నా ఫోటో
చూసినప్పుడల్లా,
నా ప్రియ స్నేహితులెప్పుడూ
“కాస్త నవ్వచ్చు కదా!”
అంటూ –
ఆశీర్వదిస్తుంటారు నన్ను!
అవి సరదాగా అన్నా..
కోపంగా
మందలించినా..
వెక్కిరింపు ధోరణి ఐనా,
మనసులోనే
నవ్వేసుకుంటాను
వారి అభిమానానికి,
బయటికి –
ఎలాగూ నవ్వలేను గనుక!
నవ్వడం ఒక అదృష్టం,
నవ్వించడం ఒక కళ,
నవ్వేవాడ్ని చూసి
నవ్వే ప్రయత్నం చేయడం,
ఒక అనుభూతి..
అందుకే –
ప్రతి జీవితానికి
హస్యం..
ఒక చైతన్య గుళిక,
ఆనందం కలిగించే,
ఆరోగ్య ప్రణాళిక!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
1 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—–డా కె.ఎల్.వి.ప్రసాద్
సఫిల్ గూడ.