[8 మార్చ్ 2025 మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళా మొగ్గలు’ అనే కవితని అందిస్తున్నారు శ్రీమతి చంద్రకళ దీకొండ.]


పురిటినొప్పులెన్నింటినో భరించి
నూతన సృష్టికి నాంది పలుకుతుంది
ప్రకృతికి ప్రతిరూపం పడతి!
తాను ఉన్నత విద్యావంతురాలైతే
భావితరానికి దిక్సూచియై నిలుస్తుంది
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు!
సంగీత సాహిత్యాలతో మురిపించడమే కాదు
ప్రజాపరిపాలన సైతం సమర్థంగా చేయగలదు
వనితలు లేని విద్య ఇలలో లేదు!
భరించలేని వేదనలను సైతం
చిరునవ్వుతో పరిష్కరిస్తుంది
ఇలలో సహనశీలి మహిళ!
నీ ఉనికికి కారణమై
నీ ఉన్నతికి తోడ్పడునది
కన్నతల్లిని జన్మభూమిని మించినది లేదు!

చంద్రకళ దీకొండ గారు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు.