కలల తీరాల వెంట నడుస్తుంటే..
ఒక్క నువ్వు తప్ప.. కళ్ళకేమీ కానరాని
అంధత్వం లాంటి అయోమయం!
ఊహల లోకంలో విహరిస్తుంటే..
సమ్మోహనంగా నవ్వుతూ నువ్వు..
తేనెల తీయదనాల వంటి మాటల పరిచయం!
ప్రియనేస్తమా.. ప్రాణబంధమా..
నా కలలు.. నా ఊహలు..
అనునిత్యం నిన్నే స్మరిస్తుంటే..
ఇక ఇలలో నేను..
‘నీ నేను!’గా మారిపోతున్నాను!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.