ఆకాశం మెరిసింది
చిటపట వాన కురిసింది
నేలతల్లి మురిసింది
కొమ్మలు చివుళ్ళు వేసాయి
పువ్వులు గుత్తులు పూసాయి
కోయిల కమ్మగ పాడింది
నెమలి నాట్యం ఆడింది
వసంత శోభ వచ్చింది
పండుగ కళను తెచ్చింది
బహుమతులెన్నో ఇచ్చింది
కొత్త బట్టలు వేసుకుని
పిండి వంటలు చేసుకుని
పండుగ వేడుక జరిపాము
సంతోషంగా గడిపాము
జగతికి ఆది ఉగాది
ఉగాదితోనే జనులకు యుగాది
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.