కథ రాయడం ఎంత కష్టమో, నవల రాయడం అంత సులభం అని కొందరు చెబుతుంటారు. నా దృష్టిలో రెండూ కష్టమే! కథను తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చొప్పించాలి. నవల కాన్వాస్ పెద్దది, ఎంతైనా రాయవచ్చు. కానీ పాత్రల అన్వయం విషయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అయితే రాయాలని దీక్ష పట్టుదల గలవారికి, సమయం దొరకాలి గానీ, ఏ ప్రక్రియ అయినా అవలీలగా రాసేస్తారు. ఓపిక కూడా తోడుంటేనే గానీ, ఈ రచనా వ్యాసంగం సత్ఫలితాలను ఇవ్వదు.
గతంలో కొన్నాళ్ళు ఈ రచనా వ్యాసంగంలో, పత్రికలలో మహిళామణులు రాజ్యమేలారు. ముప్పాళ్ల రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచన, సి. ఆనందారామం, శ్రీమతి పరిమళా సోమేశ్వర్, మాలతీ చందూర్, రామలక్ష్మి, డి. కామేశ్వరి, ద్వివేదుల విశాలాక్షి, మన్నెం శారద, అబ్బూరి ఛాయాదేవి .. ఇలా, నాకు గుర్తు లేని స్త్రీమూర్తులు చాలామంది కథలు, నవలలు రాశారు. అందులో కొందరు ఉద్యోగినులు వున్నారు, మరికొంతమంది నూరు శాతం గృహిణులు వున్నారు.
ఇలాంటి కోవకు చెందిన హన్మకొండకు చెందిన గృహిణి శ్రీమతి అంగులూరి అంజనీదేవి. వారు సంసార బాధ్యతలు సజావుగా సాగిస్తూనే, ఇప్పటి వరకూ కొన్ని కథలు,19 నవలలు రాసారు. ఈ రచయిత్రి ప్రచారానికి చాలా దూరంగా వుంటారు. అంజనీదేవి గారి రచనా వ్యాసంగ విశేషాలు ఆవిడ మాటల్లోనే చదువుదాం.
***
1) నమస్కారం అంజనీదేవి గారూ – మీ విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం వివరించగలరా?
♣ నమస్కారం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారూ! నేను కందుకూరుకు చెందిన శ్రీ తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ కళాశాలలో బి.ఏ. (లిటరేచర్) చేసాను. అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం. చిన్న సైజు జమీందారీ కుటుంబంలా ఉండేది. మా నాన్నగారు మామిడేల రాఘవయ్య గారు. అమ్మ వెంకట సుబ్బమ్మ గారు. వారి ఏకైక సంతానం నేను. మా నాన్నగారు ఏ విషయంలో నైనా చాలా తెలివిగా, హుందాగా, నాయకత్వ లక్షణాలతో ఉండేవారు.
2) తెలుగు భాష పై మీకు మక్కువ ఎప్పుడు, ఎలా ఏర్పడింది?
♣ మా కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా వున్న డా. మొవ్వ వృషాద్రిపతి గారి ప్రోత్సాహం వల్ల తెలుగు భాష పట్ల ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టంతోనే తెలుగు సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు, ముఖ్యంగా నవలలు ఎక్కువగా చదివేదాన్ని.
3) మీ మొదటి రచన ఎప్పుడు, ఏ పత్రికలో వచ్చింది? అప్పటి మీ ఫీలింగ్ ఎలాంటిది?
♣ నా మొదటి రచన మా కాలేజీ మ్యాగజైన్లో వచ్చిందండీ! అప్పుడే రెండు కథలు ప్రగతి వారపత్రికలో అచ్చు అయ్యాయి. ఆ తరువాత నవల రాసాను. దాని పేరు ‘మధురిమ’. అది ప్రగతి వీక్లీలో సీరియల్గా వచ్చింది. అప్పుడు నా వయసు 17 మాత్రమే! ఆ సీరియల్ చూసి మా కళాశాల లెక్చరర్ శ్రీ మొవ్వ వృషాధిపతి గారు, ‘నవల సరళంగా, బాగుంది’ అని ఆశీర్వదించారు. ఆయన కనక ఆ రోజున నా నవలను ప్రశంసించక పోయినా, నవల అచ్చుకాకుండా తిరిగి వచ్చి వున్నా, ఈ రోజున మీకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయిలో నేను ఉండేదాన్ని కాదు! పెద్ద మనసు వున్న పెద్దల ఆశీర్వాదం అద్భుతాలను సృష్టిస్తుంది అంటారు కదా! అదే జరిగింది నా విషయంలో కూడా.
4) మీ రచనా వ్యాసంగాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించిన వారు ఎవరైనా ఉన్నారా? లేక మీరే స్వంతంగా అలవర్చుకున్నారా? వివరించండి.
♣ నేను హై స్కూల్లో చందమామ, బొమ్మరిల్లు, బుజ్జాయి, కథల పుస్తకాలు చదివిన ఉత్సాహంతో, కొంచెం, కొంచెం వ్రాస్తున్నానని తెలిసి మా నాన్నగారు, నన్ను మా పక్క వూరిలో వున్న ప్రముఖ నవలా రచయిత్రి శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారి ఇంటికి తీసికెళ్ళారు. నన్ను వారికి పరిచయం చేశారు. అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను. నేను రాసిన పేపర్స్ని అప్పటికప్పుడే ఆవిడ చదివారు. “వీటిని నువ్వు ఏ పత్రికకు పంపాలన్నా ఒక కవర్లో పెట్టి, హామీ పత్రం వ్రాసి పంపాలి అంజనీదేవీ..” అంటూ హామీ పత్రం ఎలా రాయాలో చెప్పి ప్రగతి వీక్లీ, చిరునామా కూడా ఇచ్చారు. ఆ సమయంలో ఏ రచయితకైనా ప్రధానంగా కావలసింది అలాంటి ప్రోత్సాహమే కనుక ఆవిడ సూచనలు నాకు బాగా నచ్చాయి/ఉపయోగ పడ్డాయి.
అంత మాత్రమే కాదు, నిర్మల గారిని కలిసి మేము తిరిగి వచ్చేస్తుంటే, “బుక్స్ బాగా చదవాలి” అంటూ శరత్ బాబు వ్రాసిన ‘గృహ దహనం’ నవల ఇచ్చారు చదవమని. ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వచ్చాము. నా పక్కనే వుండి ఆవిడ మాటలు విన్న మా నాన్నగారు, విశ్వనాథగారి ‘వేయి పడగలు’, ఉషశ్రీ గారి భారతంతో పాటు, అప్పుడు మార్కెట్లో వున్న మాలతీ చందూర్, రంగనాయకమ్మ, మాదిరెడ్డి, యద్దనపూడి, వాసిరెడ్డి, శరత్, చలం వ్రాసిన నవలలు కొన్ని కొని నన్ను చదువుకోమని ఇచ్చారు. “నువ్వు ఏది వ్రాసినా దేని కోసం వ్రాస్తున్నావో ఆలోచించి వ్రాయమ్మా!” అన్నారు మా నాన్నగారు.
ఆ తర్వాత పత్రికల్లో వస్తున్న నా కథల్ని చదివి “ఎలా రాస్తావమ్మా ఇలా? ఈ ఆలోచనలు నీకు ఎలా వస్తాయి?” అని మా నాన్నగారు సంతోషపడినప్పుడు నాలోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లయ్యేది. అమ్మ అన్నం పెడితే- నాన్న అక్షరం పెట్టారు. ఇది నాకు మా నాన్న గారు పెట్టిన అక్షర భిక్షే నండీ!
5) మీ వైవాహిక జీవితం రచనా వ్యాసంగానికి ఎలా తోడ్పడింది? ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
♣ ఎలాంటి సమస్యలు ఎదుర్కొనలేదు. కానీ మావారు బ్యాంకు ఉద్యోగి కావడం వల్ల తరచుగా బదిలీలు ఉండేవి. ఆయన వల్లనే నేను ఎక్కడికి వెళ్లినా, ఆయా ప్రాంతాల సాహిత్యకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడు సమయం తక్కువగా ఉండడం వల్ల కవితలు, కథలు మాత్రమే వ్రాసాను. కవితలు కొన్ని సాహిత్య పత్రికలలో ప్రచురింపబడ్డాయి. సాంస్కృతీ సమాఖ్య ద్వారా పరిచయం అయిన డా.ఎస్వీ. సత్యనారాయణ గారూ, డా.అద్దేపల్లి గారూ, డా. రాధేయగారూ, వ్రాసిన విలువైన ముందు మాటలతో, నా కవితలన్నీ ‘గుండెలోంచి అరుణోదయం’ కవితా సంపుటిగా వచ్చాయి. ఈ కవితా సంపుటికి, ‘ఉమ్మెత్తల సాహితీ అవార్డు’ వచ్చింది. ఆ కవితల్లోని అభ్యుదయ దృక్పథం, సామాజిక స్పృహను ప్రముఖ అవధాని, కవి శ్రీ నరాల రామారెడ్డి గారూ, డా. ఆర్. అనంత పద్మనాభరావు గారు అభినందించారు. ‘వయసు చిన్నదైనా, కవితలు ఒక స్థాయిలో వున్నాయి’ అని నాటి దిగంబర కవి ‘మహా స్వప్న’ గారు ప్రశంసించారు.
అలాగే, ప్రముఖ కవయిత్రి డా.శిలాలోలిత గారు తన పరిశోధనా సిద్ధాంత గ్రంధమైన ‘కవయిత్రుల కవితా మార్గం’లో నా ‘గుండెలోంచి అరుణోదయం’ ఉదాహరణగా తీసుకుని, నేను ఏ ఉద్దేశంతో ఆ కవితల్ని వ్రాసానో, అందులో రికార్డు చేయడం గర్వంగా ఉంటుంది.
ఇకపోతే, నా కథలన్నిటితో ‘జీవితం అంటే కథ కాదు’ అనే కథల సంపుటి వచ్చింది. ఈ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు అబ్బూరి ఛాయాదేవి గారూ, అంపశయ్య నవీన్ గారూ, దిగంబర కవి మహాస్వప్న గారూ ముందుమాటలు రాయడం విశేషం! ఇవన్నీనాకు మధుర జ్ఞాపకాలే.
6) చదవడంలోనూ, రాయడంలోనూ మీకు నవల ఇష్టమా? కథ ఇష్టమా? ఎందుచేత?
♣ కథలు చదువుతాను, కానీ నవలలు బాగా ఇష్టంగా చదువుతాను. కథలు వ్రాసినప్పుడు, చాలా ఇష్టంగానే కథలు రాసాను. ఇప్పుడు నవలలు మాత్రమే, చాలా.. చాలా.. ఇష్టంగా వ్రాస్తున్నాను.
7) మీరు నవలా రచయిత్రిగానే చాలామందికి తెలుసు. ఇప్పటివరకూ ఎన్ని నవలలు మీరు రాశారు? అవి ఎక్కడెక్కడ పబ్లిష్ అయినాయి?
♣ ఇప్పటివరకూ నేను19 నవలలు వ్రాసాను. నా నవలల్లో కొన్ని నవ్య, స్వాతి వారపత్రిక, తెలుగు తేజం వంటి మాస పత్రికలలో సీరియల్స్గా వచ్చాయి. కొన్నినవలలు- మధుప్రియ, సాహితీ పబ్లికేషన్స్ ద్వారా డైరెక్ట్ నవలలుగా వచ్చాయి. ప్రస్తుతం కొన్నినవలలు, ప్రముఖ తెలుగు అంతర్జాల పత్రికలలో, వివిధ వెబ్సైట్లలో సీరియల్స్గా వస్తున్నాయి. కొన్నిఆడియో-నవలలుగా యుట్యూబ్లో వచ్చాయి.
అంత మాత్రమే కాకుండా ‘నీకు నేనున్నా’, ‘మౌన రాగం’ అనే నవలలు కన్నడంలోనికి అనువదించ బడ్డాయి. ‘మౌనరాగం’ నవల ఆంగ్లంలోకి కూడా అనువదించ బడింది.
అలాగే, ఆకాశవాణి-కడప కేంద్రం నుండి, నా కవితలు, కథానికలూ ప్రసారం అయ్యాయి. వరంగల్ ఆకాశవాణి వారి నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో పాల్గొన్న విషయం మర్చిపోలేను.
8) గృహిణి పాత్రకు న్యాయం చేస్తూనే, మీ రచనావ్యాసంగాన్ని ఎలా విజయవంతం చేసుకోగలిగారు?
♣ నా జీవితం లోకి, నా భర్త గానీ, పిల్లలు కానీ, నేను రచయిత్రిని అయ్యాకే వచ్చారు. నేను పెళ్ళికి ముందే రచయిత్రిని! అయినా నా కుటుంబాన్నీ నా రచనలతో నేనుఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ నుండి నాకంటూ మిగిలిన సమయాన్నిమాత్రమే నా రచనల కోసం వినియోగించుకున్నాను.
నాకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు కాబట్టి నన్ను నేను కంఫర్ట్గా వుంచుకుని, వాళ్ళను కూడా కంఫర్ట్గా ఉంచగలిగాను. లేకుంటే ఎలాంటి సాహిత్యపు సువాసన లేని నా కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటూ ఇన్ని నవలల్ని నేను సాహిత్య లోకానికి అందించగలిగి ఉండేదాన్ని కాదు. నా ఈ విజయానికి కారణం, నా చుట్టూతా వున్న ప్రపంచాన్ని సునిశితమైన దృష్టితో పరిశీలించడం, దీనికి తోడు సాహితీ అభిలాష! ఇవన్నీనా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాను.
9) నవలకుగానీ, కథకు గానీ, వస్తువును ఎన్నుకునే విషయంలో మీకు ప్రత్యేకమైన ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయా? వివరించండి.
♣ నేను వ్రాసే కథలు గానీ, నవలలుగానీ ఒకదానితో ఒకటి పోలిక లేకుండా చూసుకుంటాను. వస్తువును ఎన్నుకునేటప్పుడే, ఇది ఎంతవరకు ఉపయోగ పడుతుంది చదివేవాళ్ళకు -అని ఆలోచిస్తాను. చెప్పాల్సిన అవసరం వున్న అంశాలను మాత్రమే తీసుకుంటాను. ఏది వ్రాసినా సరళంగా, సహజంగా నాకు తెలిసింది మాత్రమే రాస్తాను. మనిషి పరివర్తనకు, సమాజ శ్రేయస్సుకు స్ఫూర్తి నిచ్చేలా వ్రాస్తాను.
10) మీరు జీవితంలో రచయిత్రిగా సంతోషం పొందిన ప్రత్యేక క్షణాలు ఏమైన ఉన్నాయా?
♣ నా రచనలే నా సంతోషం! నా మొదటినవల ప్రింట్ అయినప్పటినుండి ఈ సంతోషాన్ని పొందుతూనే వున్నాను. ఏదీ ఒక్క రోజులో రాదు కదండీ! అన్ని సంతోషాలకూ అతీతమైన సంతోషం ఇది. నేను ఏది వ్రాయాలన్నా ఒంటరిగా, ఏకాగ్రతతో, ఎంత శ్రమించి, తపించి వ్రాస్తానో, అవి పబ్లిష్ అయ్యాక అంతే ఒంటరిగా కూర్చుని సంతోష పడుతుంటాను. దాని కోసం నేను వాడుకునే సమయం నాకు చాలా విలువైనది. కానీ దీనివల్ల నేనుకొన్ని ముఖ్యమైన ఫంక్షన్లను మిస్ అవుతున్నానన్న బాధ కూడా లేకపోలేదు సుమండీ!
11) మీరు వ్రాయాలనుకున్నవి ఇంకా ఏమైనా ఉన్నాయా? వివరించండి.
♣ నేను ఇంకా వ్రాయాలనుకున్నవి చాలా వున్నాయి. సముద్రపు అలల్లా నిరంతరం నా రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు.
12) నేడు మనకు అందుబాటులో వున్న పత్రికల పైన, ముఖ్యంగా అంతర్జాల పత్రికల పైన మీస్పందన తెలియజేయండి అంజనీదేవి గారు.
♣ పత్రిక లేకుంటే రచయిత లేడు. ఒక రచయితగా మీకు తెలియని విషయం కాదు ఇది! అశేష జనాదరణ పొందిన పత్రికలలో మన రచనలు రావడమే ఒక అదృష్టంగా భావిస్తాము కదా.
ఇక అంతర్జాల పత్రికల విషయానికొస్తే, వాటి అవసరం ఎంత ఉందో ఈ కరోనా కాలంలో బాగా అర్థం అయింది, ఈ సంవత్సర కాలంలో ప్రధాన పత్రికలు చాలా మట్టుకు ఆగిపోయాయి. వాటి స్థానాన్ని కొంతవరకు ఈ అంతర్జాల పత్రికలు భర్తీ చేశాయని చెప్పక తప్పదు. ఇకపోతే రచయితకు ఈ పత్రికల వల్ల ఒక సౌలభ్యం వుంది. ఈ పత్రికల్లో రచన వచ్చిన కొద్దీ క్షణాల్లోనే పాఠకుడి స్పందన రచయితకు తెలుస్తుంది. దానికి సరిపడా ప్రతిస్పందన వెంటనే ఇచ్చే అవకాశం రచయితకూ ఉంటుంది. ఈ పద్ధతి వల్ల మంచి జడ్జిమెంట్తో పాటు రచయితకు అవసరమైనంత ఎనర్జీ కూడా లభిస్తుంది.
13) మీరు పొందిన సన్మానాలు —-
♣ 1) ఉమ్మెత్తల సాహితీ పురస్కారం 2) యద్దనపూడి మాతృమూర్తి నవలా పురస్కారం 3) జాతీయ పురస్కారం 4) హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ పురస్కారం 5) భారత మహిళా శిరోమణి పురస్కారం. ఇలా చాలా సందర్భాలలో పురస్కారాలు పొందాను.
14) చాలా సంతోషం అంజనీదేవి గారు. సంచిక -పాఠకులకు మాత్రమే కాకుండా అనేకమంది వర్ధమాన రచయితలకు,రచయిత్రులకు స్ఫూర్తినిచ్చే మీరచనా వ్యాసంగ విశేషాలు చాలా బాగున్నాయి. మీరు మరిన్ని రచనలు తెలుగు పాఠకలోకానికి అందించాలని మనసారా కోరుకుంటూ ‘సంచిక’ పక్షాన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
♣ సంచిక పత్రికకూ, మీకూ ధన్యవాదాలు డా. ప్రసాద్ గారు.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సిబ్బంది కి హృదయ పూర్వక ధన్యవాదములు.
పరిచయము చేసినందుకు ధన్యవాదాలు! ఇంటర్వ్యూలో సమంజస ప్రశ్నలు వేశారు
రాజేంద్ర ప్రసాద్
ప్రసాద్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ
బాగుంది….మీరు ప్రశ్నించిన విధానం…. రచయిత్రి సమాధానాలు విశిష్టంగా/ఉపయుక్తంగా సాగాయి… నాకెందుకో కథ, నవల పెద్దగా యిష్టం వుండదు….మనం గంటలు గంటలు చదివి ఒక నిర్ణయానికి వచ్చే కంటే….ఒక చిన్న కవిత ద్వారా కూడా మనం ప్రేరణ పొందగలమనే విశ్వాసం…. కానీ ప్రక్రియా బద్ధంగా కథ, నవలలు కూడా ఆహ్వానిస్తాను…. అందుకేనేమో వాటిజోలికి పోలేక పోయాను… అంతే కాదు నేను చాలా slow reader ని….!
——ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ హైదారాబాద్.
మీ స్పందన కు ధన్యవాదాలండీ శర్మ గారు.
ఒక రచయిత్రిగా బాధ్యతను, గృహిణిగా అనూసరించవలసిన కర్తవ్యాన్ని వివరించిన రచయిత్రి గారికి, ఇంటర్వూ అందించిన ప్రసాద్ సర్ గారికి ధన్యవాదములు
సాగర్ నీ స్పందన కు ధన్యవాదాలు.
ప్రభావాత్మకమైన ఇంటర్వ్యూ పువ్వుపంట్టగానే పరిమళిస్తుందన్నంత సహజంగా ఉంది ముఖాముఖి మీరు ఎంతోమందికో ప్రేరణాత్మకం
చారి గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
బాగుంది. మీ ప్రశ్నలు, ఆమె సమాధానాలు కూడా బాగున్నాయి.
—-డా.సి.హెచ్.సుశీల హైదారాబాద్.
ధ న్య వాదాలు
చాలా మంచి విషయాలు చెప్పారు. ఉపయుక్తం గా ఉన్నాయి. ఇద్దరకీ అభినందనలు శుభాకాంక్షలు
సుబ్బారావు గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Hello this is Supriya . The interview was very energetic aunty n the way u answered was fabulous …. I have read some books of you when Im in your hostel those were very interested,conveying of characters n taking the story to convincbly …. And the main thing but not the last most of your writings will be based on real incidents… And very realistic to read❤️ love from myside ….
Thank you Supriya Garu
ప్రసాద్ గారూ, మీరు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, వారి సమాధానాలు చాలా స్ఫూర్తి దాయకంగా వున్నాయి. రచయితలను ఇలా పదిమందికి పరిచయం చేయటం వారి ప్రచారానికి తోడ్పడటం ఎంతో అభినందనీయం🙏🏻🙏🏻🙏🏻
Dhanyavaadaalu Jhansi garu.
[02/02, 07:24] Anguloori ANJANIDEVI: Congratulations,you have achieved landmark position in literary/sahiti field.This is the result of ur hard work,sincerity and dedication.I hope you will continue with the same spirit and achieve many goals in future because ur past is ur future.May God bless you. [02/02, 07:29] Anguloori ANJANIDEVI: Retired Asp Karanam Malyadri Nellore
Thank you Somuch sir.
[02/02, 07:31] Anguloori ANJANIDEVI: Excellent interview andi 👏👏 [02/02, 07:33] Anguloori ANJANIDEVI: K. Anusha Hyd
Thank you andee.
Chala Chala bagundi Nenu anukunna danikannaa bagochhindi… Superb sir Once again thank you
—-అంగులూరి అంజనీ దేవి. రచయిత్రి హనంకొండ.
మీకు శుభాకాంక్షలు మేడం.
Yes sir, went through it. You did the job of a Literary section Pex a la CS Rambabu ❤️🙏
— Nakka sudhakar All India Radio Hyderabad.
Thank you Sudhaakar garu.
[02/02, 09:24] Anguloori ANJANIDEVI: Heartily Congratulations Anjanidevi garu [02/02, 09:24] Anguloori ANJANIDEVI: Deputy Para Medical officer [02/02, 09:24] Anguloori ANJANIDEVI: M. Mohanrao Nellore
ధన్య వాదా లు సర్
[02/02, 12:21] Anguloori ANJANIDEVI: Ooh Chala bagundi your really great.iam proud of my friend!! [02/02, 12:23] Anguloori ANJANIDEVI: Vijayalakshmi Retired police Inspecter Hanamkonda
విజయ లక్ష్మి గారూ ధన్య వాదాలు
[02/02, 14:02] Anguloori ANJANIDEVI: Chala Bagundi Mee interview Mee gurinchi Chala vishayalu thelisayi madam puvvu puttagane parimalisthundi and mata Mee vishayam lo nijam ayyindi nenu yaddana pudi navalalu Baga chadive Danni ippudu Mee navalalu Anni chaduvuthunnanu Naku Chala santhoshanga vundi meeru Naku thelisina vallu ayinanduku Inka Chala Navalalu meeru Rayali memu chadavali [02/02, 14:08] Anguloori ANJANIDEVI: Vanam Aruna Hanumakonda.
అరుణ గారూ ధన్య వాదాలు
అంగులూరి అంజనీ దేవి గారి ఇంటర్వూ నచ్చింది.ఇరువురుకీ అభినందనలు .
మీ స్పందనకు ధన్య వాదాలు.
Good morning sir, Madam is an inspiration to girls like us who are about to take all the responsibilities inspite fulfilling our wishes and dreams. The way madam handling her own interests along with managing the family are really tremendous. Thank you sir for introducing madam to us. We all cherished by reading the article.
Amma Thank you somuch
[03/02, 15:35] Anguloori ANJANIDEVI: Anjani devi gariki namaskaram. Mee rachanala chala adbhuthamga unnayandi. Vastavaniki daggaraga untunnayi. Chaduvutunte time teliyatamledu malli maaku patharojullo yaddanpudi novel chadivina anubhuthi kalugutundi. Meeru ilage manchi manchi rachanalu malanti pathakula kosam rasthune undalani manaspoorthiga korukuntunna dhanyavadalu. [03/02, 15:54] Anguloori ANJANIDEVI: Vani Prasad kadapa
వాణీ ప్రసాద్ గారూ ధన్యవాదాలు మీకు.
మృదుభాషిణి అంగులూరి! ————- డా.రాధేయ
ఈ రోజు సంచిక లో అంగులూరి అంజనీదేవి గారితో ఇంటర్వ్యూ ఆసాంతం చదివాను.వారు నాకు 1981 నుంచి పరిచయం. ఆమె స్వతహాగా సున్నిత మనస్కులు.మృదుభాషిణి, భావుకత నిండిన కవితా హృదయం వారిది. ఆమె నవలా రచయిత్రి అయినా. వారు సృష్టించిన పాత్రల్లో మమేకమై ఆయా సన్నివేశాల్లో ,సంభాషణల్లో కవిత్వమే తొణికిస లాడుతుంది.. వారి చదువు,జీవన గమనం,సాహిత్య జీవితం కూడా పాఠకులకు ఎంతో సంస్కారం నేర్పుతుంది. వారి తండ్రి గారు కూడా నాకు పరిచయమే. వారు కూడా గొప్ప సాహిత్యాభిమానం, సేవా భావం గలవారే, తన కూతురు రచయిత్రి కావడం పట్ల ఆయన ఎంతో మురిసి పోయేవారు. అందుకే కాబోలు కూతురికి కూడా తండ్రి సంస్కారమే అబ్బింది..
డా.రాధేయ గారు మీ స్పందన కు ధన్యవాదాలండీ.
శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారితో డా.కె.ఎల్.వి. ప్రసాదుగారు చేసిన ఇంటర్వ్యూ చదివి ఎంతో సంతోషించాను. శ్రీమతి అంజనీదేవి నాకు 1984 నుండి పరిచయం. మా ప్రొద్దుటూరులో ఆమె భర్త SBH లో పని చేస్తుండం వల్ల అక్కడ వుండేవారు. అప్పుడే ఆమె కవితా సంపుటి ‘గుండె లోంచి అరుణోదయం’ వెలువరించారు. మంచి భావుకత ఉన్న కవయిత్రి. తర్వాత నవలా ప్రక్రియ చేపట్టి నవలా ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం మాకు సంతోషాన్ని కలిగించింది. ఆమెతో చక్కని పరిచయం గావించిన ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.
-జింకా సుబ్రహ్మణ్యం, కార్యదర్శి, మహాకవి, సరస్వతీ పుట్టపర్తి నారాయణాచార్యులు సాహితీ పీఠం, ప్రొద్దుటూరు కడప జిల్లా.
మీ స్పందన అద్భుతం. మీకు ధన్యవాదాలు.
అంగులూరి అంజనీదేవి గారి నవలలంటే నాకెంతో ఇష్టం..మధురిమ, ఆమె అతడిని మార్చుకుంది మొదలైన నవలలు నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకొని చదివాను.. తరువాత ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళినా యద్దనపూడి సులోచనారాణి గారివి,కొండెంపూడి నిర్మల గారివి, బలభద్రపాత్రుని రమణి గారివి, ఇలా అందరి నవలలతో పాటు అంజనీ దేవి గారి నవలలను కూడా వెతుక్కొని తెచ్చుకునేదానిని…తన నవలలో వరంగల్ ప్రాంతంలోని పేర్లను చదువుతూ ఉంటె ఎక్కడలేని సంతోషమనిపించేది..అలాంటి నాకు అదృష్టం కొద్ది ఒకరోజు హన్మకొండ లోని మాంగళ్య షాపింగ్ మాల్ లో అంజనీదేవి గారు పరిచయమవ్వడం నన్ను తనకు సారీస్ సెలెక్ట్ చేయమని అడగడం నిజంగా నా జీవితం లో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు… అప్పటినుండి అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుకోవడం నేను ఆంటీ పిలిస్తే ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతారు అంజనీ దేవి గారు…నేనడగగానే నా “వాసంత సమీరాలు” కవితా సంపుటికి “గుప్పుమన్న భావపరిమళం” అంటూ అభినందన జల్లు కురిపించారు…అంతేకాకుండా తన నవలలన్నింటినీ నాకు బహుమతిగా పంపారు…ఆ బహుమతి నాకెంతో అమూల్యమైనది… మీ గురించిన పరిచయం ఎంతో బాగుంది… శుభాభినందనలు ఆంటీ..
Thank you madam.
అంగులూరి అంజనీ దేవి గారిని చక్కగా పరిచయం చేశారు సార్ ….మీరు అడిగిన ప్రశ్నలు వారి జవాబులు స్పుర్తిదాయకంగా ఉన్నాయి..వారి నవలలు యూట్యూబ్ లో విన్నాను.. చక్కని కంఠస్వరం మరియు అందమైన అభివ్యక్తి, ప్రతిలిపిలో సైతం వారి రచనలు బాగుంటాయి.. హన్మకొండ వాసియైననూ ఫోన్లో తప్ప వారి ముఖం పరిచయం లేదు..కానీ అందమైన అక్షరపరిచయం ఇలా సంచిక మరింత దగ్గర చేసింది,సంచికకూ,మీకూ ధన్యవాదములు,అంజనీమేడంకి అభినందనలు 🌷🌱🌷🌱
——– బాలబోయిన రమాదేవి హనంకొండ.
అమ్మా … మీ స్పందన కు ధన్యవాదాలండీ
అంగులూరి అంజనీదేవి గారు వాసి లోను రాశి లోను గొప్ప నవలా సాహిత్యం సృష్టించిన విధూషీ మణి. ఈమె అక్షరానికి విలువ ఇస్తుందే కానీ కాకాలతో కాలం వెల్లబుచ్చే నేచర్ కాదామెది. ఆమె కు ఇంకా మంచి గుర్తింపు రావాలి. ఇంటర్వ్యూవ్ బాగుంది. కొండ్రెడ్డి,..9948774243
శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు! డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ గారు మీతో చేసిన ఇంటర్వ్యూ ఆద్యంతం చదివాను. ఎంతో ఆసక్తికరంగా సాగింది. అనేక నవలలు రాసిన నవలారాణి అంతరంగ ఆవిష్కరణ అద్భుతం. పవని నిర్మల ప్రభావతి గారు అంగులూరి ని ప్రోత్సహించిన తీరు అమోఘం. కన్నకూతురిని కవయిత్రిగా చూడాలన్న నాన్న తాపత్రయం అద్వితీయం. కవయిత్రిగా, గృహిణి గా మీ ద్విపాత్రాభినయం అందరికి ఆదర్శనీయం. మీ మౌనరాగం కన్నడం లో కూడా అనుసృజనీకరించబడటం అభినందనీయం. మీ మది గదిలో పదిల పరచిన నవలలు జీవనదిలా అందరికి అనవరతం అందించాలని ఆకాంక్షిస్తూ … పి.ఎల్ ప్రభుదాస్. క్రైస్తవ సాహిత్యం లో, (రాష్ట్ర స్థాయి) ఆ.ప్ర ముఖ్యమంత్రి అవార్డు గ్రహీత. (లెక్చరర్) కావలి. నెల్లూరు జిల్లా.
ప్రభు దాస్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ
ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారిని చక్కగా పరిచయం చేసారండీ.. ఆవిడకీ, మీకూ అభినందనలు..
ధన్య వాదాలు మేడం.
నమస్కారం! భారత మహిళా శిరోమణి, జాతీయ పురస్కారం మరెన్నో పురస్కారాలు అందుకున్న తెలుగు రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారితో దూరవాణి/చెరవాణి ద్వారా సంభాషించడం, వారు వ్రాసిన నవలలు చదవడం నా అదృష్టం. సరళముగా, విపులముగా, సాధారణ సన్నివేశమును అద్భుతముగా పండిత పామరులకు సైతం అర్ధమయ్యే భాషలో వ్రాయటం వారి ప్రత్యేక శైలి. ఒక గృహిణిగా, మాతృమూర్తిగా, సమాజ శ్రేయస్సు కొరకు తన వంతు సాయంగా గుప్త దానాలు చేసే దాతగా, తెలుగు సాహిత్యలోకంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుత నవలా రచయిత్రిగా వెలుగొందుతున్న శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు బహుముఖ ప్రజ్ఞాశీలి. తల్లిదండ్రులపై వారికున్న ప్రేమాభిమానం మాటల్లో చెప్పలేము. తల్లిదండ్రులకు స్మారక మందిరాన్ని నిర్మించిన గొప్ప కుమార్తె మాత్రమే కాదు వారిని ఎల్లప్పుడూ స్మరించుకునే మహోన్నతమైన వ్యక్తిత్వం ఆమె సొంతం. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి కీర్తి యశస్సు ఆచంద్రతారార్కము. వీరు మరెన్నో గొప్ప రచనలు చేయాలనీ, ఉత్తమ పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ… ఇంత చక్కటి సంభాషణను మాకు అందించిన డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారికి మనఃపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ.. మీ భవదీయుడు శ్రీ కందుకూరి గోపినాథ్ గణన యంత్ర సమాచార సాంకేతిక శాస్త్ర సూత్రధారి (SWE-IT) బెంగళూరు
మీ అద్భుత స్పందనకు ధన్యవాదాలు సర్.
అంగులూరి అంజనీదేవిగారి తో డా.కె.ఎల్.వి.ప్రసాద్ గారి సంభాషణం బాగుంది. మంచి పరిచయము.
కుమార్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™