క్షమించు తండ్రీ!వృద్ధులు అనాథాశ్రమాల పాలు కాకూడదనివేదికలెక్కి ఆదర్శాలను ఎంత గొప్పగా వల్లిస్తానో!అనర్గళంగా ఉపన్యసించి ఎంత బాగా అలరిస్తానో!చక్కగా వివరించి ఎంతమందిని ఒప్పిస్తానో!వాస్తవానికొస్తే నాన్నా!పెళ్ళాం అహంభావం ముందు పరాభవం పాలయిన వాణ్ణి!అత్తగారి ఆధిపత్య పోరులో నలిగిపోయిన వాణ్ణి!స్వార్థ, కుటిలత్వాల మధ్య కుమిలిపోయిన వాణ్ణి!చరమాంకంలో నిన్ను చేరదీయని వాణ్ణి!ప్రేమతో పట్టెడన్నెం పెట్టలేని దరిద్రుణ్ణి!అక్కున చేర్చుకొని నీ మనసు పంచుకోలేకపోయిన వాణ్ణి!నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వాణ్ణి!నీ పెద్దరికాన్ని గౌరవించలేకపోయిన వాణ్ణి!ఆత్మవంచన చేసుకుంటూ అసమర్థుడిగా మిగిలిపోయిన వాణ్ణి!నీ లక్షలకు వారసుణ్ణయ్యాను కానీనిన్ను లక్షణంగా చూడలేకపోయిన వాణ్ణి!ఎన్ని చెప్పినా నాన్నా –జీవితంలో కృతఘ్నుడిగా నీ ముందు నిలబడ్డ వాడిని!నా వైభవాల్ని ప్రదర్శించడం, నా అభిప్రాయాల్ని రుద్దడం తప్పనీ సూచనలకు విలువ యిచ్చిన దెప్పుడు?నీ అలోచనలనీ, అంతరంగాన్ని అర్థం చేసుకున్నదెప్పుడు?నువ్వు తనువు చాలిస్తే –ఇక ప్రాయశ్చిత్తం ఏముంటుంది?ఈ ఋణానుబంధం ఎప్పుడు తీరుతుంది?వచ్చే జన్మంటూ ఉంటే –నాకు కొడుకుగా పుట్టి, నీ కక్ష తీర్చుకో!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
కవిత్వం బాగుంది , అనేక వషయాలు తెలియపరచలు అబిప్రాయలు బాగుంది, ఇంకా అనేక వషయాలు తెలియపరచరు
కవిత చాలా బాగుంది గురువు గారు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™