[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘మట్టే మనిషోయ్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


తెలుసుకోవోయ్ మనిషి
హృదయ గీతాలను తెలుసుకోవోయ్
హతమార్చిన దుండగుడు ఎవడోయ్
కాలినడకతో బయలుదేరిన
మనిషి ఆత్మననోయ్
కడలిలో కూరుకు
పోయిన మట్టే మనిషోయ్
తెలుసుకో భారతీయుడా
నువ్వు ఎవరివోయ్
కాదన్న మాటకు విలువెక్కువోయ్
నిజాయితీగా బ్రతుకుతున్న
ఓర్వలేక నిందలు మోపడమెక్కువోయ్
చెయ్యి చెయ్యి కలిపితే యుద్ధాన్ని సృష్టించచ్చోయ్
యుద్ధంలో అమరుడైతే
జోహార్ అనే సంకేతము తక్కువోయ్
సాహిత్యమే సెలయేరు వలె పొంగిపొర్లుతు,
కడలిలో అలలు ఎగసి ఎగసి
తన గమ్యాన్ని చేరుకుంటుందోయ్
కలం సేద్యాము వలె విరజిమ్ముతూ
నవ యువ తరానికి
కాలానికి గగనానికి
తన అక్షరం చేరువైతే
ఆలోచన దృక్పథం మారుతుందోయ్..
లోలోనే కృంగిపోకోయ్
దేవదాసుగా మారకోయ్
కాలంతో పాటు కలాన్ని
కదిలించోయ్
కడలిలా ముందుకు సాగిపోవోయ్.

గిద్దలూరు సాయి కిషోర్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, రాయదుర్గంకు చెందినవారు. మురళి, లక్ష్మి గార్లు ఆయన తల్లిదండ్రులు. సాయి కిషోర్కు చెల్లెలు ఉంది.
కవితలు, కథలు రాయడం అంటే సాయి కిషోర్కు చాలా ఇష్టం. అలాగే కవితల, కథల పోటీలకు పాల్గొనడం ఇష్టం.
సాయి కిషోర్కు కథలు, కవితలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీరు రచించిన కవితలు మైండ్ మీడియాలో కవితా ఝరి కార్యక్రమంలో అనేక మార్లు ప్రసారమయ్యాయి. త్వరలో ప్రచురితమవబోతున్న వీరి మొదటి కవితా సంపుటి పేరు ‘జీవనం’.