అంతరాత్మ
మట్టి పుట్టుకదే
మనిషి వచ్చాకే మాలిన్యం మచ్చ పడెలే
మనిషిగా మనిషి బతికితేనే
స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛ జీవించు
ఈ భూమి పొరల్లో

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.