రచనా వ్యాసంగంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ కథలు రాయడం. అది కథ కావచ్చు, కథానిక కావచ్చు, మినీ కథ కావచ్చు, గల్పిక కావచ్చు. ఏ రూపంలో రాసినా అది కథా ప్రక్రియ లోనికి వస్తుంది. అయితే నిడివి తగ్గే కొద్దీ కథా రచన క్లిష్ట తరమవుతుంది. ఇలాంటి చిన్ని రూపాలలో కథను చెప్పడం రచయితకు కత్తిమీద సామే! ఇక్కడే రచయిత/రచయిత్రి ప్రతిభ వ్యక్తపరిచే అవకాశం దక్కుతుంది. ఈ రోజుల్లో ప్రేమ కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. తరువాత ఎక్కువగా సంసారిక సమస్యలమీదనే ఎక్కువ ఆసక్తిని పాఠకులు చూపిస్తున్నట్టుగా భావించవచ్చును. కారణం కుటుంబ సమీకరణలలో సరైన నిర్ణయాలు అంచనా చేయలేకపోవడం, ఇరు పక్షాల ఆర్థికంగా పుష్టికరంగా ఉండడం, పాఠ్య పుస్తకాలను తప్ప నిజ జీవితాలను అంచనా వేయలేకపోవడం, అర్థం చేసుకోలేక పోవడం వంటి అంశాలు, కుటుంబ విచ్చిత్తికి కారణాలుగా ఇంచుమించు ప్రతి ఇంట కనిపిస్తుండడం వల్ల, రచయితలు/రచయిత్రులు ఇవే అంశాలను కథలకు వస్తువులుగా తీసుకుంటున్నారు. ఇక పౌరాణిక, చారిత్రక, జానపథ నేపధ్య కథలను రాసే రచయితలు తక్కువ అయిపోయినారు. వాటికి ఎక్కువగా చదవవలసి రావడం, పరిశోధనలు చేయవలసిన అవసరం ఉండడం వల్ల, ఆ కథల జోలికి ఇంచుమించు ఎవరూ పోవడం లేదనే చెప్పాలి.
ఒకప్పుడు పత్రికలకు సరిపడా రాసే రచయితలు ఎక్కువగా ఉండేవారు కాదు. తర్వాత పత్రికలూ పెరిగాయి, రచయితలు/రచయిత్రులూ పెరిగారు. ఒకానొక సమయంలో కేవలం రచయిత్రులు మాత్రమే పత్రికా ప్రపంచాన్ని ఏలినారని చెప్పవచ్చు. రచయితలు కూడా మహిళల పేర్లు పెట్టి కథలు రాసిన సందర్భాలు వున్నాయి. కాల మహిమతో ఒక్కోసారి ఒక్కో అంశం తెరకెక్కుతుంది. 2020 ప్రపంచమంతా గుర్తు పెట్టుకోవలసినదీ, మర్చిపోలేనిది, ఒక చారిత్రిక అంశంగా మిగిలిపోయిదీనూ! ఇది అందరికీ తెలిసినదే, ‘కరోనా’ మహమ్మారి చేసిన విలయతాండవం, తత్ఫలితంగా జరిగిన నిశ్శబ్ద మారణహోమం. దీనివల్ల అన్నింటిమీదా ప్రభావం పడినట్టే పత్రికా రంగం మీద కూడా పడింది. దానివల్ల తప్పని పరిస్థితిలో కొన్ని పత్రికలను మూసివేయక తప్పలేదు. అందులో ఆంధ్రభూమి, నవ్య, విపుల, చతుర, తెలుగు వెలుగు వంటి పత్రికలూ ఉండడం బాధాకరం. అయితే కొన్ని పత్రికలు మూత పడ్డ నేపథ్యంలో, కొత్తగా పుట్టుకొస్తున్న పత్రికలతో పాటు, మీ కోసం మేము ఉన్నాం అన్నట్టు అనేక అంతర్జాల పత్రికలు మనకు ఇప్పుడు అందుబాటులోనికి వచ్చాయి. రాసేవాళ్లకు, ఇప్పుడైనా ఎలాంటి ఆటంకాలూ లేవు. పైగా ‘సంచిక’ వంటి అంతర్జాల పత్రికలు, రచయితలకు మరీ ఎదురు వెళ్లి ప్రొత్సహిస్తున్నాయ్. ఇది ఆహ్వానించ దగ్గ విషయమే.
నేను సీరియస్గా కథలు రాస్తున్న సమయంలో, పత్రికా రంగంలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఏమీ లేవు. అందుచేత ఆ సమయాన్ని నేను బాగానే సద్వినియోగం చేసుకున్నానని చెప్పాలి. అలా నన్ను విశాలాంధ్ర (ఆదివారం), ఆంధ్రభూమి, ప్రజాశక్తి (ఆదివారం), కథాకేళి మాసపత్రిక, నవ్య వారపత్రిక, ప్రసారిక (ప్రాంతీయ పత్రిక), సాహితీ ప్రస్తానం, చినుకు మాస పత్రిక వంటి పత్రికలు, కథా రచనలో నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి. వీటికి తోడు ఆకాశవాణి – వరంగల్ కేంద్రం వారు సహృదయంతో నా కథలు ప్రసారం చేశారు. ఈ సందర్భంగా, ఆకాశవాణి కి చెందిన పెద్దలు సర్వశ్రీ ఆర్. వెంకటేశ్వర్లు గారు, డా. పాలకుఁర్హి మధుసూదన్ గారు, చలపతి రావు గారు, శ్రీమతి సరోజా నిర్మల గారు, రాంబాబు గారు, శ్రీనివాస రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, అనీల్ ప్రసాద్ గారు, ఝాన్సీ. కె. వి.కుమారి గారు, సూర్యప్రకాష్ గారు ఇలా ఎందరెందరో ప్రోత్సహించారు/సహకరించారు. వారందరికీ నేను ఎంతగానో రుణపడి వుంటాను.
వివిధ పత్రికల్లో కథలు రావడం మొదలయ్యాక, మనసు కథా సంపుటి వైపు మళ్లింది. అసలు నేను రాసినవి కథల లెక్కలోకి వస్తాయా? అన్న అనుమానం మరోవైపు నుంచి గుచ్చడం మొదలు పెట్టింది. మనసు అయితే పుస్తకం వేయమని పదే పదే భుజం తడుతున్నా, ఆర్థిక వనరుల విషయంలో సందిగ్ధత చోటు చేసుకుంది. అయినా అందరిలానే కథా సంపుటిని తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చేసాను. మానసికంగా పుస్తకం కోసం డబ్బు ఖర్చుపెట్టడానికి సిద్దపడిపోయాను. ఇంట్లోవాళ్లకు కూడా నా కోరికను వెల్లడించి, నిర్ణయాన్ని వివరించాను. పుస్తకం ఎక్కడ పబ్లిష్ చేయాలన్నది ఆలోచిస్తుండగా, ‘చినుకు’ మాసపత్రికలో ఒక ప్రకటన నా కళ్లబడింది. ‘చినుకు పబ్లికేషన్స్’ పేరుతో సంపాదకుడు నండూరి రాజగోపాల్ తక్కువ ఖర్చుతో పుస్తకాలు ముద్రిస్తున్నట్టు ఆ ప్రకటన సారాంశం.
రాజగోపాల్ గారికి ఫోన్ చేసి నా కథా సంపుటి ప్రచురణ విషయం చెప్పాను. దానికి ఆయన వెంటనే స్పందించి కథల స్క్రిప్ట్ పంపమన్నారు. వెంటనే పంపాను. ముఖ చిత్రం ఏమి వేయాలన్నది తర్వాతి సమస్య. మాటల మధ్యలో మా అమ్మాయి తన స్నేహితుడు చిత్రకారుడు వున్నాడని, అతని చేత వేయిద్దామని అనడంతో, ఆ పని ఆయనకు అప్పగించాను. అతని పేరు క్రిమ్సన్. నేను రాసిన అక్షరాలనే పుస్తకం టైటిల్కు పెట్టి ఆయన బొమ్మ వేసాడు. కథా సంపుటికి ‘కె ఎల్వీ కథలు’ అని పేరు పెట్టాము. సాహితీ మిత్రులు అంపశయ్య నవీన్, పుస్తకానికి ముందు మాట రాసి ఆశీర్వదించారు. ఇంకా బన్న ఐలయ్య గారూ, గిరిజామనోహర్ బాబు గారు, దక్షిణా మూర్తిగారు వంటి పెద్దలు తమ ఆశీస్సులు అందించారు. పుస్తకాన్ని నా శ్రీమతి అరుణకు అంకితం చేయడం చాలామందికి నచ్చింది. అనుకున్న సమయంలోనే పుస్తకం విజయవాడలో ముద్రణ జరిగిపోయింది.
పుస్తక ఆవిష్కరణ తేదీ సమయం కూడా మిత్రుల సలహా మేరకు నిర్ణయం జరిగిపోయింది. పది జులై శనివారం 2010, సాయంత్రం 6 గంటలకు, వందేళ్లు పైన చరిత్రగల రాజరాజనరేంద్ర భాషా నిలయంలో కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మిత్రులు నిర్ణయించారు, సహృదయ పెద్దలు ఎంతగానో సహకరించారు.
సభకు గురుతుల్యులు, సహృదయ మిత్రులు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహరాబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విజయవాడనుండి చినుకు మాసపత్రిక సంపాదకులు, నా పుస్తక ప్రచురణకర్త శ్రీ నండూరి రాజగోపాల్ గారు వచ్చారు. ఆత్మీయ అతిథులుగా శ్రీ అంపశయ్య నవీన్ గారూ, శ్రీ జయపాల్ రెడ్డి, హైదరాబాద్ నుండి సి. ఎస్. రాంబాబు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ క్రిమ్సన్ వంటి పెద్దలు హాజరయ్యారు. పుస్తక సమీక్ష శ్రీ మెట్టు రవీంద్ర చేశారు. విశాఖపట్నం నుండి చిన్నన్నయ్య డా. మధుసూదన్ కూడా వచ్చినట్టు గుర్తు. ఒక పండుగ మాదిరిగా కార్యక్రమం నడిపించారు మిత్రులంతా. ఈ పుస్తకావిష్కరణలో అత్యంత సంబర దృశ్యం పుస్తకం నా శ్రీమతి అరుణకి అంకితం ఇవ్వడం. హైదరాబాద్ నుండి వచ్చిన నా సహాధ్యాయులు డా. జె. క్రాంతి, డా. అన్నే అరుణ కార్యక్రమం చూసి ఎంతగానో సంతోషించారు.
డా. క్రాంతి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. నా మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు చాలామంది సభకు హాజరైనారు. అతిథుల సన్మానం ముగిసిన తరువాత, మిత్రులు అనేక మంది నన్నుసన్మానించడం, జీవితంలో నేను మరచిపోలేని మధుర ఘట్టం.
ఆ విధంగా కథల పుస్తకం వేయాలన్న కోరిక తీరింది. కథా రచయితగా ఒక గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా పుస్తకం వేయమని ప్రోత్సహించిన మిత్ర శ్రేయోభిలాషులకు, పుస్తక ప్రచురణకర్త శ్రీ నండూరి రాజగోపాల్ గారికీ, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమమం దిగ్విజయం వెనుక వున్న సాహితీ మిత్రులకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. ఇప్పటివరకూ నేను చాలా పుస్తకాలు ప్రచురించినప్పటికీ నా ఈ మొదటి కథల పుస్తకం కాపీలన్నీ అమ్ముడయిపోయి, నేను ఖర్చు చేసిన సొమ్ము తిరిగి వచ్చింది.
ఈ నా మొదటి కథల పుస్తకం మరిన్నికథలు రాయడానికి, మరో రెండు కథా సంపుటాలు (అస్త్రం/హగ్ మీ క్విక్) తీసుకురావడానికి ప్రేరణ ఇచ్చిందని చెప్పక తప్పదు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
పుస్తక ప్రచురణకు సహకరించిన నండూరిగారు అభినందనీయులు. పదకొండు సంవత్సరాలు గడిచినా అందరినీ పేరుపేరునా గుర్తు చేసుకోవడం మీలోని కృతఙ్ఞతాభావానికి నిదర్శనం. కెఎల్ వీ కధలు అందుకున్న అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని అని చెప్పుకునేందుకు సంతోషంగా ఉంది సర్ .మీకు ధన్యవాదములు.
సాగర్ నే స్పందన కు ధన్యవాదాలండీ
నమస్కారం..ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం లో నేనూ సాల్గొన్నాను.ఐతే ఆకాశవాణి సిబ్బంది తో పాటు స్ధానిక మిత్రులతో చాలా సమయం వెచ్చిచ్చాను.మీతో పరిచయం 1995 నుండి ఉన్నా పీఠం కార్యక్రమాలు ఆహ్వాన పత్రికలు పంచే వ్యక్తి గానే నేనుండిపోయాను. ఏదైనా ఓ మంచి సందర్భాన్ని గుర్తు చేసారు.ధన్యవాదాలు. అభినందనలు కూడా. 💐🙏💐
—–డా. మల్లి కార్జున్ హనంకొండ.
మీ స్పందన కు ధన్యవాదాలండీ
మీ తొలి పుస్తకావిష్కరణ ఘట్టంలో ఏ అంశాన్ని వదలకుండా సవివరంగా బాగా వివరించారు. అందరినీ పేరుపేరునా గుర్తుంచుకుని స్మరించుకోవటం మీ వ్యక్తిత్వానికి సంకేతం…
ఝాన్సీ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ.
రచయతగా మీకు ఈ పుస్తక ఆవిష్కరణ ఎంతో మంచి సమయని మధుర స్మృతులుని ఇచ్చి ఉంటుందని భావిస్తాను. అయితే నాకు ఒక విషయం బాగా నచ్చింది అది ఏంటి అంటే, మీరు, మీ సారస్వత మిత్రులు మీ శ్రీమతి గర్ల తో పాటు మీ తో చదువు కొన్న డా. క్రాంతి మేడం గారిని , డా. అరుణ మేడం గార్లు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం. 👏🏻👏🏻🙏🏻💐
—–డా.డి.సత్యనారాయణ హైదరాబాద్.
ధన్యవాదాలు డాక్టర్.
ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలందరి దగ్గర సెల్ ఫోన్ ఉండడం వల్ల పుస్తక పఠనం చాలా వరకు తగ్గిపోవడం కూడా కొన్ని పత్రికలు,వీక్లీ లు మాతపడడానికి ఓ కారణం సర్. చిన్న పిల్లలు కూడా చక్కగా కథలు వీడడం,కథలు చదువుకోవడం లేకుండా ఫోన్ లో గేమ్స్ కు అలవాటు పడడం కూడా విచారించదగ్గిన విషయం సర్. మీ మొదటి పుస్తక ప్రచురణ కు సంబంధించిన జ్ఞాపకాలు,ఫోటోలు బాగున్నాయి సర్.
—-జానీబాషా నర్సరావుపేట.
జానీబాషా నీ స్పందన కు ధన్యవాదాలండీ
మీ మిత్రులని చూసి మీ వ్యక్తిత్వాన్ని, సహృదయాన్ని అర్ధం చేసుకోవచ్చు. సాహిత్యం పట్ల మీ అభిరుచి ఎన్నదగినది. ఉపయోగ కరమైన పుస్తకాలు వెలువరించారు మీరు.
సరసి గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
మొట్ట మొదటి కథా సంపుటం వెలువరించటం మొదటి సంతానాన్ని కన్నంత సంతొషాన్నిచ్చిందనుకుంటా.అప్పడే ఒక పదేండ్లు గడిచినయ్..సంతొషం .ఆసమావేశం లొ నేనెందుకు లేనొ నాకువగుర్కుకు రావటం లేదు ఏమైనా ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాననిపిస్తున్నది ఈసంచికా బాగున్నది సర్. —రామశాస్త్రి
శాస్త్రి గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
ఈప్రయాణం చాలా బాగుంది.తల్లి తన బిడ్డలను చూసి ఎలా మురిసిపోతుందో రచయిత తన పుస్తకాలను చూసి అంతగా పులకించిపోతాడు. అలాంటి ఆనందం మీరు రాసిన ప్రతి అక్షరంలో కనిపిస్తోంది.అభినందనలు!అంతమంది గొప్ప గొప్ప వారి చేతులమీదుగా పుస్తకం ఆవిష్కరించబడడం చాలా గొప్పగా ఉంది.👌👌👌👌👌💐💐💐👏👏👏👏👏
———-పెబ్బిలి హైమవతి విశాఖపట్నం
Great Sir. Happy to know about it. Apart from regular noble job of health profession, you could achieve your talent as writer. Very few will have this privilege. Congratulations
Thank you Rajendra prasad garu.
Prasad Garu! Saahithee Rangamlo appatiki ippatiki penu maarpulu sodaaharanamgaa cheppaarandi.. Dhanyavaadaalandi 🙏
Thank you Rao garu.
బాగుంది సర్ మీ మొదటి పుస్తక ప్రచురణ నేపథ్యం,ఆవిష్కరణ,అంకితం అన్ని. నిజమే ఒక కథ పాఠకుణ్ణి చేరేందుకు రచయిత ఊహలోరూపు తొడిగిన క్షణం నుంచి అచ్చయి చదివే వరకు ఎంతటి ప్రయాణం. మీ సహాధ్యాయిని Dr. Kranthi గారు ESI డాక్టర్ గారు కదా. గాంధీ హాస్పిటల్ లో ఒక programme కి నేను compering చేస్తున్నప్పుడు వారిని కలుసుకున్నాను చాలా ఏళ్ల క్రితం.
—–వె.కామేశ్వరి రావు హైదరాబాద్.
The writer in you has come out at early age as you have strong will power and inclination for academic life. You are fortunate that the period was very conducive and encouraging for writers. Inspite of internet and computers the books still play a major role in the society. Electronic media has replaced the print, and you have morphed your approach suitably. As you said writing is not easy and presentation of story more tricky. It has to keep the reader glued to the story till the end.
You .have achieved good results in your field. Congratulations and hope you will contribute more to the literature world.
Thank you shyam For your wonderful analysis.
కథలు రాయడమే కాదు..ఆ కథలు కథాసంపుటి రూపంలో ప్రచురణకు నోచుకోవడం, ఆవిష్కరణను అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో రాయడం మీ గొప్పతనం. కొందరి మీ మిత్రులు, సాహితీవేత్తల స్పందనలు కూడా బాగున్నాయి. అభినందనలు.
—–జి.శ్రీనివాసాచారి కాజీపేట.
మీ జ్ఞాపకాల పందిరి మొదటి నుండి కూడా చాలా ఆసక్తిగా సాగిన ప్రయాణం బాగుంది.మీ అనుభవాలు,అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాద ములు సర్.2010 సంవత్సరంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఫొటోలతో గుర్తు చేసుకోవడం అభినందనీయం సర్. కె ఎల్వి కథలు పుస్తకాన్ని అందుకున్న అదృష్టవంతుల్లో నేను ఒకడిని అందుకు చాలా సంతోషంగా ఉంది సర్
భుజంగరావు గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Good morning Dr ji, the classification of short-story based on the length… and the dominant subject and the reasons and why some other issues are not being delved into….are analytically explained for the readers enlightenment.
The Tragic and devastating impact of Deadly Corona on some periodicals of well established and popular…is most distressing for any readers.
The publication is a major problem and highly complex, laborious and prohibitive in financial aspects.
The book release function at the century century plus years Rajaraja Narendra Bhasha nilayam, attended by the Literary stalwarts like Ampasayya and lovers of literature , and writers, critics, well wishers , and dedication of the anthology to your better half….are pleasant memories associated with the function. Your gracious acknowledgement of the co operation of different personalities like Jhansi kv Kumari,CS Rambabu,Dr Madhusudan..et al and felicitation to the Writers….all speak of festivities.
The later anthologies like Ashthram and Hug me Quick ….are the output of the inspiration you got from the First one Dr KLV Kathalu.
Naccaw Sudhacaraw Rau. Prog Executive.
Sir, Wonderful Thank you somuch.
మదిలో మస్తిష్కంలో విరిసిన భావాల సముదాయాన్ని ఒక చోట చేర్చి దాన్ని పుస్తక రూపంగా తీర్చి దిద్ది అపురూపంగా మీరెంతో అమితంగా ప్రేమించే మీ శ్రీమతి గారి చేతుల్లో లాలనగా అంకితమివ్వడం చాలా గొప్ప విషయం సార్👏👏👏👏👏. మీ జీవిత గమనంలో జరిగే ప్రతి సన్నివేశాలను వ్యక్తులను ఎంతో ఆత్మీయంగా గుర్తు పెట్టుకుని వారిని ప్రతి సంధర్భంలో గుర్తు చేసుకోవడం అభినందనీయం సార్ 🙏🙏🙏🙏.స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత సందేశాత్మక మీ కొన్ని కధలు కవితల పుస్తకాలు అందుకున్న అదృష్టవంతులలో నేనూ ఒక దానిని చెప్పుకోవడం నాకు గర్వకారణం సార్. మీలాంటి గొప్ప వ్యక్తి మాకు మార్గదర్శకులు కావడం మా పుణ్య ఫలం సార్ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐🙏🙏💐🙏💐🙏💐
అమ్మా నీ స్పందన కు ధన్యవాదాలు.
డాక్టర్ గారు నమస్కారం🙏 నా ఉద్దేశంలో ఒక సాధారణ కవి ఏదైనా ఒక కథ గాని, కథానికను కానీ డైరెక్టుగా పుస్తక రూపంలో పరిచయం చేయకుండా దినపత్రికల్లో లేదా వారపత్రికలో ఒక సీరియల్ గా ప్రచురించడం సరైన విధానం. ఎందుకంటే ఆ సీరియల్ చదివిన పాఠకుల స్పందనను బట్టి దానిని తర్వాత ఒక పుస్తక రూపంలో వెలువరించడం ఉత్తమం. మీ మొట్ట మొదటి కథ ఏ పత్రికలో ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇన్ని రోజుల తర్వాత మీరు దానికి ఒక పుస్తక రూపం కల్పించడం అలాగే ఆ పుస్తకాన్ని మీ శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం అనేది మీ వ్యక్తిత్వమునకు నిదర్శనం .అది కూడా 2020 జూలై నెలలో ఈ కరోనా ఉదృతంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం ,మీ శ్రేయోభిలాషులు అందుకు సహకరించడం వారందరికీ మీ మీదున్న అభిమానానికి నిదర్శనం. ఒక వివరణ. ….మీ కేఎల్వి కథలు అనే పుస్తకం పైన ఉన్నటువంటి ముఖచిత్రంలో అచ్చువేసిన అరచేయి, ఐదు వేళ్ళు దేనికి సంకేతము?నా ఊహ తప్పు కాకపోతే ఈ కథల సంపుటికి పుస్తకరూపం రావటానికి ముఖ్యులైన మొదటి వ్యక్తిగా మీరు, మీకు అన్ని విధాలుగా సహకరించిన మీ శ్రీమతి గారు, ముఖచిత్రము ఏమి ముద్రించాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక చిత్రకారుడు తన మిత్రుడు ఉన్నాడని సలహా ఇచ్చిన మీ అమ్మాయి, చక్కని ముఖ చిత్రాన్ని గీచిన crimson, ఆర్థిక మరియు హార్దిక సహకారం అందించిన మీ అబ్బాయి రాహుల్ కు సంకేతాలా?, లేక ఐదువేళ్ళ పైన ఉన్న ముఖ చిత్రాలు మీకు స్ఫూర్తినిచ్చిన కవులగా భావించవచ్చా. అలాగే గల్పిక అంటే అర్థం ఏమిటి. ధన్యవాదములు🙏
—-బి.ఎన్. కృష్ణా రెడ్డి సఫిల్ గూడ సికింద్రాబాద్.
రెడ్డి గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ
Klv garu
nenu kuda attend ayyanu function ki.
function chala baga ayyindi.
Chala rojulu tarvata epudu
inta baga chepparandi.
mee talent ki vandanalu.
—Dr.A.Aruna Hyderabad.
అరుణ గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Nanduri Rajagopal gariki modataga dhanyabaadalu telupukovali. Anni vishayaalu mariyu peddalandirini peru peruna gurtunchukoni vaarini prastavinchadam mee krutagnata bhaviniki nidarsanam. Mrs Aruna gariki ankitam cheyadam pedda hilight.
—-Suryanarayana rao Hyderabad.
Thank you so much sir.
సచిత్రంగా మీరుపంపిన పుస్తకావిష్కరణ సంబంధి పూర్వరంగము ,ముద్రణకు చినుకు వారి సహకారం ,సాహితీ మిత్రుల కార్యక్రమనిర్వహణంతో మంచికథల పుస్తకం సాహితీలోకంలోకి వెలుగు చూసింది. అభినందనలు
—–వజ్జల రంగా చార్య కర్నాటక.
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™