స్వప్రయోజనాన్ని ఆశించకుండా కళే జీవితంగా బ్రతికే కళాకారులు!
స్టేజ్ పైకి ఎక్కగానే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి…
తాము ధరించిన పాత్రను రక్తికట్టించే… ప్రేక్షక జనరంజకులు!
వీక్షకులు వేసే విజిల్స్, కొట్టే చప్పట్ల కు పొంగిపోయి…
ప్రజల ప్రశంసలే… వెలకట్టలేని విలువైన ఆస్తులుగా భావించే అమాయకులు!
రంగస్థలంపై మాత్రమే నటించడం తెలిసిన వాళ్ళు…
నిజజీవితంలో నటనకు చోటివ్వని నిష్కల్మష హృదయులు!
వాళ్ళే సురభి నాటక కళాకారులు!
సినిమాలు, టీ.వి లు వచ్చాక…
ఉనికిని కోల్పోతూ…
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న “నాటకానికి ”
పునర్వైవైభవం తీసుకురావాలన్న ఆశతో…
ఆ ప్రయత్నాలతో తమ జీవితాలనే పణంగా పెట్టి…
“నాటకం” గొప్పతనం ప్రపంచం తప్పకుండా మళ్ళీ తిరిగి
గుర్తిస్తుందన్న నమ్మకంతో బతుకుపయనం సాగిస్తున్న ఆశాజీవులు!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.