రైతు
దేశానికి వెన్నుముకే
అందుకేనేమో
నడ్డి విరిసేసారు
రైతు రారాజే
తెరపైకి మాత్రమే
పురోగతిలో
కనుమరుగవుతూ
రైతు
అవసరమే
ఓట్లు గుడ్లు పెట్టేటి
బంగారు బాతుగా
రైతు
పిడికిలి బిగిసింది
నిరసనలతో
తమ హక్కుల సాధనకై
నాగలి
పోరుబాట పట్టింది
బతుకు
భవితవ్యం దిశగా
మెతుకు
నిరాహారదీక్ష చేసింది
హక్కుల సాధనే
ధ్యేయంగా
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.
1 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
ప్రస్తుత పరిస్థితి ని
బాగా రాసారు
అభినందనలు మీకు
మేడం.