మనిషి వ్యక్తిత్త్వాన్ని బట్టి, మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి అతనికి లేదా ఆమెకి గౌరవం లభిస్తుంది. ఇది ఎక్కడైనా జరిగే పనే. మన మాట వక్రంగా ఉంటే, ఎదుటి వాళ్ళు కూడా వక్రంగానే ప్రవర్తిస్తారు. ఇది సహజమే!ఇది తెలీక తమ పదవిని అడ్డుపెట్టుకునో, హోదాను అడ్డు పెట్టుకునో, ఆస్తులు – అంతస్తుల ప్రభావం వల్లనో కొంతమంది అతిగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చేసే పని కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ వాళ్ళకే సంతోషాన్ని కలిగిస్తుంది కానీ ఇతరులకు కాదు. అందుకే హోదాలకు, పదవులకు, అతీతంగా మన ప్రవర్తన ఉండాలి. గౌరవం/మర్యాద ఇచ్చి పుచ్చుకునేవిగా ఉండాలి గానీ, మరోలా కాదు. చిన్నప్పుడు మా నాయన ఎప్పుడూ ఇదేవిషయం ప్రస్తావించేవారు. “ఏమండీ.. అంటే – ఏమండీ.. అనాలి, అరేయ్.. అంటే.. ఒరేయ్.. అనాలి” అని చెప్పేవారు. ఆంగ్లంలో దీని గురించి మంచి నానుడి కూడా వుంది. ‘గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్’ అని. ఇది తెలియక, అక్షర జ్ఞానం కలవారు సైతం అతిగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఎదురుకాక మానవు. నా జీవితంలో (ఉద్యోగ పర్వం) ఎదురైన రెండు సంఘటనలను లేదా అనుభవాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి ఇతరులకు కూడా ఎదురు కావచ్చు. అందుచేతనే దీనిని ఒక ప్రత్యేక అంశంగా ప్రస్తావించడం.
నేను 2005లో కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్తో వెళ్లాను. అప్పటికి సివిల్ సర్జన్ పోస్ట్ ఖాళీగా ఉండడం వల్ల నేనే హెడ్గా వున్నాను. ఆ మొదటి రోజుల్లో నేను ఓ.పి విభాగంలో పేషేంట్స్ను చూడడంలో నిమగ్నమై వున్నప్పుడు, లైన్లో నిలబడకుండా డైరెక్ట్గా నా సీట్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సూటు బూటూ, నెక్ టై, చాలా స్టైల్గా వున్నాడు. నలభై లోపు వయసు వాడు, చూడ్డానికి చాలా అందంగా వున్నాడు. అతని వాలకం చూస్తే, ఎందుకో అతనికి కుర్చీ ఆఫర్ చేసి కూర్చోమనబుద్ధి కాలేదు. నాపని నేను చేసుకుంటూ పోతున్నాను. నన్ను ఆకర్షించడానికి రెండు మూడు సార్లు దగ్గాడు కూడ. అయినా నేను పట్టించుకోకపోవడం గమనించి “సార్.. అయాం ఫ్రమ్ ది డెక్కన్ క్రానికల్” అన్నాడు.
“అవునా.. నన్ను ఇంటర్వ్యూ చేస్తారా?” అని అడిగాను.
“లేదు సార్..” అన్నాడు కొంచెం సీరియస్గా.
“మరి..?.. నన్ను ఏమైనా రాయమంటారా?” అన్నాను.
“ఆహా.. అది కాదు సార్..” అన్నాడు.
“మరీ.. ఏదైనా వార్త రాసుకుంటారా” అన్నాను.
“కాదు సార్.. నాకు క్రింది దవడ చివరి పన్ను నొప్పిగా వుంది.. చూపిద్దామనీ..” అంటూ నసుగుతున్నాడు. అప్పుడు కూర్చోమని నా ఎదురుగా వున్నా కుర్చీ చూపించాను. ఆ తర్వాత..
“చూడండీ, మీ పంటి నొప్పికి మీరు పని చేసే ఆంగ్ల పత్రికకీ అసలు సంబంధం ఏమైనా ఉందా?” అని సూటిగానే అడిగాను.
“లేదు సార్.. అలా చెబితే బాగా చూస్తారనీ..” అన్నాడు, కాస్త సిగ్గు ముఖం పెట్టి.
“అలాంటివి ఇక్కడ, అంటే నా దగ్గర పనికి రావు. నాకు అందరూ సమానమే! మీరు ముందే మీ పంటి సమస్య చెప్పి ఉంటే బాగుండేది. మీ లాంటి వాళ్ళు ఒకళ్ళకి చెప్పేవాళ్లు గానీ,చెప్పించుకునే వాళ్ళు కాకూడదు” అని, “గతంలో మీరు ఈ ఆసుపత్రికి ఎప్పుడైనా వచ్చారా?” అన్నాను.
“రాలేదు సార్..” అన్నాడు, కాస్త ఇబ్బందిగా.
“ఈ ఆసుపత్రి అవసరాలు ఏమిటో, ఎప్పుడైనా కనుక్కుని మీ పత్రికలో రాశారా?” అన్నాను.
“లేదు సార్..” అన్నాడు.
“ఈ ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు వున్నారో,ఇంకా ఎంతమంది అవసరమో మీకు తెలుసా?” అన్నాను.
“తేలీదు సార్..” అన్నాడు, కాస్త ఇబ్బందిగా.
“ఈ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు సరిపడా ఉన్నాయో లేదో మీకు తెలుసా..?” అన్నాను.
‘తెలీదు’ అన్నట్టు తల అటూ ఇటూ ఊపాడు. అప్పుడు నేను ఇలా అన్నాను – “చూడు బాబూ.. నీ.. ఉద్యోగం ద్వారా నీకు సంక్రమించిన ఈ అధికారం, స్వార్థానికి ఉపయోగించుకోకు, సమాజం కోసం, ప్రజల కోసం సరైన పద్ధతిలో ఉపయోగించు. అప్పుడు ప్రజల్లో నీకు గౌరవం పెరుగుతుంది, జీవితంలో తృప్తి మిగులుతుంది. ఇప్పుడు చెప్పండి.. మీ సమస్య..” అన్నాను.
ఎక్కడా ఎదురుకాని సమస్య, అతనికి నాతో ఎదురైంది. ఇది అతను ఊహించని సన్నివేశం. ముఖం కాస్త రంగు మారింది. కొద్దీ క్షణాలు మా మధ్య నిశ్శబ్దం ఆవరించింది. తర్వాత, అతనే లేచి నిలబడి
“మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సార్..” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. జనగాం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మర్నాడు పేపర్లో ఏదో నాకు వ్యతిరేకంగా వార్త వస్తుందని ఊహించాను. కానీ వార్తా రాలేదు, మళ్ళీ అతను నన్నెప్పుడూ కలవలేదు. ఇదొక మరచిపోలేని జ్ఞాపకం. పత్రికల్లో పనిచేసే కొందరు, తమ పదవిని లేదా బ్రతుకు దెరువును ఎలా దుర్వినియోగం చేస్తారో, ఉద్యోగులను ఎలా భయపెడతారో చెప్పడానికి ఈ చిన్ని సంఘటన ఉదాహరించాను. అంతేకానీ మొత్తం పత్రికా రంగం అంతా ఇలానే ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం కాదు.
నేను మొదట మహబూబాబాద్లో ఉద్యోగంలో చేరిన పిదప జరిగిన సంఘటన కూడా చెప్పాలి. నేను అక్కడ ఉద్యోగంలో చేరి అప్పటికి రెండు నెలలు అయింది. అప్పటికి పెద్దగా ఎవరితోనూ ఎక్కువ పరిచయాలు లేవు. కొద్దీ మంది ప్రైవేట్ డాక్టర్లు మాత్రం పరిచయం అయినారు. ఒకరోజు, ఒకానొక పాపులర్ దినపత్రికలో ఒక వార్త వచ్చింది. అది చదివి నిర్ఘాంతపోవడం నా వంతైంది. ఆ వార్త సారాంశం ఏమంటే, మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రిలో (ఇప్పుడు అది జిల్లా ఆసుపత్రి) గత కొంతకాలంగా దంతవైద్యుడి పోస్టు ఖాళీగా ఉందని, పంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీను. నాకు అప్పటికే రచనా వ్యాసంగంలో అనుభవం వుంది. నేను అక్కడ దంతవైద్యుడిగా చేరి అప్పటికే రెండునెలలు పైన అయిపోయింది. మరి ఆ పత్రికా ప్రతినిధి విషయాలు అవగాహన లేకుండా ఇంట్లో కూర్చుని వార్తలు తనకు తోచిన రీతిలో రాసేస్తున్నాడు. నేను ఏమాత్రం భయపడలేదు,ఎవరినీ సంప్రదించలేదు. సరాసరి హైదరాబాద్ లోని ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్కే ఉత్తరం రాసాను. రెండు రోజుల్లో నా ఆ ఉత్తరం మెయిన్ పేజీలో వార్తగా వచ్చి ఆ పత్రికా ప్రతినిధిని నా దగ్గరకు తీసుకు వచ్చింది. నేను చేసిన పనికి అతను మాత్రమే కాదు, ఆసుపత్రి సిబంది కూడా ఆశ్చర్యపోయారు.
ఆతను ‘క్షమాపణ’ కోరాడు. తర్వాత మంచి మిత్రుడైనాడు,అది వేరే విషయం.
ఒక మంచి పనికోసం వార్త రాయడంలో తప్పులేదు. ఒక అభివృద్ధి పనికోసం ప్రజల్ని అప్రమత్తం చేయడంలో,ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంలో తప్పు లేదు. కానీ తమ వార్త కోసం ఎదుటి వ్యక్తిని బలి చేయడం పొరపాటు మాత్రమే కాదు, ఘోరమైన నేరం కూడ! ఈ సమస్యను ఆసుపత్రులు మాత్రమే కాదు,ఇతర రంగాలకు సంబందించిన కార్యాలయాలు కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ పత్రికా ప్రతినిధులు ప్రజా సౌఖ్యం కోసం,దేశ సౌభాగ్యం కోసం మాత్రమే కృషి చేయాలి తప్ప ప్రజలను, ప్రభుత్వాలను తప్పుదోవ పట్టించే విధంగా వుండకూడదు. స్వార్థం కోసం పని చేసే పత్రికలు ఎక్కువకాలం నిలవవు. తమ పనిని తాము సజావుగా చేసుకోనివ్వకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రజలను, ప్రజా ప్రతినిధులను, ఉద్యోగులను, ఇబ్బందులకు బలిచేసే చోటా మోటా, పత్రికలూ ఇంకా అక్కడక్కడా లేకపోలేదు. అలాంటి వారిని ప్రోత్సహించక,తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రజలదే మరి!
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
నన్ను 46వ ఎపిసోడ్ వరకూ ఇలా రాయిన్చిన సంచిక సంపాదకుల కూ ఇతర సాంకేతిక వర్గాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నిర్మొహమాటంగా చెప్పాలంటే మీ అనుభవం జరిగిన నాటికంటే ఇంకా ఎక్కువగా భ్రష్టుపట్టింది సర్ మీడియా విబాగం. ఎన్నో వెదవపనులకు వేదింపులకు వేదికగా తయారవుతున్నది. ఆరోజుల్లోనే అలా పేపర్ పేరుచెప్పి మరీ పని పూర్తిచేసుకునే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే. మంచి సమాచారం అందించిన మీకు ధన్యవాదములు సర్ .
సాగర్ నీ స్పందన కు ధన్యవాదాలు.
పాపం పాత్రికేయుడు. రిపోర్టర్ నని చెప్పుకొని చలాయించుకోవడం బాగా పెరిగిపోయింది. చక్కగా గడ్డి పెట్టారు.
మిత్రమా…. ధన్యవాదాలు.
వృత్తి రీత్యా మనకు వచ్చే సంఘటనలు, మీద బాగా రాశారు సర్ . నా అనుభవం లో ఇంకో ఒక విషయం చెప్తాను. నేను అయిదింటికి రమ్మంటే . వాళ్ళు అయిదున్నర వస్తారు. ఏమి ఎందుకు లేట్ గా వచ్చారు అంటే డాక్టర్లు టైం మెయింటైన్ చేయరు కదా అంటారు. మీరే టైం కి వస్తారా అని ఇంకొందరు . *లోకో భిన్న రుచి* అన్న సంస్కృత సామెతను మనకి రుజువు చేసి చూపిస్తారు.
—-డా.డి.సత్యనారాయణ హైదరాబాద్.
డాక్టర్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ.
46వసంచిక చదివిన.ప్రతి వాడికీ తన ఉద్యోగ పర్వంలోఎప్పడొ ఒకప్పుడు ఇట్లాటి అనుభవం ఎదురౌతుంది.నేనూ ఎదుర్కొన్న. పాత్రికేయులు ముఖ్యంగా ప్రస్తుత తరానికి చెందిన వవారు తామే సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని అనుకుంటున్నారు.తమకువప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది కనుక తమపనులను ప్రాధాన్యత నిచ్చి నెరవేర్చాలనిఅనుకుంటారు .వాళ్ళే లంచాలగురించి ఉపన్యాసాలిస్తరు.నీ సంగతి చూస్తా అంటూ నన్ను బెదరించి పొయిన పాత్రికేయుడు మా పైఅధికారికి కంప్లేంట్చేసి కూడా ఏమీ సాధిన్చలేక పొయిండు. వృత్తి లొ విలువలు పాటించి న్యాయబద్ధంగా పని చేసిన వారినెవరూ ఏంచేయలేరు.మీరు చేసిన పని వంద శాతం సరైంది మిగతా వారుకూడా అనుసరించదగ్గది అభినందనలు సర్.
—–నాగిళ్ళ రామ శాస్త్రి హనంకొండ.
మీ స్పందన కు ధన్యవాదాలండీ శాస్త్రి గారు.
Good morning sir, Whatever you have said is very true, we regularly encounter suck kind of people almost all from every department. And when we approach them for a right cause in regard to their dept, they just show their deaf ears. In the initial days I used to feel bit hesitant when I come across such incidents, but after sharing your experience with me long back … I became little confident to deal such situations sir. Thank you very much sir for sharing all your experiences.
Thank you Doctor.
జర్నలిస్ట్ లతో మీ అనుభవాలు బాగున్నాయండి. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారింది.పత్రికలు పత్రికారచయితలపట్ల ప్రజలకు గౌరవం తగ్గిపోయింది. అందుకు ఒకవిధంగా పత్రిక యజమానులు మరొకవిధంగా జర్నలిస్టులు కారణం కావచ్చు. ఏమైనా వృత్తి పట్ల గౌరవంతో మేలిగే వారెవరినైనా ప్రజలు గౌరవిస్తారు. తమ పరిధులను దాటి ప్రవర్తించేవారికి ఎవరో ఒకరు బుద్ధి చెపుతారు. జర్నలిస్ట్ గా ఇక్కడ నా అనుభవం కూడా ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. విశాఖలో ఒక దిన పత్రిక లో పనిచేసే రోజుల్లో కేజిహెచ్ లో ఒక డాక్టరుండేవారు. ఆయనకు పిపి అని పేరు. అంటే పేపర్ పులి అని. చీటికి మాటికి ఫోన్ చేసీ ఈరోజు ఆసుపత్రిలో ఇది జరిగింది అది జరిగిందని అది వార్తగా రాయమని వేదించేవారు. ఒక రోజు ఏదో ముఖ్యమైన పనిమీద ఆసుపత్రికి వెళితే నేనొచ్చానని తెలుసుకొని నాదగ్గరకొచ్చి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక వార్తకూడా మీ పేపర్లో రాదంటూ నిష్టూరంగా మాట్లడటం మొదలుపెట్టారు. దాంతో నాకు కొంచెం చికాకనిపించి ఏవార్త రాయాలో ఏ వార్త రాయకూడదో మాకు తెలుసండీ మీరు ఫోన్ చేసినంత మాత్రాన వార్త రాయాలన్న రూలేమీలేదంటూ మాకు వార్త కావాలంటే మేమే మీదగ్గరకు వచ్చి వార్త సేకరించుకుంటాము. మీరేం ఫోన్ చేయనవసరం లేదని చెప్పేసాను. పదిమంది ముందు అలా చెప్పడంతో కొంచెం ఇబ్బంది పడినా ఫోన్ చేయడం మాత్రం మానలేదు. కొంతకాలానికి పట్టించుకోవడం మానేశామనుకొండి. పేరు కోసం కొంతమంది పడే యావ చూస్తే కొంత బాధ అనిపిస్తుంది. అలాంటి వారిని ఆసరాగా తీసుకొని కొంతమంది పబ్బం గడుపుకుంటారు. ఇదీ లోకం తీరు. మొత్తం మీ అనుభవాలతో మా జ్ఞాపకాలను కూడా నెమరువేసుకొనేలా సాగుతున్న మీ రచనా వ్యాసాంగం కొనసాగాలని కోరుకుంటూ… మీ బాపూజీ
బాపూజీ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ
[21/02, 08:59] Palle Nageswar Rao hanamkonda: బాగుంది. జ్ఞాపకాలే ఐయినా సమాజహితం కోరేవిగా ఉన్నాయి. [21/02, 09:00] Palle Nageswar Rao hanamkonda: కొందరికి ధైర్యం, కొందరికి గుణపాఠం.
—–పల్లె నాగేశ్వరరావు హనంకొండ
ధన్యవాదాలు నాగేశ్వరరావు గారికి
Yes sir, people are like that only, most of the people misusing their job or department. Any how are explained clearly sir.👍
—–kj Srinivas Hyderabad
Thank you somuch Srinivas garu.
మీ సిన్సియారిటీకీ శత కోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏 గుర్తింపు కలిగిన జాబ్ లో ఉంటే చాలా మంది తమ పరపతిని ఉపయోగించు కో వాలను కుంటారు త్వరగా పనులు అవుతాయని మీరు నీతికి న్యాయానికి ఎదురెళ్లే వారు కాబట్టి అందరినీ సమానంగా చూస్తారు నిజం చెప్పాలంటే చాలా చోట్ల ఇప్పుడున్న పరిస్థితి లో పరపతి ఉంటేనో డబ్బుంటేనో పనులు అవుతున్నాయి .అందరూ మీ లాంటి న్యాయస్తులు ఉంటే అవినీతి బెదురింపులకు తావుండదు .ఏమైనా మీ రూటే వేరు సార్ ఆ రూటే మాకు ఆద్యంతం ఆదర్శం .హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు మరొక స్ఫూర్తి దాయక ఙ్ఞాపకం అందించారు మీ ఙ్ఞాపకాల పందిరి నుండి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలండీ
ప్రస్తుతం చాలా మంది కి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ హోదా కల్పించే ప్రత్యేకత ను అవసరం అయినప్పుడు , పనులు పూర్తి చేసుకోవటానికి వాడుకొన ట o మామూలు విషయం ఈ రోజుల్లో. అయితే అది శృతి మించితేనె ఇబ్బందులు. సంఘంలో వృత్తి మనకు కొన్ని ప్రత్యేక స్థానాన్ని కలిగిస్తోంది. దాన్ని సముచితం గా వాడుకొనుట తప్పు లేదు. కొన్ని సమయాల్లో మనం కూడా మన పేరుతో మన వృత్తి, లేదా హోదా ను చెప్పుకుంటున్నా ము. కాకపోతే అతిశయం కు స్థానం కల్పించకుండా చూడాలి , లేదా ఇబ్బంది పెట్టకుండా వుండాలి .అది చేత కాక భంగపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక పోతే ప్రస్తుతం పత్రికా రంగం భ్రష్టు పట్టింది. వారు సిగ్గు విడిచి అవి ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ కే పల్లకి పడుతున్నారు. అందులో భాగంగానే పత్రికా ప్రతినిధులు కూడా వారి స్వార్థం కోసం అలా మారి పోయారు. విలువలను వదిలి బతుకు దెరువు కోసం లేదా సంపాదన కోసం ఆ వృత్తి ని చేపడుతున్న వారి సంఖ్య పెరిగింది. కొందరు పత్రికా ప్రతినిధులు వారి భావజాలం ముసుగులో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. జర్నలిస్టు వృత్తి ని ఒకప్పుడు ఎంతో నిబద్ధత తో చేసే వాళ్లు. అయితే వారికి గౌరవం తప్ప ఇంకేమీ వుండేది కాదు. వుంటే గింటె ఒక్క సైకిల్, ఒక పెంకు ఇల్లు తప్ప. ఇది చేదు నిజం. మీరు జాగ్రత్తగా వ్యవహరించి సమయస్ఫూర్తి గా వుండటం మీ గొప్ప తనం .
మిత్రమా నీ హృదయపూర్వక స్పందనకు ధన్యవాదములు
ఏ వృత్తి లో ఉన్నా .. తప్పు చేయడం తపే..అలాంటి వారి చర్యలను ఎండగట్టే మీ చైతన్యం అభినందనీయం
—వెంకటరామ నర్సయ్య పాత్రికేయుడు మహబూబాబాద్.
మిత్రమా ధన్యవాదాలు
చాలా కరెక్ట్ గా చెప్పారు. చాలా చెప్పాలి.
—–డాక్టర్. సి.హెచ్. సుశీల గుంటూర్ /హైదరాబాద్.
ధన్యవాదాలు మీకు
మీడియా సామజిక బాధ్యతను ప్రత్యక్షంగా ,PRYOGATHMAKANGA ENTHO BAGA CHEPPARU .VARIKI KANUVIPPU. ABHINANDANALU SIR 💐🙏
—-డాక్టర్. సుజాత విజయవాడ.
అమ్మా… ధన్యవాదాలు.
Good morning sir, 🙏
The 46 episode just like its predecessors is laced with interesting anecdotal incidents.
Your assessment is correct with respect to personality and brought up. Our identity must be polite decent and dignified. Other socio politico economic aspects are secondary.!
Your approach to your duties and responsibilities is emulative… and exemplary. The print media particularly the vernacular one is irresponsible and mischievous…. they have more nuisance impact!!!
The do’s and don’ts of any profession are ideal guidelines…. but in most cases and most of the times their violations are the standard norm… unfortunately… nice episode ❤️🙏
——Nakka.sudhakar Hyderabad.
Thank you somuch Sudhakar garu.
Prasad Garu! Appudu Ippudu Eppudu .. Media lo alaantivaaru vuntune vuntaaru..
Thank you Rao garu.
మీడియాలో ఇలాంటివి ఎప్పుడూ వుంటాయేమో… పైగా మనకు సంబంధించిన ఏదైనా వార్త కవరేజీ కావాలంటే ఎదురు డబ్బు ఆశించే పత్రికావిలేఖరులు వున్నారు ఈ కాలంలో😔😔😔
అవునూ మీ స్పందన కు ధన్యవాదాలండీ
సుప్రసిద్ధ ఆధునిక కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి మరణ వార్త పత్రికల్లో చూచి చలించిన శ్రీశ్రీ గారు ఒక ఎలిజీ రాస్తూ “ ఎప్పుడూ అబద్ధాలు రాసే మన పత్రికలు అప్పుడప్పుడూ ఇలాంటి నిజాలు రాస్తుంటాయి .. “ అనడానికి కారణం గమనిస్తే మీకు తటస్థ పడ్డ విలేఖరుల వంటి వారే పత్రికలనిండా ఉండటమే .. తెలియని ఒక ‘ ఇగో ‘ వాళ్ళ లో ఉండి సమాజంలోని అందరికన్నా తామేదో వేరే అనే ‘ ఫాల్స్ ప్రిస్టేజ్ ‘ తో ప్రవర్తిస్తుంటారు … కరీంనగర్ లో మీ దగ్గరకొచ్చిన వ్యక్తి వేషభాషలు , ప్రవర్తించిన తీరూ దానికి చక్కని ఉదాహరణ … తన విషయం లో మీరు వ్యవహరించిన తీరు బహుశా అతన్ని ‘ షాక్ ‘ కు గురిచేసినట్టుంది , వెంటనే తోకముడిచాడు .. అతడు వెళ్ళాక ఏం జరుగుతుందో మీరు ఊహించింది నిజమే … నూటికి తొంభై శాతం చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంది .. వాళ్ళు అక్రమార్జనకు కూడా పాల్పడి ‘ బ్లాక్ మెయిలింగ్ ‘ కు కూడా పూనుకుంటున్నట్టు తెలుస్తున్నది … ఇదే గాక మహబూబాబాద్ సంఘటన ఈ పత్రికా ప్రపంచం లోని డొల్లతనాన్ని కళ్ళకు కట్టింది , మీరు స్పందించారు కనుక నిజంతెలింది .. అందరూ ఇట్లా ఉండకపోవచ్చు కాని , ఎక్కువ శాతం ఈ బాపతే … నేటి సమాజంలోని ఒక కోణాన్ని చూపిస్తూ మనిషిలోని వంకర బుద్ధిని వివరించారు అభినందనలు … నార్ల వెంకటేశ్వర రావు గారన్నట్లు “ పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు ..” అన్న మాటలను వమ్ము చేస్తూ నేటి పలు పత్రికలు “ పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన మన పత్రికల …” న్న శ్రీ శ్రీ గారి మాటల్ని నిజంచేస్తున్నాయి … ఇదొక విషాదం …
—-గిరిజా మనోహర్ బాబు హనంకొండ.
గురువుగారూ మీఈ స్పందన కు ధన్యవాదాలండీ
Klv garu gnapakala pandiri mottam anni chaduvutunnanu.
presentation chala bagundi.
cheputunna vidanamu pakkana undi matalu chebutunnattu undi.
Adi mee goppatanamu.
——డా.అరుణ. అన్నె హైదరాబాద్.
డాక్టర్. అరుణ మీ స్పందన కు ధన్యవాదాలండీ
The article is very nice. Presentation is heart touching, many such experiences we come across in our day to day life, but putting in words is not an easy job for every body. Hats off to you, sir.🙏
—-Dr.V.Laxman Karimnagar.
Thank you sir
డాక్టర్ గారు నమస్కారం. పత్రికా రంగ ప్రతినిధులతో మీకు ఎదురైన అనుభవాలను,దాన్ని చక్కగా పరిష్కరించి నటువంటి విధానము,బహు చక్కగా వివరించారు.కానీ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసిన మాలాంటి వారికి ఇది ఒక పెద్ద సమస్యగానే మిగిలిపోయింది సర్వీస్ అంత.ఎందుకంటే రైల్వేలో ఏదైనా ఒక కంప్లైంట్ అయిందంటే ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు, రాజకీయ నాయకుల విషయంలో. ఇందులో ఎవరి దోషం ఉంది అని చూడకుండా పనిష్మెంట్ ఇవ్వడమనేది సర్వసాధారణం అయి పోయింది .అందుచేత డ్యూటీ లో ఉన్నంత వరకు తలవంచుకొని పని చేయటం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చి పోతున్నారు. అందుకేనేమో రైల్వే సంస్థ క్రమంగా ప్రైవేటీకరణ కాబోతోంది.
—-బి.ఎన్.కృష్ణా రెడ్డి సికింద్రాబాద్.
రెడ్డి గారూ ధన్యవాదాలు సర్ మీకు.
జ్ఞాపకాల పందిరిలో సమాజంలో పత్రికా విలేఖరుల పాత్ర గురించి చక్కగా తెలిపారు. పత్రికా విలేఖరులు పక్షపాతం లేకుండా వార్తలు రాయాలని, సమాజ శ్రేయస్సు కోసం రాయాలని సూచించారు. బాగుంది.
——జి.శ్రీనివాసాచారి కాజీపేట.
చారి గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ.
పైన తెలియ చేసిదానికి కొనసాగింపుగా నాకు సర్వీస్ లో ఎదురైన టువంటి ఒక చేదు జ్ఞాపకాన్ని, దానివల్ల నేను అనుభవించిన మానసిక క్షోభను నా భాషలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను కాచిగూడ లో చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రోజుల్లో .ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మాసంలో అజ్మీర్ కి ఉరుసు స్పెషల్ కింద మూడు నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను నడపడం అనేది రైల్వేకు ఆనవాయితీగా వస్తున్నది. అందులో ప్రయాణించే వారంతా చాలావరకు ముస్లింస్ సామూహికంగా అజ్మీర్ కి వెళ్తూ ఉంటారు .ఇందులో రిజర్వేషన్స్ నాలుగు రోజులు ముందుగా మాత్రమే చేయడం పరిపాటి.అందులో ఎవరు ముందుగా బుక్ చేసుకుంటారో వారికే దొరుకుతుంటాయి .తర్వాత నిరీక్షణ జాబితా పెట్టవలసి వస్తుంది. ఈ క్రమంలో లో మా కు రెగ్యులర్గా ఒక డి ఆర్ యు సి{DRUC}మెంబర్ తన యొక్క హోదాను అడ్డుపెట్టుకుని గ్రూప్ బుకింగ్ అంటే సామూహికంగా ఒక 250 మంది వరకు టికెట్లు కావాలి అని లోపలినుండి డిమాండ్ చేయడం జరిగింది .దానికి నేను అంగీకరించక మిగిలిన వారితో పాటు బయట నుండి లైన్ లో వచ్చి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. కానీ అతనికి అన్ని టికెట్లు కన్ఫామ్ కాకుండా కేవలం ఒక యాభై అరవై టికెట్లు మాత్రమే దొరికి మిగిలినవి వెయిటింగ్ లిస్టులో వచ్చాయి. దాన్ని అతని మనసులో పెట్టుకొని నామీద ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి కంప్లైంట్ చేశాడు .అందులో నేను వేరే పాసింజర్ కి డబ్బులు తీసుకొని టికెట్లు ఇప్పించాను అని ,నా యొక్క ప్రవర్తన సరిగా లేదు అని. దానికి నన్ను మరుసటి రోజు డి ఆర్ మ్ ఆఫీస్ కి పిలిపించి జరిగిన విషయము వినకుండా నాకు చార్జి మెమో ఇవ్వటం జరిగింది . అందుచేత నేను తిరిగి ఎంపీ గారి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడి తన యొక్క కంప్లైంట్ ను ఉపహరింప చేసుకోమని కోరడం జరిగింది . అప్పుడు ఆ లెటర్ తీసుకు వెళ్ళిన తర్వాత ఇష్యూ చేసినటువంటి చార్జి మెమో ను విత్ డ్రా చేయడం జరిగింది. లేకపోతే చేయని తప్పుకు ఒకటి రెండు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ కోత మరియు వేరే చోటికి బదిలీ అవ్వడము జరిగేది.
—–బి.ఎన్. కృష్ణా రెడ్డి సికింద్రాబాద్.
ధన్యవాదాలు సర్ మీకు
ఎదురైన అనుభవాలను మీరు తిప్పి కొట్టిన విధం చాలా బావుంది సర్…ఇలాంటి స్థితప్రజ్ఞత కావాలి.ఎదుటి రంగం ఎంతటి దైనా, ఎదుటి వారు ఎంతటి వారైనా నిజాయితీగా ఎదుర్కోవడంలో,బుద్ధి చెప్పడంలో వెనుకాడకూడదు అని బోధించే మీ జ్ఞాపకం మంచి పాఠం సర్.శుభాభివాదాలు💐🙏
—-నాగజ్యోతి శేఖర్ కాకినాడ.
అమ్మా మీ.స్పందనకు ధన్యవాదాలు
Gd Mng doctor garu, The reporters feel that they are powerful guys and they can blackmail any body with their position. You have really mended the reporter with your polite nature.
—-surya narayana Rao Hyderabad.
మొదటిసంఘటన అహంకారం రెండవది అజ్ఞానంతోకూడిన నిర్లక్ష్యం మొదటివ్యక్తి సంస్కారవంతుడే కొంత .ఎదురుతిరగకుండా వెళ్ళి పోయాడు.రెండవఘటనలోని వ్యక్తి తప్పుతెలుసుకొన్నాడు.రెంటివిషయంలో మీ తెగువయేకారణం అప్పుడప్పుడూ మనం అంటే ఏమి టో నిరూపించుకునే ఘటనలు విధినిర్వహణలో కొంతతృప్తినీ కల్గించే ఈసంఘటనలు
——డా.రంగాచార్య హనంకొండ.
సర్ మీ స్పందన కు ధన్యవాదాలండీ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™