కావలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న ఎస్.బిందు శ్రీ ఈ పుస్తకంలోని ‘ మంచితనానికి కులమేమిటి?’ కథను విశ్లేషిస్తోంది.
***
సంచిక తెలుగు సాహితీ వేదిక వారు ప్రజలలో తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం గురించి వారిలో అవగాహన పెంచడం కోసం చేసే ప్రయత్నంలో విద్యార్థి దశ నుండే సాహిత్యంపై ఇష్టం ఉండేలాగా వారు ప్రచురించిన పుస్తకంలో కులం అని కనిపించని గోడ మనల్ని ఏ విధంగా మారుస్తుందో అనే విషయం పై ఎన్నో కథలను ప్రచురించారు. అందులో నాకు నచ్చిన కథ ”మంచితనానికి కులమేమిటి?’. పుస్తకం పై నా అభిప్రాయం.
ప్రస్తుత యువత మనసులో కులం అనే మొక్క పెరుగుతుంది. కులం వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. కావున కులాన్ని విస్మరించుదాం. జాతి, మతం అనే మాటలను వదిలి భారతీయులంతా ఒక్కటే WE ARE THE INDIANS అని చెప్పుదాం.
కులాన్ని అంతం చేద్దాం ఆకాంక్షించిన నవభారతాన్ని నిర్మించుదాం మంచిగా జీవిద్దాం
కులం వెనుకబాటుతనం
కులం గోడల్ని కూల్చేద్దాం.
భారతదేశంలో కులం అనే వివక్ష పోతేనే భారతదేశానికున్న పేరు సమస్త ప్రపంచంలో వినిపిస్తుంది.
ఎస్.బిందు శ్రీ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™