జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. జాతకాలు, హస్త సాముద్రికాలూ, జ్యోతిష్యాలు, ఎప్పుడూ నూటికి నూరు పాళ్ళు నిజాన్ని విప్పి చెప్పలేవు. వాటిని నమ్మేవాళ్ళు గురించి, నమ్మని వాళ్ళ గురించి ఇక్కడ చర్చించే ఉద్దేశం లేదు కానీ, జీవితాన్ని బట్టి, జీవితంలో ఎదురైన అనుభవాలిని బట్టి కేవలం ఈ వ్యాసం రచయిత ఉద్దేశం ఇది.
అనుకున్నవి కొన్ని ఎంత శ్రమించినా కార్య రూపం దాల్చవు. పైగా నిరాశా నిస్పృహలతో జతకట్టి బ్రతుకును మరింత వ్యధాభరితం కావిస్తాయ్! జీవితంలో అది సురపలేనంత మచ్చగా మిగిలిపోతుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతే, అంతకు మించిన జీవితం మరేమి ఉంటుంది? అంతకు మించిన స్వర్గం మరెక్కడో ఉండదు, కానీ సమస్య వచ్చేడల్లా అనుకున్నది, అనుకున్నట్టుగా జరగక పోవడమే..!
ఎన్నడూ, ఏ విధంగానూ, ఊహల్లో కూడా, వూహించనివి, జరిగితే అంతకు మించిన సంతోషం మరేమి ఉంటుంది? మొత్తం జీవితానందానికి, అది కేటలిస్టుగా పనిచేసి, యావత్ జీవితాన్ని ఆనందభరితం చేస్తుంది. చెప్పుకోరుగానీ చాలామంది జీవితాల్లో, ఈ రెండు రకాల అనుభవాలు చాలామందికి ఎదురౌతాయి. కొందరు విషయం ఎలాంటిదైనా సర్దుకుపోయే గుణాన్ని కలిగి వుంటారు. కానీ అనుకున్నవి జరగనప్పుడు కొంతమంది తొందరపడి మిగిలిన జీవితాన్ని వృథా చేసుకుంటారు. ఎవరి గురించో ఎందుకు? నా విషయంలో నేను ఊహించని కొన్ని మంచి విషయాలు, జీవన శైలినే మార్చేసిందంటే, చాలామందికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏమిటంటే అంశం అలాంటిది మరి!
నా ఉద్యోగ జీవితం నాటి మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రిలో 1982 జూన్లో ప్రారంభమైంది. నేను కథా రచయితగా ఆరంగేట్రం చేసింది అక్కడే! ‘దంత సంరక్షణ’, ‘చిన్న పిల్లలు – దంతసమస్యలు’ పుస్తకాలు (నవభారత్ బుక్ హౌస్ / పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ) ముద్రణకు నోచుకున్నది ఇక్కడే! ‘సారస్వత మేఖల’ అనే సాహిత్య సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసి చేతనయినంత సాహిత్య సేవచేసే అవకాశం దక్కింది ఇక్కడే! ‘వార్తాలహరి’ అనే ప్రాంతీయ పత్రికలో పిల్లల దంత సమస్యల గురించి సీరియల్గా రాసింది ఇక్కడే! రెండుసార్లు భారత్ వికాస్ పరిషత్ అనే సేవా సంస్థకు అధ్యక్షుడిగా వుండి, ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఇక్కడే!ఆకాశవాణి -వరంగల్ కేంద్రం నిర్వహించిన రెండురోజుల ఆహుతుల సమక్షంలో రేడియో కార్యక్రమాలకు, చాతనయినంత సహాయం చేసే అవకాశం కూడా ఇక్కడే వచ్చింది. అదిగో.. ఆ నేపథ్యంలో ఆకాశవాణి అధికారులు మహబూబాబాద్కు విచ్చేసారు. అందులో అప్పటి స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు గారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యుటివ్ శ్రీనివాస్ రెడ్డి, మంత్రవాది సుధాకర్, అనౌన్సర్ మడిపల్లి దక్షిణామూర్తి,ఇతర సాంకేతిక సిబ్బంది వచ్చారు.
అప్పుడు నాకు చేతనైనంత సహకారం నేను వారికి అందించాను. మంత్రవాది సుధాకర్ అప్పటికే నాకు పరిచయం. ఆయన దక్షిణామూర్తిని పరిచయం చేయడంతో, ఆయనతో నాకు మైత్రి చాలా బలపడింది. అది ఇప్పటికి చక్కగా కొనసాగడం నాకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే అంశం. ఈ పరిచయాల నేపథ్యంతో నేను 1994లో మహబూబాబాద్ నుండి జనగాంకు బదిలీ కావడంతో, నా శ్రీమతి బ్యాంకు ఉద్యోగిగా వరంగల్కు బదిలీ చేయించుకోవడం మూలాన నివాసం హనంకొండకు మార్చవలసి వచ్చింది. ఆ సందర్భంలో, మిత్రుడైన దక్షిణామూర్తి, శ్రీ డి. వి.శేషాచార్య గారిని పరిచయం చేసారు. వీరిద్దరూ కలిసి ప్రొఫెసర్ కోవెల సంపత్కుమారాచార్య గారిని, కోవెల సుప్రసన్నాచార్యులవారిని పరిచయం చేయడం జరిగింది (వీరిద్దరికి కృత్రిమ దంతాలు అమర్చే మహదావకాశం నాకు కలిగినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను).
శేషాచార్య పరిచయం నా జీవితంలో మరచిపోలేని మధుర ఘట్టం. నా బతుకు పుస్తకంలో అది గుర్తుంచుకోదగ్గ అధ్యాయం. దానికి ముఖ్య కారణం ఏమిటంటే,శేషాచార్య నన్ను -ప్రత్యక్షంగా ‘ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ’కు, పరోక్షంగా వరంగల్ సాహితీ రంగానికి (శ్రీరంగస్వామి వగైరా పెద్దలు) పరిచయం చేసి పుణ్యం గట్టుకున్న మహానుభావుడు. అలా సహృదయ సంస్థకు అతి చేరువ అయ్యే అదృష్టం నాకు దక్కింది. సహృదయ సంస్థలో చేరి అందులో పనిచేయడం నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తాను. కారణం ‘సహృదయ సాహిత్య -సాంస్కృతిక సంస్థ’ ఒక ప్రతిష్ఠాకరమైన సంస్థ కావడమే. సాహిత్యానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు సమానమైన ప్రాధాన్యతను ఇస్తున్న సంస్థ ఇది. నాకు తెలిసీ వరంగల్ లోని కొద్దిమంది ఉత్సాహవంతులైన పెద్దల ఆలోచనతో ఈ సంస్థ పురుడుపోసుకుంది. ఆ సమయానికి వరంగల్లులో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా ప్రసిద్ధ సహజ కవి, అవధాని, సహృదయ మిత్రులు డా. కవితా ప్రసాద్ గారు పనిచేయడం ‘సహృదయ’ కు కలిసి వచ్చింది. ఆయన ఆలోచనలతో, సహకారంతో, పెద్దలు శ్రీ గన్నమరాజు గిరిజమానోహర్, డా, ఏ. వి. నరసింహారావు, శ్రీ వనం లక్ష్మీ కాంతారావు, శ్రీ దర్భశయనం శేషాచార్య మొదలైన వారి విశేష కృషితో సంస్థ ఆవిర్భావం జరిగినట్టు తెలిసింది. ప్రస్తావనకు రాని పెద్దలు ఇంకా చాలా మంది ఉండవచ్చు. సంస్థ ‘చిహ్నం’రూప కల్పన చేసిన స్వర్గీయ రాళ్లబండి కవిత ప్రసాద్ గారు, సహృదయకు ‘మేనమామ’ గా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఇక అసలు విషయానికి వస్తే, నాకు 1994లో సహృదయ సభ్యుడిగా సంస్థతో అనుబంధం ఏర్పడేనాటికి, డా. ప్రసాద రావు గారు సంస్థకు అధ్యక్షుడిగా వున్నారు. ఆయన హయాంలోనే నా ‘దంతాలు- ఆరోగ్యం’ అనే పుస్తకం ఆవిష్కరణ, వరంగల్ జడ్.పి.హాల్లో అత్యంత వైభవంగా జరిగినట్టు నాకు బాగా గుర్తు. ఆవిష్కరణ కోసం ప్రత్యేకంగా దంతవైద్యులు (నిలోఫర్ హాస్పిటల్) డా. ఎ.ఎస్. నారాయణ గారు, నా కోరిక మన్నించి రావడం మరచిపోలేని విషయం. డా. లక్ష్మణ మూర్తి గారూ, డా. అంజనీ దేవి గారు, డా. సుధాకర్ రెడ్డి గారు (సభాధ్యక్షులు), జనగాం నుంచి ప్రొఫెసర్ అంజయ్యగారు ,తదితరులు వేదికను అలంకరించినట్టు గుర్తు.
సహృదయ సంస్థలో అనేకమంది పండితులు, విద్యావంతులు, సాహిత్యకారులు ఉన్నప్పటికీ, నన్ను సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఇప్పటికీ నాకు అర్థం కానీ అంశమే! అంతమాత్రమే కాదు, సుమారు 13 సంవత్సరాలు నన్ను అధ్యక్షుడిగా కొనసాగించడమూ ఆశ్చర్యం గొలిపించే విషయమే! ఈ సమయం సమాజంలో మరోమనిషిగా నన్ను మార్చివేసింది. సహృదయ సంస్థ అన్నా, సంస్థ బాధ్యులు అన్నా, సభ్యులు అన్నా, సమాజం లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. నాకు తెలియని ఎందరో వ్యక్తులు ఎక్కడో ఒకచోట నన్ను గుర్తుపట్టి, ‘మీరు ఫలానా సంస్థ అధ్యక్షులు కదా!’ అని పలకరించినప్పుడు నా మనసు ఎంతగానో పులకించి పోయేది. ప్రధానంగా సాహిత్య -సాంస్కృతిక కార్య క్రమాలతో ముడిపడి వున్నసంస్థ ‘సహృదయ ‘కావడం మూలాన, నేను ఊహించని వ్యక్తులతో, కళాకారులతో, పండితులతో, అవధానులతో, వైద్యులతో, గాయకులతో, సాహిత్యకారులతో, సినిమా పెద్దలతో, వివిధ రంగాలకు చెందిన అధికారులతో, దాతలతో పరిచయాలు ఏర్పడడం, వారితో కలసి వేదిక పంచుకోవడం వంటివి మరచిపోలేని మధురఘట్టాలు. వరంగల్కు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ల వేణు మాధవ్ గారిని, మైమ్ కళాకారుడు కందకట్ల కళాధర్, డా. అంపశయ్య నవీన్, డా. లక్ష్మణ మూర్తి, ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తి, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య, శ్రీ కోవెల సుప్రసన్నాచార్య, శ్రీ పేర్వారం జగన్నాధం వంటి వారిని చూస్తానని, వారితో పరిచయాలు ఏర్పడతాయని నేను ఎన్నడూ ఊహించలేదు. ఇది సుమారు 90 శాతం సహృదయ వల్ల మాత్రమే సాధ్యపడిందని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను, అది అతిశయోక్తి కూడా కాదని చెప్పగలను.
స్వయంగా సాహిత్యాభిలాషిని గనుక సంస్థ చేపట్టిన అనేక సాహిత్య కార్యక్రమాల ద్వారా నన్ను నేను ఆ మార్గంలో సరిదిద్దుకోగలిగాను. అంతేకాదు, సహృదయ చేపట్టిన మరొక ముఖ్యమైన కార్యక్రమం, మూడు రోజుల నాటకోత్సవాలు (పోటీలు). నాకు నాటకం అన్నా, ముఖ్యంగా హాస్యనాటకం అంటే చాలా ఇష్టం. అందుకే ఆ మూడు రోజుల కార్యక్రమం నాలో ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్ని రేకెత్తించేది.
చివర బహుమతుల ప్రధానం రోజున సమావేశం చాలా బాగుండేది. ఇలాంటి సందర్భాలలో, సర్వశ్రీ గొల్లపూడి మారుతీరావు, రావి కొండల రావు, రాళ్లబండి, నేరెళ్ల వేణుమాధవ్, రావూరి భరద్వాజ, జీడిగుంట రామచంద్రమూర్తి, కవితా ప్రసాద్, నవీన్ వంటి పెద్దల సరసన వేదికను పంచుకునే అదృష్టం నాకు కలిగింది. నాటక ప్రక్రియ పట్ల నాకున్న అభిరుచి, మా అక్క స్వర్గీయ కుమారి కానేటి మహనీయమ్మ మీద వున్నఅమితమైన ప్రేమను బట్టి, నాటకోత్సవాలకోసం మా అక్క పేరున ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు విరాళం ఇచ్చే అవకాశం నాకు సహృదయ కల్పించింది. ఇది నాకెంతో తృప్తి నిచ్చే అంశం. ఇది సహృదయ ఉన్నంత కాలం,నేను బ్రతికి ఉన్నంత కాలం కొనసాగుతూనే ఉంటుంది.
సహృదయకు కేంద్రబిందువు శ్రీ గన్నమరాజు గిరిజా మనోహరాబాబు. నేను అధ్యక్షుడిగా, ఆయన ప్రధాన కార్య దర్శిగా కలిసి పనిచేసిన రోజులు గుర్తుంచుకోదగ్గవి. ఆయన సహృదయ సంస్థ సజావుగా నడవడానికి, తెలుగు ప్రజల్లో పేరు ప్రతిష్ఠలు రావడానికి కారణం అయింది. స్వయంగా సాహిత్యకారుడూ తెలుగు పండితుడు కావడం మూలాన, సాహిత్యకార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ఆయన అందెవేసిన చేయి. అందుకే మహామహులు సహృదయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గరికపాటి, మైలవరపు శ్రీనివాస రావు, ఎల్.బి. శ్రీరామ్ వంటి పెద్దలు వీరి పరిచయం తోనే సహృదయకు దగ్గరయ్యారు. అందరితోనూ చక్కని స్నేహ సంబంధాలు కొనసాగించిన గొప్ప సహృదయత ఆయనది. నిరంతర సాహిత్య కృషీవలుడు ఆయన. గిరిజామనోహర్ బాబు మనసు ఎంత స్వఛ్చమో, ఆయన చేతివ్రాత అంత ముత్యాల్లా గుండ్రంగా ఉంటాయి. ఆయన ప్రార్థనా శ్లోకంతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యేవి. ఆయన ఉపన్యాసం వినసొంపుగా ఉంటుంది. ఆయనతో స్నేహం మరువలేనిది. స్వయంగా నటుడు,నాటక ప్రియుడు అయిన శ్రీ వనం లక్ష్మీ కాంతారావు, సాంస్కృతిక కార్యదర్శిగా ఉండేవారు. సహృదయ సంస్థకు ఆయన ఒక గట్టి స్తంభం లాంటివాడు. క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత నిచ్చేవాడు. ఇంచుమించు తెలుగు రాష్ట్రాలలో వున్నఅన్ని నాటక సమాజాలతో ఆయనకు సంబంధాలు వున్నాయి. అందుచేత నాటక పోటీల కోసం
మంచి నాటకాలు ఎంపికచేసి బాధ్యత ఆయన తీసుకునేవారు. నటులైన సి.హెచ్.ఎస్.ఎన్. మూర్తి, పాల్వాయి ఆదిరెడ్డి, ఎన్.వి.ఎన్. చారి, శేషాచార్య వంటి వారు ఆయనకు సహకరించేవారు.
ఎలాంటి భేషజాలూ లేకుండా, ఎలాంటి పనినైనా తన భుజస్కంధాల మీద వేసుకుని నూటికి నూరు శాతం బాధ్యతగల వ్యక్తిగా, కళాభిమానిగా, కళామ తల్లి సేవకుడిగా, మొదటి సాహిత్యకార్యదర్శిగా ఆయన తన సేవలు అందించారు. సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి గారు ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నా, ఇక్కడి సహృదయ సభ్యులు, అభిమానులూ ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. దానికి కారణం ఆయన మంచి నటుడు మాత్రమే గాక, సభ్యులను చేర్చడంలో, వారి అభిమానం పొందడంలో, మూర్తి గారు బహు నేర్పరి. సభ్యులను చేర్చడంలోనూ, కార్యక్రమాలలో సహాయం అందించడంలోనూ శ్రీ కుందావజ్జుల కృష్ణమూర్తిగారు తమ విలువైన సేవలను అందించారు. ఎప్పుడూ వీరు చేర్పించిన సభ్యుల సంఖ్య అధికంగా ఉండేది.
ఇంకా డా. నాంపల్లి, డా.రంగారావు, రమాకాంత రెడ్డి, డా.ఏ.వి.నరసింహరావు, డా.లక్ష్మణరావు, శ్రీ ఆనందకుమార్, ఇంకా నా దృష్టికి రాని, జ్ఞాపకానికి రాని అనేకమంది ఔత్సాహిక పెద్దల సహకారంతో, సహృదయను దిగ్విజయంగా నడపగలిగాం. నిజం చెప్పాలంటే సంస్థకు అందరికంటే అతి తక్కువ శ్రమించింది నేనే! అందరూ అంత గొప్ప అభిమానం నాపై చూపించారు. వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై వుంటాను.
ఇప్పుడు సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థలో శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, ఎన్.వి.ఎన్.చారి, కుందావజ్జుల కృష్ణమూర్తి, శ్రీ వనం లక్ష్మీకాంతారావు, ఒద్దిరాజు వేణుగోపాలరావు వంటి పెద్దల ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమాలు రూపొందించ బడుతున్నాయి. మరి, సహృదయ ‘కరోనా’కు అతీతం కాదు కదా! ప్రస్తుత పరిస్థితి ఇదీ..!!
నా జీవితం అనే పుస్తకంలో ‘సహృదయ’ ఒక ప్రత్యేకమైన అధ్యాయం.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
అక్క పేరు మీద పది వేల రూపాయలు ఇవ్వటం విశేషం. రచయిత కు ఇన్ని వ్యక్తుల పేర్లు ఇంటి పేరుతో సహ గుర్తు పెట్టుకో వాటం అన్నది చాలా గొప్ప కళ. వైద్య వృత్తి లో వుంటూ ఇన్ని సాహిత్య కార్యక్రమాలు చేయటం ఇంకా గొప్ప వ్యక్తిత్వం.
ధన్య వాదా లు మిత్రమా…
మీలో ఉన్న సాహిత్యాభిలాష మిమ్మలిని ఇంతమందికి చేరువచేసింది సర్ . అలాగే మీ అక్కగారి పేరుమీద ఇచ్చే విరాళం ఎంతోమందికి స్పూర్తిదాయకం కూడ. మీకు సహృదయ సంస్దతో అనుబంధం కలకాలం సాగిపోవాలని ఆశిస్తున్నాను సర్ .
Gd Mng doctor garu. 🙏 I attended one of the skits organised by “Sahrudaya” in REC Wgl auditorium during my stay in Hanamkonda.
—– surya narayana rao Hyderabad
Thank you Somuch sir For your Sinceier Response.
Prasad Garu! Sahrudaya dwaaraa meeru cheshina Saahithya Seva entho abhinandaneeyam👌👌👌 Kalaarangaaniki meeru Andinchina sahakaaram mahonnathamainadi..🙏
ధన్యవాదాలండీ రావు గారూ
No words Sir💐💐💐… You are a great personality🙏🙏🙏… మీ సాహిత్యాభిలాషకి సాహిత్య కృషికి నమోనమః..
ఝాన్సీ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
శుభోదయం సార్ 🙏ఈ వారం మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. మీరు అదృష్టవంతులు.మీ అంతగా కాదు కానీ శ్రీరంగస్వామి అన్నయ్య పరిచయం నా జీవితంలో సాహితీ ప్రపంచానికి ఆహ్వానించి ఎందరో మహానుభావుల పరిచయ భాగ్యం కలిగించింది.అనేక సాహితీ సమావేశాలలో,రేడియో కార్యక్రమాలలో. అవధానాలలో పృచ్చకురాలిగా పాల్గొనే అవకాశాన్ని కల్పించడం నా అదృష్టం.శ్రీలేఖ సాహితీ సంస్థలో సభ్యత్వం నన్ను ధన్యురాలిని,ఒక పుస్తకం సహసంపాదకత్వానికి తోడ్పడటం,అదే స్పూర్తిగా నేను 10 సంవత్సరాలు చెకుముకి పిల్లల సైన్స్ మాసపత్రికలో సహసంపాదకత్వానికి, ప్రభుత్వ మాసపత్రికలో 5 సంవత్సరాలు పనిచేయడానికి, గత 6 ఏళ్లుగా మా టీచర్స్ యూనియన్ మాసపత్రికలో పనిచేయడానికి అవకాశం కల్పించడం గర్వంగా అన్పిస్తుంది. శ్రీరంగస్వామి అన్నయ్య ఋణం ఎప్పటికీ తీర్చుకోగలనా? నా వ్యాసశృతి అమ్మాబాపులకు, పిహెచ్.డి.పుస్తకం పెద్దన్నయ్య వదినలకు అంకితం ఇచ్చాను.మరో పుస్తకం ప్రచురించి శ్రీరంగస్వామి అన్నయ్య వదినలకు అంకితం ఇవ్వడం నా బాధ్యతగా,జన్మధన్యతగా భావిస్తున్నాను సార్. మీలాంటి ఆత్మీయ సోదరుల ప్రోత్సాహం కూడా నా అభివృద్ధిలో భాగమే. ఆనంద్ కుమార్ సార్ కూడా ఒక సోదరుడు, నేస్తంలా సలహాలు ఇస్తుంటారు. నేను JVV లో 15 సంవత్సరాలు పనిచేసాను సార్.మీకు పరిచయం ఐన వారిలో 50% నాకూ తెల్సినవారన్నారు సార్. ప్రతీవారం మీ ఙాపకాలపందిరి నా మధుర, చేదు ఙాపకాలను గుర్తుకు తెస్తుంది సార్. నాకూ మీలా రాయాలని కోరిక.మీకు చాలా ధన్యవాదాలు సార్. సదా మీ ఆశీస్సులు ఆశిస్తూ ఆత్మీయ సోదరి విద్యాదేవి. 👌🙏 .హనంకొండ.
అమ్మా.. మీ స్పందన కు ధన్యవాదాలు.
———సాగర్ రెడ్డి చెన్నై.
సాగర్ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
ANNI VISHAYAALU గుర్తుపెట్టుకొని వివరంగా రాసారు .CHADIVINATTU KAKUNDA EDURUGA MATLADUTHUNNATTE UNDI.MAHANEEYAMMA GARI PERUNA SAMSTHAKU SEVA ANDINCHADAM ABHINDANEEYAM.👏👏💐💐
—–Dr.V.Sujatha Vijayawada.
Dr.garu Thank you.
మీరు వైద్యుడే కాదు సాహిత్య కళాకారుడు అని చాల బాగా తెలియజేశారు చాలా చాలా గొప్ప వాళ్లతో మీరు కలిసి చేసిన ప్రయాణం అభినందనీయం. కేవలం మీ కృషి తపన మిమ్మల్ని ఇంత గొప్పగా వృత్తిలోనే కాదు సమాజంలో కూడా చేసింది. ఎందరో సాహిత్య కళాకారుల్ని గుర్తు చేసినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కలలు కనడమే కాదు ఆ కలలను నెరవేర్చడంలో ఒక గొప్ప కల ఉంది. ఇవి మీ అనుభవాలు బాshగా తెలియజేస్తునాయి.
“సహృదయ” సాహితీ సంస్థ గురించి సహృదయంతో వ్రాసిన మీ వ్యాసంతో….ఇతర సాహిత్య కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు….వ్యక్తి వికాసానికి సాహిత్య…. సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉపయోగపడతాయో మీ రచన నిర్వచిస్తుంది…. అభినందనలు!
—– ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ హైదారాబాద్.
ధన్యవాదాలండీ.
అభిరుచులు అందర్నీ కలిపే చక్కని మార్గాలు … మారుమూలప్రాంతాల్లో ఉన్నా మానవసంబంధాలను మరింతగా పటిష్ఠపరచేది సాహిత్యమూ , సాంస్కృతికమూ .. ఆ రెంటిపైనా మీకున్న మమకారం , అక్షరం పట్ల మీకున్న సహృదయతే మిమ్మల్ని ఒక విశిష్ట సంస్థకు అధ్యక్షుణ్ణి చేసింది … ఎందరో ఆత్మీయులతో మైత్రిని సంపాదించి పెట్టింది … ఇక్కడే కొంచెం ఆలోచించే చిన్న ముచ్చట ఉంది …. ఎందరు కొత్తవారితో పరిచయాలేర్పడ్డా , ఎందరు సాహితీ దిగ్గజాలతో వేదికలు పంచుకున్నా , ఎన్ని కార్యక్రమాలనిర్వహణల్లో ముఖ్యబాధ్యతలు తీసుకున్నా మీరు పూర్తిగా సహకరించే మనస్తత్త్వం ఉంది కాబట్టే గణింపదగినంత కాలం సేవలందించ గలుగుతున్నారు .. సహృదయ రాష్ట్రస్థాయి సంస్థగా రూపొందటానికీ , దానికొక ప్రత్యేక గుర్తింపురావటానికీ శ్రమించిన కళా మిత్రుల్లో , సాహితీ ప్రేమికుల్లో మీరూ ఒకరు కావటమే మీ సుదీర్ఘ సాహితీ ప్రస్థానానికి ప్రధానకారణం .. వ్యక్తులమధ్య ఉండే భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ , ఇతరుల వ్యక్తిత్వాలను కూడా పరిగణలోకి తీసుకోగలిగిన సహృదయత ఉన్నవారు గనుకే సంస్థకు అధ్యక్షులు గా గణనీయమైన సేవలందించి సంస్థ మనుగడకు ఏడుగడగా నిలువగలిగారు , మిత్రులందరి ప్రేమనూ పొందగలిగారు … నిబద్ధత గల కార్యకర్తగా గత రెండు దశాబ్దాలుగా సేవలందించడమే గాక , స్వయంగా ఆర్థిక సాయం అందిస్తూనే ఎందరి చేతనో ఆర్థిక సహకారాన్ని అందింపజేయడం లో మీ సహృదయత సహృదయసంస్థ బలాన్ని రెండింతలుగ చేసింది … సమష్టి కృషి కి ఎప్పుడైనా విజయమే తప్ప అపజయం ఉండదనీ , పురోగమనమే గాని తిరోగమనం కూడా ఉండదనీ నిరూపించిన గొప్ప సంస్థను , సంస్థ మిత్రులనూ ఆత్మీయతతో పేరుపేరునా మీ జ్ఞాపకాల పందిట్లో పీటవేసి కూర్చోపెట్టినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు సర్ … ..———గిరిజా మనోహర్ బాబు హనంకొండ
గురువుగారూ మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు సర్
సర్.. సహృదయ..గురించి బాగా చెప్పారు…
——-కుమారస్వామి.కె హనంకొండ
ధన్యవాదాలండీ
ఈ వ్యాసం మీ సాహితీ జీవితానికి నిదర్శనం. మనం చరిత్ర లోకి చూస్తే ఓరుగల్లు నగరం సాహిత్యానికి ఒక పేద పీఠ. నాకు ఓరుగల్లు నగరం మీద మక్కువ చాలా ఉండేది. నాకు కావలసిన మిత్రులు ఉండేవారు. ఎప్పుడు వచ్చినా భద్ర కాలి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. ఇంకో విషయం మీరు డా. లక్ష్మణ మూర్తి గారి ప్రస్తావన చేశారు, వారు సర్జన్ ఆ. సర్జన్ లక్ష్మణ మూర్తి గారి రెండు సార్లు కలవడం జరిగింది .
—-డా.డి.సత్యన్నారాయణ హైదారాబాద్.
జ్ఞాపకాల పందిరి 31 చదివాను. అక్కడ కామెంట్ ఎక్కడ రాయాలో తెలియలేదు. ఎద లోతులో ఏ మూలనో ఉన్నన్ని జ్ఞాపకాలు పలుకరిస్తుంటే వాటిని అలా అలవోకగా sequential గా పేర్కొంటూ,ప్రముఖు లందరిని పేరు పేరునా గు ర్తుంచుకోడం ,ఆ అనుభవాలను, అనుభూతుల్ని అందంగా కదంబంగా అల్లి పాఠకులకు అందించడం కనువిందు చేయడమే.భగవంతుడు విద్యతో బాటు వితరణ ని ప్రసాదించాడు.ఏటేటా పదివేల రూపాయల బహుమతిని దివంగత అక్కగారి పేరిట నెలకొల్పడం అది కొనసాగించడం అభినందనీయం.మీలోని మరో కోణం కనబడింది.
——వెంపటి కామేశ్వర రావు హైదారాబాద్.
సహృదయ సంస్థతో మీ సాహితీ ప్రయాణం, మరియు సాహితీ శిఖరాలతో మీ పరిచయం కడు ఆనందదాయకం. అభినందనలు.
—-శ్రీనివాస చారి.జి కాజీ పేట
డాక్టర్ ప్రసాద్ గారు నమస్తే. మీ జ్ఞాపకాల పందిరి నిజంగానే చల్లటి పందిరిలా ఉంది. మీ జ్ఞాపకాల పందిరిలో మీ గురించిన అనేక విషయాలు తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. తూర్పుగోదావరి జిల్లా దండి గ్రామంలో జన్మించిన మీరు అంచలంచలుగా ఎదిగి, డాక్టరు వృత్తిలో అఖండమైన ఖ్యాతిని సంపాదించారు. అటు సాహిత్య పరంగా మీరు చేసినటువంటి కృషి అసాధారణమైనది. సాహిత్యవేత్తగానే కాకుండా అనేక సాహిత్య కార్యక్రమాలకు మీరు అందించిన చేయూత చాలా గొప్ప స్థాయిలో ఉంది. వేలాది మంది అభిమానాన్ని చూరగొన్న మీ మంచితనం, మీ సహృదయత, మీ సాహిత్యం అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా అభినందనలు అందజేస్తున్నాను.
..—ప్రొఫెసర్.కె.జి.వేణు విశాఖ పట్నం.
మీ సహృదయ విశ్లేషణ అద్భుతం సర్ ధన్యవాదాలు మీకు..
మహబూబాబాద్ కు మీ జీవితంలొ ప్రత్యేకమైన స్థానం ఉన్నట్టనిపిస్తున్నది.కొన్ని కొన్ని. నగరాలొ వ్యక్తులొ మన జీవితంపై గొప్ప ప్రభావాన్నివేయటం జరుగుతుంది. అట్ల మహబూబ్బాద్ మీకు ఇక సహృదయ సంస్ెథ గురించి. మ4రు చెప్పినవన్నీ అక్షరాలా సత్యమైనవే. హైదరాబాద్ లొ యువభారతి సాహిత్యసంస్థ ఇట్లాగే మంచిక్రమశిక్షణతొపనిచేసింది వంగపల్లి విశ్వ నాధం ఆక్రమశిక్షణను inculcate చేసినాడు. కొన్నాళ్ళు చాలాబాగా ఎన్నొ కార్యక్రమాలను నిర్వహించఎన్నొ పుస్కాలనూ ప్రచురించింది .ఇప్పుడు సహృదయ కూడా .వాళ్ళు నాటకాలు వేెసారు కాని తక్కువ.సహృదయ కార్యక్రమాలలొ వైవిధ్యం ఎక్కువ . ఏది ఏమైనా మీ ఆత్మకథలొ ఆవిషయాన్ని రికార్డు చేసి భవిెష్యత్తులొ పరిశొధకులకు సమాచారాన్ని అందచేస్తున్నారు. అభినందనలు డాక్టరు గారూ!
——-నాగిళ్ళ.రామ శాస్త్రి హనంకొండ
ధన్యవాదాలండీ శాస్త్రి గారు.
మీ జ్ఞాపకాల పందిరి చాలా బావుంది . మరిన్ని జ్ఞాపకాలు పంచగలరు…
మీ వృత్తి ధర్మం తరువాత మీకు ఇష్టమైన, సాహిత్య రంగాలకు మీరు ఎంత అంకిత మయ్యారో ఈ వారం జ్ఞాపకాల పందిరిలో స్పష్టమైంది. చూస్తుంటే, సహృదయ సంస్థలో మీరు చాలా ఇన్వాల్వ్ అయి అనేక గొప్ప వ్యక్తులను కలవటం, వాళ్ళతో పని చేయటం మధుర స్మృతి. గొప్ప తృప్తిని మిగిల్చి ఉంటుంది ఈ సంస్థలో మీ అనుభవాలు. మీకు మా మనస్పూర్తి అభినందనలు
రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి
ధన్యవాదాలండీ ప్రసాద్ గారు.
సహృదయులకు వేదిక దొరకడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. మీ సాహిత్యాభిలాషకి ఆ వేదిక లభ్యత బంగారానికి తావి అబ్బినట్టే. అలాగే ప్రతి ఏడూ మీ ఆర్థిక వితరణ గొప్ప విషయం. అభినందనలు.
ఈ జ్ఞాపకాల పందిరి వేదిక ద్వారా మీ జీవితంలోని మధుర స్మృతులను మా అందరితో పంచుకోవడం చాలా సంతోషం సర్. దంత వైద్యులు గా పనిచేస్తునే కథా రచయితగా, సాహిత్య అభిలాషికునిగా,సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం సర్. మీ జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు మీ వద్ద భద్రంగా ఉండడం,అంతమంది ప్రముఖుల పేర్లు గుర్తు ఉండడం అరుదైన విషయం సర్. నాటకోత్సవ విజేతలకు 10వేలు బహుమతిగా అందించడం మీ అక్కగారిపై మీ ప్రేమ ను తెలియజేస్తుంది సర్.
జానీ.. ధన్య వాదాలు.
సహృదయ తో మీ అనుబంధం తెలుసుకునే అవకాశం కలిగింది..1995 నుండి నేను ఈ సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకూ కలిగింది.
—-డా.మల్లికార్జున్ హనంకొండ.
జీవితంలో అనుభవాలు చాలా ముఖ్యం సార్.జీవితానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి.జ్ఞాపకాల పందిరి చాలా బాగుంది సార్. మీకు అభినందనలు డాక్టర్ సార్.
సంగీతం.. ధన్య వాదాలు.
వైద్య వృత్తి లో వుంటూ, సాహిత్యం పై మీకు ఉన్న మక్కువతొ మీరు సహృదయ తొ ఇమిడి ఎన్నో సభలను నడిపి సాహిత్యాని ప్రోత్సహించారు. అన్ని పేర్లు గుర్తు పెట్టు కోవడం చాలా విశేషం అని చెప్పాలి. అక్కగారి మీద ఉన్న ప్రేమ తో 10,000 /- ఇస్తున్నారు. మీరు అభినందనీయులు. 🙏
—-రవి కుమార్ కాజీపేట
ధన్యవాదాలు సొదరా….
Good morning sir కలిసొచ్చే కాలం వస్తే నడివచ్చే కొడుకు పుడతాడనే సామెత లాగా వుంది సార్ దానికి మీ ప్రవర్తన తోడయింది . మీరు సహృదయులు కాబట్టే సహృదయలో స్థానం😀🙏
——-శ్రీహరి.కె ఆకాశవాణి వరంగల్లు
మీ జ్ఞాపకాల పందిరి లో చోటు చేసుకోవడం నా అదృష్టం. ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న మాట.
డాక్టర్ గారూ ధన్యవాదములు –డి.వి.శేషా చార్య కరీంనగర్.
ప్రసాద్ గారికి మీకు సహృదయకు విడదీయలేనిబంధం మీరు సహృదయకు ప్రసాదమే.నిర్మొహమాటంగా లోపాలను ఎత్తిచూపుతూ సంస్థను నడిపినవారిలో మీదీ కీలకభూమికే . హృదయమ్ము నవనీతసదనమ్ము నిర్మల మందాకినీ శీతల మార్దవ గేయమ్ము కాబట్టే సహృదయను సొంతంచేసుకున్నారు సంస్థథకు ఒక బ్రాండ్ నేమ్ రావడానికి సలిపిన కృషి గొప్పది. మీరు నాటకోత్సవాలలో ఒకసారి మీ బాబు ద్వారా రెండుస్పాన్సర్స్ ఇచ్చారు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్న సత్యాన్ని పాటించారు అందరం కూడా. రజతోత్సవానికి చేరువలో (2021)ఉన్న సంస్థ లో మన భాగస్వామ్యం ముదావహం
చారి గారూ ధన్యవాదాలు
[09/11, 16:01] Chandrasekhar_ Jogam: ఇంత కష్ట పడిఅందరు కలలు కని, పెంచి పోషించారుకాబట్టి విరాజిల్తుంది. పెద్దల ఆశీస్సులు,మివంటివారి support yepudu untundi Kabatti ,samsta chirastai ga nilichi pothundi. ALL THE BEST. [09/11, 16:05] Chandrasekhar_ Jogam: D .Chandra sekhar,Vanastalipuram. Hyd.
Sekhar Thank you.
రచనలు ప్రారంభించడం నుండి సహృదయ బాధ్యత ల వరకు మీ జ్ఞాపకాలు స్పూర్తి ని కలిగించేలా ఉన్నాయి సార్.
ధన్యవాదాలు శ్రీనివాస్.
మీ కథనంలో మానవీయ దృక్పథం గల వ్యక్తులు,సేవాధర్మంఆచరణలో చూపిన సంస్థ లు గురించి చెప్పడం,తాజా సంచికలో మిత్రుడు శేషాచారి గురించి ప్రస్తావన బాగుంది.
—చలపతి రావు హైదారాబాద్.
———-బి.జానీబాషా నర్సరావు పేట.
మీ స్పందనకు ధన్యవాదాలు
జ్ఞాపకాల పందిరి-31 https://sanchika.com/gnapakala-pandiri-31/ Meeku vritti Doctor, pravrutti sahityam avvadamtho entho mandi peddalu tho parichayam mimmlni enka unntulani chesindi.samajam lo guthinpu, gouravam dakkayi.
——-పద్మావతి.పొన్నాడ నరసాపూర్
నీ సాహితీ కృషి కి పెద్దలతో ఏర్పడిన పరిచయాలు వారి దీవెనలు గా భావించు కోవచ్చు
—–డా.శంకర్ లాల్ హైదారాబాద్.
ధన్యవాదాలు మిత్రమా…
మీ జ్ఞాపకాల పందిరి 31 చదివాను.ఏ విషయాన్నైనా సరే ప్రసెంటు చేయటంలో మీరు దిట్ట,మీకు ‘సహృదయ’తో వున్న బంధం,అనుబంధం హర్షనీయం.అంతటి గొప్ప మహానుభావులతో మీకున్న అనుబంధం కొనసాగాలని, సహృదయ చిరకాలం వుండాలని ఆశిస్తాను.
—-బి.నాగేశ్వర రావు చెన్నై.
బాగుంది . సంసారవృక్షానికి అమృత ఫలాలు రెండు.ఒకటి కావ్యామృత రసపానం (నాటకాలు కూడా) రెండు సజ్జనసంగతి ,సహృదయద్వా రా లభించిన సత్కవులు సజ్జనుల సాంగత్యం మరోటి. ఈవరాలు లభించాలన్నా ముందుమనమూ మనమనస్సులూ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమూ అంటే కళా సేవలో మనస్సు రచనా ,సహకారముల నందించ గలిగిన సిద్ధ బుద్ధి.దానికితోడు సమ యమూ ,ఆర్థిక వితరణమూ ఇవన్నీ వెచ్చించగల జీవితం ఇష్టంగా వాటితో ప్రవర్తించింది కాబట్టి ఆయా సమయాల్లో ఆనందం ,ఇప్పుడు మధురజ్ఞాపకాలతో ఉల్లాసం నిజమే ,స్వానుభవజీవితంలో సహృ దయ సాహిత్యవ్యాసంగం మీకు మల్లేపూవు.ఆపరిమళాలు జీవితాంతం సంతోషాన్నిస్తాయి ——వజ్జల రంగాచార్య హనంకొండ
ధన్యవాదాలండీ రంగాచార్య గారు.
You are remembering everyone who were associated with you after many years. So nice of you.
—–Dr.Manjula Hyderabad.
Thank you Dr.garu.
బాగుంది సార్ మీరు సహృదయులు కాబట్టి *సహృదయ* తో అనుబంధం పెనవేసుకుంది
——–నిధి(బ్రహ్మ చారి) హనంకొండ.
డాక్టర్ అన్నయ్యా,
మీ వృత్తి వైద్యం, ప్రవృత్తి సాహిత్యం. రెండింటికీ సమ ప్రాధాన్యత ఇవ్వడం మీ అభిరుచికి అద్దంపడుతుంది. డాక్టరు కాబోయి రైటరు అయ్యాను అనేది వ్యవహారంలో అనేకులు సాధారణంగా ఉపయోగించే పదబంధం. అయితే మీరు మాత్రం డాక్టరు కావాలనుకుని డాక్టరు అయ్యారు. రైటరు కావాలనుకుని రైటరు అయ్యారు. సహృదయుల సహకారంతో “సహృదయ”లో భాగస్వాములై ఇతరులకు సహకారం అందించడంలో సఫలమయ్యారు.
మీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మాకుకూడా మీ జ్ఞాపకాలు జ్ఞాపకం చేస్తున్న నేపథ్యంలో మీ “సహృదయ”త నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక రచనా ప్రకరణంలో తొలి అడుగులు వేస్తున్నప్పుడే “సజీవసాక్షి” మాస పత్రికకు నా రచనలు పరిచయం చేయడం, ఆయా సమయాలలో ఆకాశవాణి ద్వారా నా ఆలోచనలు శ్రోతలకు తెలియజేసే అవకాశం ఏర్పరచి నన్ను ప్రోత్సహించడం మీ సహృదయతకు, మీలోని సాహితీ తపనకు అద్దంపడుతుంది. అందుకు వందనాలతో
మీ జ్ఞాపకాల పందిరికి మీకు అభినందనలతో మీ ఆర్యీ జయ్ (ఆర్ ఎలూ జయ్)
బ్రదర్ మీ స్పందన కు ధన్యవాదాలు.
డా ప్రసాద్ గారూ , వృత్తి రంగంలో దంత వైద్యులుగా చికిత్స చేసి పలువురి ముఖాల్లో నవ్వులు పూయించారు .సహృద సంస్థ సమ్ముఖంగా పలువురు సాహితీ మూర్తులతోడి మీ సాహిత్య సేవా ఉదంతం తెలిపారు . . మహనీయమైన జ్ఞాపకాల పందిరిలో అక్క గారిని పల్లకిలో తెచ్చి దింపారు .భావి పరిశోధకులకు మంచి సమాచార సంగ్రహాన్ని సమకూర్చారు .
మేడం మీ స్పందన కు ధన్యవాదాలండీ .
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™