[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘రైతే రాజు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


మేఘావృతమైన ఆకాశం
చిరుజల్లులతో
పుడమికి అభిషేకం చేస్తున్న
శుభసమయాలు
రైతన్నల నయనాలలో ఆనందబాష్పాలు
సరికొత్త ఉత్సాహాన్ని గుండెలనిండా నింపుకుని
వ్యవసాయం ప్రారంభించే శుభఘడియలు
రైతన్నల సంతోషాల సంబరాల నడుమ
పొలాలలో కదిలే అరకలు,
వరి నాట్ల కోలాహలాలు,
పండే పసిడి పంటలు రైతును రాజుగా చేస్తుంటే..
దేశానికి ఆహారాన్ని అందిస్తూ..
అతడు చేసే కృషి వెలకట్టలేనిది!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకై నిలిచే
అతడిని మనం సదా ప్రశంసించవలసిందే!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.